తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్.. క్లారిటీతో ఉందా? ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా ఏం చేయాలనే అంశంపై సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో ఉన్నారా? ఆయన వ్యూహం ఆయనకు ప్రత్యేకంగా ఉందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా.. సొంత నిఘా వర్గాల ద్వారా కూడా కేసీఆర్కు ఎప్పుడో రాష్ట్ర పరిస్థితి, ప్రజానాడిపై అవగాహన ఉందని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే ఆయన అలుపెరుగని విధంగా శ్రమించారని అంటున్నారు.
సహజంగానే పదేళ్ల పాలనపై ఉండే ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు కేసీఆర్ చాలా వ్యూహాత్మకం గానే ప్రస్తుత ఎన్నికల్లో వ్యవహరించారనే చర్చలు ఉన్నాయి. 2014, 2018లో కూడా చేయని సుడిగాలి పర్యటనలు ఆయన చేశారు. లెక్కకు మించి సభల్లో పాల్గొన్నారు. మరోవైపు యాగాలు చేశారు. ఇంకోవైపు పథకాలు ప్రకటించారు. మొత్తంగా చూస్తే.. ఏవిషయాన్నీ కేసీఆర్ విస్మరించలేదు. అయినప్పటికీ.. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితం మాత్రం.. తేడా వచ్చింది.
అయితే.. గెలుపు ఓటములు కేసీఆర్కు ఎప్పుడూ కొత్తకాదు కాబట్టి.. దీనిని ఆయన లైట్ తీసుకుంటారనేది అందరికీ తెలిసిందే. అలాగని ఆయన ఇంటికైతే పరిమితం అయ్యే పరిస్థితిలేదు. ఇక, ఇప్పుడు బీఆర్ ఎస్ను జాతీయస్థాయిలో పాదుకొల్పేందుకు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారని.. రాష్ట్ర పార్టీ పగ్గాలను పూర్తిస్థాయిలో కుమారుడికి అప్పగించినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
“కేసీఆరే చెప్పినట్టు.. గెలిచినా.. ఓడినా ఆయనకు పెద్దగా నష్టం లేదు. అయితే.. ఆయన జాతీయ స్థాయిలో మరింత తన హవా పెంచుకునేందుకు ఈ పరిణామాలను అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది” అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తీకరించారు. మరో మూడు మాసాల్లోనే ఎన్నికలు ఉన్ననేపథ్యంలో కేసీఆర్.. ఈ ఓటమిని.. అప్పటి విజయానికి దారిగా మలుచుకునే అవకాశం ఉందని అంటున్నారు. 17 పార్లమెంటు స్థానాల్లో 12 -14 మధ్య గెలిచే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. సో.. ఇదీ సంగతి!!
This post was last modified on December 1, 2023 10:39 am
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…