ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షాలు అనేక ఫిర్యాదులు చేస్తున్నాయి. ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య వాదులు కూడా.. అనేక రూపాల్లో ఫిర్యాదులు మొస్తున్నాయి. ప్రభుత్వం దూకుడుగా ఉంటోందని.. ప్రతిపక్షాల గొంతు నులిమేస్తోందని.. ప్రజలను హింసిస్తోందని.. ఎస్సీలు, ఎస్టీలపైనా దాడులు చేస్తోందని.. ఇలా .. అనేక రూపాల్లో నిత్యంవందల కొద్దీ ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే.. ఇవన్నీ.. రాజకీయంగా అన్ని రాష్ట్రాల్లోనూ జరిగేవే.
అయితే.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి నేరుగా.. జగన్కు ఒకప్పుడు సన్మిత్రుడుగా వ్యవహరించి.. ఆయన కోసం తిరుమలలోనే సుదర్శనయాగం చేసి.. తిరుమల వ్యవహారాలపై నిత్యం.. వైసీపీకి(అప్పట్లో ప్రతిప క్షం) లీకులు అందించిన.. అప్పటి ప్రధాన అర్చకుడు.. రమణ దీక్షితులే.. ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ప్రధాని మోడీ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
సోమవారం ఉదయం ప్రధాని మోడీ.. శ్రీవారిని దర్సించుకున్న అనంతరం.. ఆయన బస చేసిన శ్రీరచన గెస్ట్ హౌస్లో ప్రత్యేకంగా రమణ దీక్షితులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన జగన్ సర్కారుపై పుంఖాను పుంఖానులుగా ఫిర్యాదులు సమర్పించారు. తిరుమల ఆలయం ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉందని.. శ్రీవారి ఆలయాన్ని పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోడీకి రమణ దీక్షితులు విజ్ఞప్తి చేశారు.
అంతేకాదు.. రాష్ట్రంలో హిందూ దేవాలయాల పురాతన సంప్రదాయాలు, నిర్మాణాలు, ఆస్తులను టీటీడీలోని సనాతన అధికారి క్రమ పద్ధతిలో నాశనం చేస్తున్నాడని పేర్కొన్నారు. దయచేసి శ్రీవారి ఆలయాన్ని రక్షించి ఇక్కడ వెంటనే హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలని.. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని మోడీకి రమణ దీక్షితులు విన్నవించినట్టు తెలిసింది. ఏదేమైనా.. సరిగ్గా ఐదేళ్ల కిందట ఇదేసమయంలో సీఎం జగన్కు అన్నీతానై.. వ్యవహరించిన రమణదీక్షితులు ఇప్పుడు పూర్తిగా యాంటీ కావడం చర్చనీయాంశం అయింది.
This post was last modified on November 27, 2023 3:53 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…