ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు రోజులుగా చర్చనీయాంశంగా మారిన అంశం.. విశాఖపట్నంలో శ్రీకాంత్ అనే కుర్రాడికి శిరోముండనం చేయించడం. బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన నూతన్ నాయుడు కుటుంబం ఈ దళిత యువకుడికి బలవంతంగా గుండు కొట్టించిన ఉదంతం సంచలనం రేపింది.
తమ ఇంట్లో దొంగతనానికి పాల్పడి పని మానేశాడన్న కారణంతో నూతన్ కుటుంబం ఈ దారుణానికి ఒడిగట్టింది. సీసీ కెమెరాలో ఈ మొత్తం ఉదంతం రికార్డవడం, అది సోషల్ మీడియాలోకి రావడంతో దీనిపై పెద్ద దుమారమే రేగింది.
ఇంతకుముందే ఏపీలో ఓ దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన సంచలనం రేపింది. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో రాజకీయంగా వేడి రాజుకుంది.
మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అవుతున్న ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. నూతన్ నాయుడు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బాధిత యువకుడిని విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీకాంత్కు లక్ష రూపాయల నగదు, సొంత ఇల్లుతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వబోతున్నట్లు అవంతి శ్రీనివాస్ వెల్లడించడం గమనార్హం. ఈ మేరకు ఆయన అధికారులను ఆదేశించారు.
మంత్రి వెంట ఉన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తన సొంత నగదు రూ.50 వేలను శ్రీకాంత్కు అందజేశారు. ఐతే రాజకీయ కోణంలో మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 31, 2020 10:58 am
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…