Political News

పీవీ గురించి ప్రియాంకా గాంధీకేం తెలుసు?: కేటీఆర్

తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసేందుకు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి కొనుగోళ్లు చేయడం అలవాటేనంటూ ఓటుకు నోటు కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని కాంగ్రెస్ చెబుతుందని, ఆ పార్టీని గెలిపిస్తే అంతే సంగతులని ఎద్దేవా చేశారు.

6 నెలలకోసారి ముఖ్యమంత్రిని మార్చడమే ఆ పార్టీకి తెలిసిన మార్పు అని చురకలంటించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్ కౌంటర్లు, అరాచకాల పాలన అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి మరోసారి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చావు అంచుల వరకు వెళ్లి ప్రత్యేక తెలంగాణ కేసీఆర్ సాధించుకున్నారని, 14 ఏళ్లపాటు ఢిల్లీలోని రాక్షసులతో పోరాడమని గుర్తు చేసుకున్నారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సాధ్యంకాని పనులను తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసి చూపించామన్నారు. తమ పార్టీపై కొందరు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతామని చెప్పారు. ఏ రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వడం లేదని, కానీ, తెలంగాణలో కేసీఆర్ ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇక, తెలంగాణలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి ప్రియాంక గాంధీకి ఏమాత్రం అవగాహన లేకపోవడం నిజంగా దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను తీవ్రంగా అవమానించిందని, ఆయనకు ఎంతో అన్యాయం చేసిందని కేటీఆర్ అన్నారు. పీవీని మనందరం అభిమానిస్తామని, ఆయన భూమి పుత్రుడని, ఆయన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకే సేవ చేశారని అన్నారు.

This post was last modified on November 25, 2023 11:34 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

18 seconds ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

29 mins ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

43 mins ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

45 mins ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

1 hour ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

2 hours ago