Political News

టి గ‌వ‌ర్న‌ర్ ఇంట విషాదం…కాంగ్రెస్‌ ఎంపీ మృతి

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై గ‌వ‌ర్న‌ర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఎంపీకి బాబాయి వ‌రుస అయ్యే కన్యాకుమారి కాంగ్రెస్ పార్టీ ఎంపీ హెచ్ వసంత్ కుమార్ కరోనాతో మరణించారు. కరోనా సోకడంతో అయన ఆగష్టు 10 వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తీసుకుంటూ కొద్దిసేపటి క్రితమే మరణించారు. క‌రోనాతో మృతి చెందిన తొలి ఎంపీ వ‌సంత్ కుమార్‌.

వ‌సంత కుమార్ జీవితంలో అనేక ఆస‌క్తిక‌ర ఘ‌ట్టాలు ఉన్నాయి. సేల్స్ మెన్‌గా ప్ర‌యాణం ప్రారంభించి వ్యాపార‌వేత్త స్థాయికి ఎదిగారు. వసంత్ కుమార్ తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరిలో వసంత్ అండ్ కో ఎలక్ట్రానిక్ అండ్ కో హోమ్ స్టోర్స్ ను నిర్వహిస్తున్నారు. సొంతంగా ఆయనకు వసంత్ శాటిలైట్ టీవీ ఛానల్ కూడా ఉంది. వ‌సంతకుమార్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన‌కు కరోనా సోకడంతో ఆగస్టు 10న అపోలో ఆస్ప‌త్రిలో చేరారు. ఈరోజు ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించ‌డంతో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై కి హెచ్ వసంత్ కుమార్ బాబాయ్ అవుతారు.

ఎంపీ వసంత్ కుమార్ మరణం పట్ల ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో పాటుగా పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.‘లోకసభ ఎంపి శ్రీ హెచ్. వసంతకుమార్‌జీ మరణ వార్త తెలిసి బాధపడ్డాను. వ్యాపారం, సామాజిక సేవలో ఆయన ఎంతో ప్రగతి సాధించారు. ఆయనతో నేను పలుమార్లు చర్చించినప్పుడు.. ఎక్కువగా తమిళనాడు అభివృద్ధి గుచించే మాట్లాడేవారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా సంతాపం తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశం నిర్వహించారు. అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరారు. ఎంపీలందరూ విధిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో వైరప్ వ్యాప్తికి అవకాశం లేని విధంగా పార్లమెంట్‌లో సీటింగ్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ముందు జాగ్రత్తగా సభ్యులందరికీ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఓం బిర్లా తెలిపారు. దీని వల్ల ఒకటి, రెండు రోజుల్లోనే రిపోర్టు తెలుస్తుందని అన్నారు.

This post was last modified on August 28, 2020 11:01 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ఏడు ఫ్లాపుల తర్వాతైనా హిట్టు వరించేనా

ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…

2 hours ago

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…

3 hours ago

రజినీకాంత్ భయపడ్డాడా? జాగ్రత్తపడ్డాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…

5 hours ago

వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?

ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…

5 hours ago

పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌విత త‌న దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే…

6 hours ago

భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందా?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…

6 hours ago