Political News

ప‌వ‌న్‌ను బీజేపీ మోసం చేసిందా?!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీతో చేతులు క‌లిపి ముందుకు వెళ్లిన బీజేపీ.. పొత్తు ధ‌ర్మాన్ని విస్మ‌రించిందా? ప‌వ‌న్‌కు భారీ షాకే ఇచ్చిందా? నా నోట్లో నీ వేలు పెట్టు.. నీ కంట్లో నా వేలు పెడ‌తా! అన్న చందంగా వ్య‌వ‌హ‌రించి.. మొత్తానికే మోసం చేసిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. బీజేపీతో పొత్తులో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ 8 స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎనిమిది ఇచ్చేందుకు కూడా.. బీజేపీ అనేక బేరాలు పెట్టింది. ష‌ర‌తులు కూడా విధించింది.

మాకు ప్ర‌చారం చేయాలి.. మీ ఇమేజ్ మాకు ఉప‌యోగ‌ప‌డాలి.. అని బీజేపీ పెద్ద‌లు తేల్చి చెప్పారు. దీనికి కూడా ప‌వ‌న్ ఓకే చెప్పారు. కానీ, వాస్త‌వానికి తెలంగాణ జ‌న‌సేన నాయ‌కులు 25 స్థానాలు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఈ విష‌యం ప‌వ‌న్ కూడా ప్ర‌స్తావించారు. క‌నీసంలో క‌నీసం 15 స్థానాలు ఇవ్వాల‌న్నారు. కానీ, బీజేపీ పెద్ద‌లు స‌సేమిరా అనేసి.. కేవ‌లం 8 స్థానాల‌కు క‌ట్ట‌డి చేశారు. పోనీ.. ఆ స్థానాల్లో అయినా.. జ‌నసేన‌కు పార్టీ త‌ర‌ఫున వారు చేసిందేమైనా ఉందా? అంటే.. లేనే లేదు.

తాజాగా వ‌చ్చిన తెలంగాణ ఫ‌లితాల్లో ఒక్క కూక‌ట్ ప‌ల్లి త‌ప్ప‌.. మిగిలిన ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక పోయింది. కూక‌ట్ ప‌ల్లిలో మాత్రం డిపాజిట్ ద‌క్కింది. మ‌రి ఇంత‌గా జ‌న‌సేన ఓడిపోవ‌డానికి రీజ‌నేంటి? అంటే.. అంద‌రి వేళ్లూ క‌మ‌ల నాథుల వైపే చూపిస్తున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను బీజేపీ న‌మ్మించి మోసం చేసింద‌ని అంటున్నారు.

ప‌వ‌న్ ఆలోచ‌న‌ల‌కు విరుద్ధంగా ఆయ‌న‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చి అత్యంత స్వ‌ల్ప సంఖ్య‌లోనే సీట్ల‌ను క‌ట్ట‌బెట్ట‌డం ఒక త‌ప్ప‌యితే.. త‌మ ఓటు బ్యాంకును జ‌న‌సేన‌కు బ‌దిలీ చేయ‌క‌పోవ‌డం మ‌రో ప్ర‌ధాన మోసంగా చెబుతున్నారు. దీంతో క‌నీసం వెయ్యిలోపు ఓట్లు కూడా.. జ‌న‌సేన నాయ‌కులు ద‌క్కించుకోలేక పోయారు. వాస్త‌వానికి బీజేపీకి న‌గ‌ర స్థాయిలో 50మంది కార్పొరేట‌ర్లు ఉన్నారు.

బీజేపీ క‌నుక వీరికి స‌రైన ఆదేశాలు ఇచ్చి ఉంటే.. క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన‌కు బీజేపీ ఓట్లు ప‌డి గెలుపు గుర్రం ఎక్కి ఉండేవారు. కానీ, బీజేపీ అలా చేయ‌కుండా.. దుర్నీతి రాజ‌కీయాలు చేసింద‌నే టాక్ వినిపిస్తోంది. పైకి మాత్రం నీతులు చెబుతూ.. లోపాయికారీగా.. త‌న మిత్రుడి పార్టీనే దెబ్బేసేసింద‌నే వాద‌న వినిపిస్తోంది.

This post was last modified on December 4, 2023 11:40 am

Share

Recent Posts

సందీప్ కిషన్ మూవీకి టెన్షన్ లేదు

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…

2 minutes ago

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

55 minutes ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

3 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

4 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

4 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

5 hours ago