తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనపై కమలం పార్టీ నాయకులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. పవన్ ప్రచారం చేస్తే..తమకు అనుకూలంగా ఉంటుందని నాయకులు భావిస్తున్నా రు. వాస్తవానికి సెటిలర్లను ఆకట్టుకునేందుకు పవన్ మంత్రం ఫలిస్తుందని కూడా బీజేపీ పెద్దలు అనుకు న్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు ఆయన ఇంటికి వెళ్లి మరీ పొత్తుల విషయాన్ని చర్చించారు. మొత్తంగా 8 స్థానాల్లోపవన్కు అవకాశం ఇచ్చారు.
మిగిలిన 111 స్థానాల్లోనూ బీజేపీ పోటీకి దిగింది. ఇక, ఎన్నికల ప్రచారానికి కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో కనీసం 7 రోజులు తమ వైపు ప్రచారం చేసేలా బీజేపీ నాయకులు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. పవన్ను ప్రధానంగా వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో(ఉమ్మడి) వినియోగించుకోవాలని భావిస్తున్నారు. అయితే.. ఇంతలోనే వ్యూహం మారిపోయింది. పవన్ ప్రచారంతో వ్యతిరేక ఫలితం వచ్చే అవకాశం ఉందని బీజేపీ నేతలు బెంగ పెట్టుకున్నారట.
పవన్పై ఏపీ నాయకుడుఅనే ముద్ర ఉండడం.. తెలంగాణలో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ చేయకపోవడం.. పైగా ప్రస్తుతం పార్టీ ఎన్నికల గుర్తు కూడా లేక పోవడం.. జనసేన తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు స్వతంత్రులుగానే రంగంలోకి దిగడం వంటి పరిణామాలు.. ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్నాయి. బీఆర్ ఎస్ నాయకులు బీజేపీని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. పవన్ను వారు ఎక్కడా విమర్శించడం లేదు. ఇక, ఇప్పుడు పవన్ ప్రత్యక్ష పోరాటంలోకి దిగితే.. బీఆర్ ఎస్ నాయకులు ఈ అంశాలనే ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
అయితే.. ఇప్పటికిప్పుడు కాదని.. పవన్ నేరుగా ప్రచారంలోకి వస్తేనే రంగంలోకి దిగాలని బీఆర్ ఎస్ నాయకులు కూడా భావిస్తున్నారు. దీంతో పవన్ ఒక అడుగు వెనక్కి వేసి సోషల్ మీడియాకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం . అంటే.. కేవలం సోషల్ మీడియాకే ఆయన ప్రచారాన్ని పరిమితం చేస్తారు. లేదా బీజేపీ అగ్రనేతలు పాల్గొనే సభలకు మాత్రమే ఆయన హాజరు కానున్నారు. దీంతో బీజేపీ నేతలు తల్లడిల్లుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on November 14, 2023 6:40 am
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…