Political News

రఘురామ ఎఫెక్ట్‌: సీఎం జ‌గ‌న్‌కు హైకోర్టు నోటీసులు

ఏపీ హిస్ట‌రీలో తొలిసారి కీల‌క ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది ముఖ్య‌మంత్రులు పాలించినా ఎవ‌రూ సాధించ‌ని ‘రికార్డు’ సీఎం జ‌గ‌న్ సాధించార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణంగా.. రాష్ట్ర హైకోర్టు ఆయ‌న‌కు నోటీసులు పంప‌డ‌మే. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన‌వారికి అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఏనాడూ జ‌ర‌గ‌లేదు. పైగా.. పాల‌న‌లో ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి కావ‌డం మ‌రింత చ‌ర్చ‌నీయాంశం అయింది. కేవ‌లం సీఎం జ‌గ‌న్‌కే కాకుండా..ప‌లువురు మంత్రుల‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో ప్ర‌జాధనాన్ని ఇష్టానుసారం ఖ‌ర్చు చేస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలో స‌చివులు, సీఎం కూడా.. ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డ్డార‌ని ఆరోపిస్తూ.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ముఖ్యమంత్రి జగన్‌ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.

ర‌ఘురామ‌ ఆరోప‌ణ‌లు ఇవీ..

  • రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మాటున ఆర్థిక అవకతవలు జరుగుతున్నాయి.
  • ఆ అవ‌క‌త‌వ‌క‌ల‌పై సీబీఐతో విచారణ జరిపించాలి.
  • ఇసుక‌, మ‌ద్యం విష‌యంలో భారీగా ధ‌నం చేతులు మారుతోంది.

This post was last modified on November 23, 2023 1:19 pm

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

4 hours ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

4 hours ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

4 hours ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

5 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

5 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

7 hours ago