Political News

రఘురామ ఎఫెక్ట్‌: సీఎం జ‌గ‌న్‌కు హైకోర్టు నోటీసులు

ఏపీ హిస్ట‌రీలో తొలిసారి కీల‌క ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది ముఖ్య‌మంత్రులు పాలించినా ఎవ‌రూ సాధించ‌ని ‘రికార్డు’ సీఎం జ‌గ‌న్ సాధించార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణంగా.. రాష్ట్ర హైకోర్టు ఆయ‌న‌కు నోటీసులు పంప‌డ‌మే. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన‌వారికి అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఏనాడూ జ‌ర‌గ‌లేదు. పైగా.. పాల‌న‌లో ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి కావ‌డం మ‌రింత చ‌ర్చ‌నీయాంశం అయింది. కేవ‌లం సీఎం జ‌గ‌న్‌కే కాకుండా..ప‌లువురు మంత్రుల‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో ప్ర‌జాధనాన్ని ఇష్టానుసారం ఖ‌ర్చు చేస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలో స‌చివులు, సీఎం కూడా.. ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డ్డార‌ని ఆరోపిస్తూ.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ముఖ్యమంత్రి జగన్‌ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.

ర‌ఘురామ‌ ఆరోప‌ణ‌లు ఇవీ..

  • రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మాటున ఆర్థిక అవకతవలు జరుగుతున్నాయి.
  • ఆ అవ‌క‌త‌వ‌క‌ల‌పై సీబీఐతో విచారణ జరిపించాలి.
  • ఇసుక‌, మ‌ద్యం విష‌యంలో భారీగా ధ‌నం చేతులు మారుతోంది.

This post was last modified on November 23, 2023 1:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

18 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago