Political News

తిరుమ‌ల నాశ‌నం: జ‌గ‌న్ స‌ర్కారుపై మోడీకి ఫిర్యాదు

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు అనేక ఫిర్యాదులు చేస్తున్నాయి. ప్ర‌జాసంఘాలు, ప్ర‌జాస్వామ్య వాదులు కూడా.. అనేక రూపాల్లో ఫిర్యాదులు మొస్తున్నాయి. ప్ర‌భుత్వం దూకుడుగా ఉంటోంద‌ని.. ప్ర‌తిప‌క్షాల గొంతు నులిమేస్తోంద‌ని.. ప్ర‌జ‌ల‌ను హింసిస్తోంద‌ని.. ఎస్సీలు, ఎస్టీల‌పైనా దాడులు చేస్తోంద‌ని.. ఇలా .. అనేక రూపాల్లో నిత్యంవంద‌ల కొద్దీ ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే.. ఇవ‌న్నీ.. రాజ‌కీయంగా అన్ని రాష్ట్రాల్లోనూ జ‌రిగేవే.

అయితే.. తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి నేరుగా.. జ‌గ‌న్‌కు ఒక‌ప్పుడు స‌న్మిత్రుడుగా వ్య‌వ‌హ‌రించి.. ఆయ‌న కోసం తిరుమ‌ల‌లోనే సుద‌ర్శ‌న‌యాగం చేసి.. తిరుమ‌ల వ్య‌వ‌హారాల‌పై నిత్యం.. వైసీపీకి(అప్ప‌ట్లో ప్ర‌తిప క్షం) లీకులు అందించిన‌.. అప్ప‌టి ప్ర‌ధాన అర్చ‌కుడు.. ర‌మ‌ణ దీక్షితులే.. ఫిర్యాదు చేయడం సంచ‌లనంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ.. తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.

సోమ‌వారం ఉద‌యం ప్ర‌ధాని మోడీ.. శ్రీవారిని ద‌ర్సించుకున్న అనంత‌రం.. ఆయ‌న బ‌స చేసిన శ్రీర‌చ‌న గెస్ట్ హౌస్‌లో ప్ర‌త్యేకంగా ర‌మ‌ణ దీక్షితులు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జ‌గ‌న్ స‌ర్కారుపై పుంఖాను పుంఖానులుగా ఫిర్యాదులు స‌మ‌ర్పించారు. తిరుమల ఆలయం ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉందని.. శ్రీవారి ఆలయాన్ని పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోడీకి రమణ దీక్షితులు విజ్ఞప్తి చేశారు.

అంతేకాదు.. రాష్ట్రంలో హిందూ దేవాలయాల పురాతన సంప్రదాయాలు, నిర్మాణాలు, ఆస్తులను టీటీడీలోని సనాతన అధికారి క్రమ పద్ధతిలో నాశనం చేస్తున్నాడని పేర్కొన్నారు. దయచేసి శ్రీవారి ఆలయాన్ని రక్షించి ఇక్కడ వెంటనే హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలని.. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని మోడీకి రమణ దీక్షితులు విన్న‌వించిన‌ట్టు తెలిసింది. ఏదేమైనా.. స‌రిగ్గా ఐదేళ్ల కింద‌ట ఇదేస‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌కు అన్నీతానై.. వ్య‌వ‌హ‌రించిన ర‌మ‌ణ‌దీక్షితులు ఇప్పుడు పూర్తిగా యాంటీ కావ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

This post was last modified on November 27, 2023 3:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏడు ఫ్లాపుల తర్వాతైనా హిట్టు వరించేనా

ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…

1 hour ago

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…

2 hours ago

రజినీకాంత్ భయపడ్డాడా? జాగ్రత్తపడ్డాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…

4 hours ago

వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?

ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…

4 hours ago

పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌విత త‌న దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే…

4 hours ago

భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందా?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…

5 hours ago