తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో చేతులు కలిపి ముందుకు వెళ్లిన బీజేపీ.. పొత్తు ధర్మాన్ని విస్మరించిందా? పవన్కు భారీ షాకే ఇచ్చిందా? నా నోట్లో నీ వేలు పెట్టు.. నీ కంట్లో నా వేలు పెడతా! అన్న చందంగా వ్యవహరించి.. మొత్తానికే మోసం చేసిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. బీజేపీతో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పార్టీ 8 స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎనిమిది ఇచ్చేందుకు కూడా.. బీజేపీ అనేక బేరాలు పెట్టింది. షరతులు కూడా విధించింది.
మాకు ప్రచారం చేయాలి.. మీ ఇమేజ్ మాకు ఉపయోగపడాలి.. అని బీజేపీ పెద్దలు తేల్చి చెప్పారు. దీనికి కూడా పవన్ ఓకే చెప్పారు. కానీ, వాస్తవానికి తెలంగాణ జనసేన నాయకులు 25 స్థానాలు కావాలని పట్టుబట్టారు. ఈ విషయం పవన్ కూడా ప్రస్తావించారు. కనీసంలో కనీసం 15 స్థానాలు ఇవ్వాలన్నారు. కానీ, బీజేపీ పెద్దలు ససేమిరా అనేసి.. కేవలం 8 స్థానాలకు కట్టడి చేశారు. పోనీ.. ఆ స్థానాల్లో అయినా.. జనసేనకు పార్టీ తరఫున వారు చేసిందేమైనా ఉందా? అంటే.. లేనే లేదు.
తాజాగా వచ్చిన తెలంగాణ ఫలితాల్లో ఒక్క కూకట్ పల్లి తప్ప.. మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో జనసేన కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయింది. కూకట్ పల్లిలో మాత్రం డిపాజిట్ దక్కింది. మరి ఇంతగా జనసేన ఓడిపోవడానికి రీజనేంటి? అంటే.. అందరి వేళ్లూ కమల నాథుల వైపే చూపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ను బీజేపీ నమ్మించి మోసం చేసిందని అంటున్నారు.
పవన్ ఆలోచనలకు విరుద్ధంగా ఆయనపై ఒత్తిడి తీసుకువచ్చి అత్యంత స్వల్ప సంఖ్యలోనే సీట్లను కట్టబెట్టడం ఒక తప్పయితే.. తమ ఓటు బ్యాంకును జనసేనకు బదిలీ చేయకపోవడం మరో ప్రధాన మోసంగా చెబుతున్నారు. దీంతో కనీసం వెయ్యిలోపు ఓట్లు కూడా.. జనసేన నాయకులు దక్కించుకోలేక పోయారు. వాస్తవానికి బీజేపీకి నగర స్థాయిలో 50మంది కార్పొరేటర్లు ఉన్నారు.
బీజేపీ కనుక వీరికి సరైన ఆదేశాలు ఇచ్చి ఉంటే.. క్షేత్రస్థాయిలో జనసేనకు బీజేపీ ఓట్లు పడి గెలుపు గుర్రం ఎక్కి ఉండేవారు. కానీ, బీజేపీ అలా చేయకుండా.. దుర్నీతి రాజకీయాలు చేసిందనే టాక్ వినిపిస్తోంది. పైకి మాత్రం నీతులు చెబుతూ.. లోపాయికారీగా.. తన మిత్రుడి పార్టీనే దెబ్బేసేసిందనే వాదన వినిపిస్తోంది.
This post was last modified on December 4, 2023 11:40 am
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
నిందితులను పోలీసులు పబ్లిక్లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…