తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనపై కమలం పార్టీ నాయకులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. పవన్ ప్రచారం చేస్తే..తమకు అనుకూలంగా ఉంటుందని నాయకులు భావిస్తున్నా రు. వాస్తవానికి సెటిలర్లను ఆకట్టుకునేందుకు పవన్ మంత్రం ఫలిస్తుందని కూడా బీజేపీ పెద్దలు అనుకు న్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు ఆయన ఇంటికి వెళ్లి మరీ పొత్తుల విషయాన్ని చర్చించారు. మొత్తంగా 8 స్థానాల్లోపవన్కు అవకాశం ఇచ్చారు.
మిగిలిన 111 స్థానాల్లోనూ బీజేపీ పోటీకి దిగింది. ఇక, ఎన్నికల ప్రచారానికి కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో కనీసం 7 రోజులు తమ వైపు ప్రచారం చేసేలా బీజేపీ నాయకులు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. పవన్ను ప్రధానంగా వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో(ఉమ్మడి) వినియోగించుకోవాలని భావిస్తున్నారు. అయితే.. ఇంతలోనే వ్యూహం మారిపోయింది. పవన్ ప్రచారంతో వ్యతిరేక ఫలితం వచ్చే అవకాశం ఉందని బీజేపీ నేతలు బెంగ పెట్టుకున్నారట.
పవన్పై ఏపీ నాయకుడుఅనే ముద్ర ఉండడం.. తెలంగాణలో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ చేయకపోవడం.. పైగా ప్రస్తుతం పార్టీ ఎన్నికల గుర్తు కూడా లేక పోవడం.. జనసేన తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు స్వతంత్రులుగానే రంగంలోకి దిగడం వంటి పరిణామాలు.. ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్నాయి. బీఆర్ ఎస్ నాయకులు బీజేపీని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. పవన్ను వారు ఎక్కడా విమర్శించడం లేదు. ఇక, ఇప్పుడు పవన్ ప్రత్యక్ష పోరాటంలోకి దిగితే.. బీఆర్ ఎస్ నాయకులు ఈ అంశాలనే ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
అయితే.. ఇప్పటికిప్పుడు కాదని.. పవన్ నేరుగా ప్రచారంలోకి వస్తేనే రంగంలోకి దిగాలని బీఆర్ ఎస్ నాయకులు కూడా భావిస్తున్నారు. దీంతో పవన్ ఒక అడుగు వెనక్కి వేసి సోషల్ మీడియాకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం . అంటే.. కేవలం సోషల్ మీడియాకే ఆయన ప్రచారాన్ని పరిమితం చేస్తారు. లేదా బీజేపీ అగ్రనేతలు పాల్గొనే సభలకు మాత్రమే ఆయన హాజరు కానున్నారు. దీంతో బీజేపీ నేతలు తల్లడిల్లుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on November 14, 2023 6:40 am
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…