తెలంగాణ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే చివరి రోజు ప్రచారం సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల హామీలు, వాగ్దానాలతో హోరెత్తించారు. తమకు ఓటేసి గెలిపించాలని, ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు.
అయితే, హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మాత్రం రొటీన్ కు భిన్నంగా మాట్లాడిన మాటలు సంచలనం రేపుతున్నాయి. తనకు ఓటు వేసి గెలిపించాలని కోరిన కౌశిక్ రెడ్డి ఓడిపోతే తనకు చావే గతి అన్న రీతిలో చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. తనకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర అని… ఓడితే శవయాత్ర..అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. తాను ఏ యాత్ర చేయాలో ప్రజలే నిర్ణయించుచాలంటూ ఓటర్లనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
‘మీరు ఓడగొడితే నేను ఇక్కడ ఉరి తీసుకోవాలా? ఇక మీ ఇష్టం. ఏం చేస్తారో మీ ఇష్టం…మీరు మాకు ఓటేయకుంటే మా ముగ్గురి శవాలను మీరు చూడాలి. మెజార్టీ ఇస్తే జైత్రయాత్రకు వస్తా.. లేదంటే నాలుగో తేదీన శవయాత్రకు మీరు రండి’ అంటూ కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్లు ఇపుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.
This post was last modified on November 29, 2023 6:15 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…