Political News

కరోనా వేళ.. సుప్రీంకోర్టు జడ్జి స్ఫూర్తిదాయక నిర్ణయం

ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనాతో దేశంలో ఎలాంటి పరిస్థితి నెలకొందో తెలిసిందే. రికార్డుస్థాయిలో నమోదవుతున్న కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయినప్పటికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయంలో ప్రముఖులు మొదలు సామాన్యుల వరకు తీసుకోవటం లేదని చెబుతున్నారు.

వీలైనంతవరకు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండటం.. భౌతిక దూరంపాటించటం.. అనవసరంగా బయట తిరిగే కార్యక్రమాల్ని వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు.

ఇలాంటివేళ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు ఆదర్శప్రాయంగా నిలవటమే కాదు.. నలుగురికి స్ఫూర్తినిచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా తాజాగా రిటైర్ అయ్యారు. దీంతో ఆయనకు వీడ్కోలుకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బార్ అసోసియేషన్ సభ్యులు. సెప్టెంబరు రెండున ఆయన వీడ్కోలుకు భారీగా ప్లాన్ చేశారు.

బార్ అసోసియేషన్ వారు తన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం గురించి తెలిసి.. వారికి రాసిన లేఖ ఇప్పుడు ఆదర్శవంతంగా మారింది. తనకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన ఆయన.. కరోనా వేళ.. ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

న్యాయ వ్యవస్థకు బార్ అసోసియేషన్ తల్లిలాంటిదని.. అక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనటం తాను గౌరవంగా భావిస్తానని చెప్పారు. అయితే.. ఇప్పటి పరిస్థితుల్లో అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉందామన్నారు. కోవిడ్ పరిస్థితులు తగ్గిపోయిన తర్వాత కార్యక్రమం ఏర్పాటు చేస్తే తాను హాజరవుతానని పేర్కొన్నారు. మామూలు సందర్భాల్లో ఆదర్శాలు వల్లించే వారంతా.. తమ వరకు వచ్చేసరికి వాటిని మర్చిపోతుంటారు. అందుకు భిన్నంగా వ్యవహరించిన జస్టిస్ అరుణ్ మిశ్రా అందరికి ఆదర్శ ప్రాయులుగా చెప్పక తప్పదు.

This post was last modified on August 31, 2020 5:03 pm

Share
Show comments
Published by
Satya
Tags: Covid19

Recent Posts

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

30 minutes ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

40 minutes ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

43 minutes ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

1 hour ago

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

1 hour ago

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

2 hours ago