ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు రోజులుగా చర్చనీయాంశంగా మారిన అంశం.. విశాఖపట్నంలో శ్రీకాంత్ అనే కుర్రాడికి శిరోముండనం చేయించడం. బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన నూతన్ నాయుడు కుటుంబం ఈ దళిత యువకుడికి బలవంతంగా గుండు కొట్టించిన ఉదంతం సంచలనం రేపింది.
తమ ఇంట్లో దొంగతనానికి పాల్పడి పని మానేశాడన్న కారణంతో నూతన్ కుటుంబం ఈ దారుణానికి ఒడిగట్టింది. సీసీ కెమెరాలో ఈ మొత్తం ఉదంతం రికార్డవడం, అది సోషల్ మీడియాలోకి రావడంతో దీనిపై పెద్ద దుమారమే రేగింది.
ఇంతకుముందే ఏపీలో ఓ దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన సంచలనం రేపింది. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో రాజకీయంగా వేడి రాజుకుంది.
మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అవుతున్న ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. నూతన్ నాయుడు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బాధిత యువకుడిని విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీకాంత్కు లక్ష రూపాయల నగదు, సొంత ఇల్లుతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వబోతున్నట్లు అవంతి శ్రీనివాస్ వెల్లడించడం గమనార్హం. ఈ మేరకు ఆయన అధికారులను ఆదేశించారు.
మంత్రి వెంట ఉన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తన సొంత నగదు రూ.50 వేలను శ్రీకాంత్కు అందజేశారు. ఐతే రాజకీయ కోణంలో మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 31, 2020 10:58 am
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…