Political News

రఘురామ ఎఫెక్ట్‌: సీఎం జ‌గ‌న్‌కు హైకోర్టు నోటీసులు

ఏపీ హిస్ట‌రీలో తొలిసారి కీల‌క ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది ముఖ్య‌మంత్రులు పాలించినా ఎవ‌రూ సాధించ‌ని ‘రికార్డు’ సీఎం జ‌గ‌న్ సాధించార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణంగా.. రాష్ట్ర హైకోర్టు ఆయ‌న‌కు నోటీసులు పంప‌డ‌మే. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన‌వారికి అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఏనాడూ జ‌ర‌గ‌లేదు. పైగా.. పాల‌న‌లో ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి కావ‌డం మ‌రింత చ‌ర్చ‌నీయాంశం అయింది. కేవ‌లం సీఎం జ‌గ‌న్‌కే కాకుండా..ప‌లువురు మంత్రుల‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో ప్ర‌జాధనాన్ని ఇష్టానుసారం ఖ‌ర్చు చేస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలో స‌చివులు, సీఎం కూడా.. ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డ్డార‌ని ఆరోపిస్తూ.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ముఖ్యమంత్రి జగన్‌ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.

ర‌ఘురామ‌ ఆరోప‌ణ‌లు ఇవీ..

  • రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మాటున ఆర్థిక అవకతవలు జరుగుతున్నాయి.
  • ఆ అవ‌క‌త‌వ‌క‌ల‌పై సీబీఐతో విచారణ జరిపించాలి.
  • ఇసుక‌, మ‌ద్యం విష‌యంలో భారీగా ధ‌నం చేతులు మారుతోంది.
Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

5 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

5 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

5 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

6 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

6 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

8 hours ago