ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షాలు అనేక ఫిర్యాదులు చేస్తున్నాయి. ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య వాదులు కూడా.. అనేక రూపాల్లో ఫిర్యాదులు మొస్తున్నాయి. ప్రభుత్వం దూకుడుగా ఉంటోందని.. ప్రతిపక్షాల గొంతు నులిమేస్తోందని.. ప్రజలను హింసిస్తోందని.. ఎస్సీలు, ఎస్టీలపైనా దాడులు చేస్తోందని.. ఇలా .. అనేక రూపాల్లో నిత్యంవందల కొద్దీ ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే.. ఇవన్నీ.. రాజకీయంగా అన్ని రాష్ట్రాల్లోనూ జరిగేవే.
అయితే.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి నేరుగా.. జగన్కు ఒకప్పుడు సన్మిత్రుడుగా వ్యవహరించి.. ఆయన కోసం తిరుమలలోనే సుదర్శనయాగం చేసి.. తిరుమల వ్యవహారాలపై నిత్యం.. వైసీపీకి(అప్పట్లో ప్రతిప క్షం) లీకులు అందించిన.. అప్పటి ప్రధాన అర్చకుడు.. రమణ దీక్షితులే.. ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ప్రధాని మోడీ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
సోమవారం ఉదయం ప్రధాని మోడీ.. శ్రీవారిని దర్సించుకున్న అనంతరం.. ఆయన బస చేసిన శ్రీరచన గెస్ట్ హౌస్లో ప్రత్యేకంగా రమణ దీక్షితులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన జగన్ సర్కారుపై పుంఖాను పుంఖానులుగా ఫిర్యాదులు సమర్పించారు. తిరుమల ఆలయం ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉందని.. శ్రీవారి ఆలయాన్ని పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోడీకి రమణ దీక్షితులు విజ్ఞప్తి చేశారు.
అంతేకాదు.. రాష్ట్రంలో హిందూ దేవాలయాల పురాతన సంప్రదాయాలు, నిర్మాణాలు, ఆస్తులను టీటీడీలోని సనాతన అధికారి క్రమ పద్ధతిలో నాశనం చేస్తున్నాడని పేర్కొన్నారు. దయచేసి శ్రీవారి ఆలయాన్ని రక్షించి ఇక్కడ వెంటనే హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలని.. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని మోడీకి రమణ దీక్షితులు విన్నవించినట్టు తెలిసింది. ఏదేమైనా.. సరిగ్గా ఐదేళ్ల కిందట ఇదేసమయంలో సీఎం జగన్కు అన్నీతానై.. వ్యవహరించిన రమణదీక్షితులు ఇప్పుడు పూర్తిగా యాంటీ కావడం చర్చనీయాంశం అయింది.
This post was last modified on November 27, 2023 3:53 pm
ఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత రామజన్మభూమి అయోధ్యలో ఉన్న బాలరామయ్య ఆలయానికి రాజకీయ గ్రహణం వీడినట్టేనా? ఇక, ఆలయానికి రాజకీయ ప్రభావం,…
సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…
టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…