ఆ నాయకులందరూ రాజకీయాల్లో ఎంతో సీనియర్లు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా చాలా పదవులు అనుభవించారు. పార్టీలోనూ కీలక నేతలుగా ఎదిగారు. ఇప్పుడు 70 ఏళ్లు దాటినా చివరి అవకాశంగా మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. రాజకీయ మత్తు అంత సులభంగా వదలదని చెబుతుంటారు. ఇప్పుడు ఈ వయసులోనూ ఎన్నికల సమరానికి సై అంటున్న వీళ్లను చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది.
పోచారం శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్ఎస్ లో ప్రస్తుతం సీనియర్ నాయకుడు. 2019 నుంచి స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే బాన్సువాడ నుంచి ఆరు సార్లు గెలుపొందారు. మూడు సార్లు మంత్రిగానూ పనిచేశారు. ఇప్పుడు ఆయన వయస్సు 74 ఏళ్లు. ఈ సారి ఎన్నికల బరి నుంచి తప్పుకుని తన తనయుడిని పోటీ చేయించాలని అనుకున్నారు. కానీ మరోసారి బాన్సువాడ నుంచి పోటీ చేయాలని కేసీఆర్ కోరడంతో శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల్లో నిలబడ్డారు. మరో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి. ఆయన వయసు 74 ఏళ్లు. ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా రెండు పర్యాయాలు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు నిర్మల్ నుంచి బరిలో దిగారు.
ఇక కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న వనమా వెంకటేశ్వర రావు వయసు 79 ఏళ్లు. ఆయన ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ సారి మంత్రిగా పనిచేశారు. ఈ సారి తన తనయుడు రాఘవను నిలబెట్టాలని అనుకున్నా.. ఓ కేసులో ఆయన జైలుకు వెళ్లి రావడంతో మరోసారి వెంకటేశ్వర రావే బరిలో నిలిచారు. మరోవైపు సనత్ నగర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి వయసు 74 ఏళ్లు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన 71 ఏళ్ల రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్నారు.
This post was last modified on November 16, 2023 4:40 pm
రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…
సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…