తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్.. క్లారిటీతో ఉందా? ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా ఏం చేయాలనే అంశంపై సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో ఉన్నారా? ఆయన వ్యూహం ఆయనకు ప్రత్యేకంగా ఉందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా.. సొంత నిఘా వర్గాల ద్వారా కూడా కేసీఆర్కు ఎప్పుడో రాష్ట్ర పరిస్థితి, ప్రజానాడిపై అవగాహన ఉందని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే ఆయన అలుపెరుగని విధంగా శ్రమించారని అంటున్నారు.
సహజంగానే పదేళ్ల పాలనపై ఉండే ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు కేసీఆర్ చాలా వ్యూహాత్మకం గానే ప్రస్తుత ఎన్నికల్లో వ్యవహరించారనే చర్చలు ఉన్నాయి. 2014, 2018లో కూడా చేయని సుడిగాలి పర్యటనలు ఆయన చేశారు. లెక్కకు మించి సభల్లో పాల్గొన్నారు. మరోవైపు యాగాలు చేశారు. ఇంకోవైపు పథకాలు ప్రకటించారు. మొత్తంగా చూస్తే.. ఏవిషయాన్నీ కేసీఆర్ విస్మరించలేదు. అయినప్పటికీ.. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితం మాత్రం.. తేడా వచ్చింది.
అయితే.. గెలుపు ఓటములు కేసీఆర్కు ఎప్పుడూ కొత్తకాదు కాబట్టి.. దీనిని ఆయన లైట్ తీసుకుంటారనేది అందరికీ తెలిసిందే. అలాగని ఆయన ఇంటికైతే పరిమితం అయ్యే పరిస్థితిలేదు. ఇక, ఇప్పుడు బీఆర్ ఎస్ను జాతీయస్థాయిలో పాదుకొల్పేందుకు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారని.. రాష్ట్ర పార్టీ పగ్గాలను పూర్తిస్థాయిలో కుమారుడికి అప్పగించినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
“కేసీఆరే చెప్పినట్టు.. గెలిచినా.. ఓడినా ఆయనకు పెద్దగా నష్టం లేదు. అయితే.. ఆయన జాతీయ స్థాయిలో మరింత తన హవా పెంచుకునేందుకు ఈ పరిణామాలను అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది” అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తీకరించారు. మరో మూడు మాసాల్లోనే ఎన్నికలు ఉన్ననేపథ్యంలో కేసీఆర్.. ఈ ఓటమిని.. అప్పటి విజయానికి దారిగా మలుచుకునే అవకాశం ఉందని అంటున్నారు. 17 పార్లమెంటు స్థానాల్లో 12 -14 మధ్య గెలిచే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. సో.. ఇదీ సంగతి!!
This post was last modified on December 1, 2023 10:39 am
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…