విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోలిక ప్రతి విషయంలోనూ కనిపిస్తుంటుంది. అటు రాజకీయ నేతలు కావొచ్చు.. సామాన్య ప్రజలు కానీ పలు అంశాల్ని తమ రాష్ట్రంతో పోల్చుకుంటుంటారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో రాజకీయం ఎప్పుడు హాట్ హాట్ గా నడుస్తూ ఉంటుంది. తెలంగాణలో రాజకీయాలు ఏకపక్షంగా మారగా.. ఏపీలో ఇంకా అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. బలమైన ప్రతిపక్షంగా బాబు అండ్ కో పోరాటం చేస్తున్నారు. వారు చేసే విమర్శలకు.. ఆరోపణలకు ప్రజల ఆమోదం ఎంతన్నది.. ఇప్పటికిప్పుడు చెప్పటం అంత సులువైన విషయం కాదు.
ఇదిలా ఉంటే.. కరోనా వేళలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతల తీరుకు సంబంధించి ఒక ఆసక్తికర అంశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు రావటమే ఉండదు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఆయన ఏ రోజు ప్రగతిభవన్ లో ఉంటారో.. ఏ రోజు ఫామ్ హౌస్ లో ఉంటారన్న విషయం.. సీఎం బీటు చూసే రిపోర్టర్లకు తప్పించి.. మిగిలిన వారందరికి ఎప్పటికప్పుడు పెద్ద ఫజిలే. సీఎం బయట కనిపించరన్న కొరత లేకుండా మంత్రి కేటీఆర్ తెగ తిరిగేస్తుంటారు.
కరోనా వేళలోనూ ఆయన హాజరయ్యే కార్యక్రమాలు.. పాల్గొనే ప్రారంభోత్సవాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యమంత్రి బయటకు రారన్న కొరతను తీర్చేస్తుంటారు. కేటీఆర్ తో పోలిస్తే.. విపక్ష నేతలు పెద్దగా బయటకు రారనే చెప్పాలి. కాకుంటే.. అప్పుడప్పుడన్నా బయటకు వస్తుంటారు. అధికారపక్షానికి చెందిన హరీశ్ కావొచ్చు.. ఇతర నేతలు వస్తుంటారు. ఇక.. విపక్ష నేతలు ఫర్లేదు. అగ్ర నాయకులు అప్పుడప్పుడన్నా బయటకు వస్తుంటారు.
దీనికి పూర్తి భిన్నగా ఏపీ పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావొచ్చు.. విపక్ష నేత కమ్ అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వీరెవరూ బయటకు రారు. తెలంగాణలో మాత్రం ముఖ్య నేతలంతా నిత్యం బయటకు వస్తూపోతూ ఉంటే.. ఏపీలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు.
బయటకు రాకుండానే.. రాష్ట్ర ప్రజలు ఎప్పటికప్పుడు ఆగ్రహంతో ఊగిపోయేలా రాజకీయాలు చేయటంలో ఏపీ అధినేతలు ముందుంటారని చెప్పాలి. ఈ విషయంలో తెలంగాణ నేతలు వెనుకబడి ఉంటారు. ఇదంతా చూసినప్పుడు.. తెలంగాణ చేసుకున్న అదృష్టం ఏమిటి? ఏపీ చేసుకున్న దురదృష్టం ఏమిటన్న సందేహం కలుగక మానదు.
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…
ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…
బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…