Political News

టి గ‌వ‌ర్న‌ర్ ఇంట విషాదం…కాంగ్రెస్‌ ఎంపీ మృతి

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై గ‌వ‌ర్న‌ర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఎంపీకి బాబాయి వ‌రుస అయ్యే కన్యాకుమారి కాంగ్రెస్ పార్టీ ఎంపీ హెచ్ వసంత్ కుమార్ కరోనాతో మరణించారు. కరోనా సోకడంతో అయన ఆగష్టు 10 వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తీసుకుంటూ కొద్దిసేపటి క్రితమే మరణించారు. క‌రోనాతో మృతి చెందిన తొలి ఎంపీ వ‌సంత్ కుమార్‌.

వ‌సంత కుమార్ జీవితంలో అనేక ఆస‌క్తిక‌ర ఘ‌ట్టాలు ఉన్నాయి. సేల్స్ మెన్‌గా ప్ర‌యాణం ప్రారంభించి వ్యాపార‌వేత్త స్థాయికి ఎదిగారు. వసంత్ కుమార్ తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరిలో వసంత్ అండ్ కో ఎలక్ట్రానిక్ అండ్ కో హోమ్ స్టోర్స్ ను నిర్వహిస్తున్నారు. సొంతంగా ఆయనకు వసంత్ శాటిలైట్ టీవీ ఛానల్ కూడా ఉంది. వ‌సంతకుమార్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన‌కు కరోనా సోకడంతో ఆగస్టు 10న అపోలో ఆస్ప‌త్రిలో చేరారు. ఈరోజు ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించ‌డంతో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై కి హెచ్ వసంత్ కుమార్ బాబాయ్ అవుతారు.

ఎంపీ వసంత్ కుమార్ మరణం పట్ల ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో పాటుగా పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.‘లోకసభ ఎంపి శ్రీ హెచ్. వసంతకుమార్‌జీ మరణ వార్త తెలిసి బాధపడ్డాను. వ్యాపారం, సామాజిక సేవలో ఆయన ఎంతో ప్రగతి సాధించారు. ఆయనతో నేను పలుమార్లు చర్చించినప్పుడు.. ఎక్కువగా తమిళనాడు అభివృద్ధి గుచించే మాట్లాడేవారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా సంతాపం తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశం నిర్వహించారు. అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరారు. ఎంపీలందరూ విధిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో వైరప్ వ్యాప్తికి అవకాశం లేని విధంగా పార్లమెంట్‌లో సీటింగ్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ముందు జాగ్రత్తగా సభ్యులందరికీ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఓం బిర్లా తెలిపారు. దీని వల్ల ఒకటి, రెండు రోజుల్లోనే రిపోర్టు తెలుస్తుందని అన్నారు.

This post was last modified on August 28, 2020 11:01 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

5 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

6 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

9 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

10 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

10 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

11 hours ago