తెలంగాణ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే చివరి రోజు ప్రచారం సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల హామీలు, వాగ్దానాలతో హోరెత్తించారు. తమకు ఓటేసి గెలిపించాలని, ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు.
అయితే, హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మాత్రం రొటీన్ కు భిన్నంగా మాట్లాడిన మాటలు సంచలనం రేపుతున్నాయి. తనకు ఓటు వేసి గెలిపించాలని కోరిన కౌశిక్ రెడ్డి ఓడిపోతే తనకు చావే గతి అన్న రీతిలో చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. తనకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర అని… ఓడితే శవయాత్ర..అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. తాను ఏ యాత్ర చేయాలో ప్రజలే నిర్ణయించుచాలంటూ ఓటర్లనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
‘మీరు ఓడగొడితే నేను ఇక్కడ ఉరి తీసుకోవాలా? ఇక మీ ఇష్టం. ఏం చేస్తారో మీ ఇష్టం…మీరు మాకు ఓటేయకుంటే మా ముగ్గురి శవాలను మీరు చూడాలి. మెజార్టీ ఇస్తే జైత్రయాత్రకు వస్తా.. లేదంటే నాలుగో తేదీన శవయాత్రకు మీరు రండి’ అంటూ కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్లు ఇపుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.
This post was last modified on November 29, 2023 6:15 am
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…