ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు రోజులుగా చర్చనీయాంశంగా మారిన అంశం.. విశాఖపట్నంలో శ్రీకాంత్ అనే కుర్రాడికి శిరోముండనం చేయించడం. బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన నూతన్ నాయుడు కుటుంబం ఈ దళిత యువకుడికి బలవంతంగా గుండు కొట్టించిన ఉదంతం సంచలనం రేపింది.
తమ ఇంట్లో దొంగతనానికి పాల్పడి పని మానేశాడన్న కారణంతో నూతన్ కుటుంబం ఈ దారుణానికి ఒడిగట్టింది. సీసీ కెమెరాలో ఈ మొత్తం ఉదంతం రికార్డవడం, అది సోషల్ మీడియాలోకి రావడంతో దీనిపై పెద్ద దుమారమే రేగింది.
ఇంతకుముందే ఏపీలో ఓ దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన సంచలనం రేపింది. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో రాజకీయంగా వేడి రాజుకుంది.
మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అవుతున్న ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. నూతన్ నాయుడు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బాధిత యువకుడిని విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీకాంత్కు లక్ష రూపాయల నగదు, సొంత ఇల్లుతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వబోతున్నట్లు అవంతి శ్రీనివాస్ వెల్లడించడం గమనార్హం. ఈ మేరకు ఆయన అధికారులను ఆదేశించారు.
మంత్రి వెంట ఉన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తన సొంత నగదు రూ.50 వేలను శ్రీకాంత్కు అందజేశారు. ఐతే రాజకీయ కోణంలో మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 31, 2020 10:58 am
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…