కామారెడ్డిలో నామినేషన్ వేసిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీసీ మంత్రాన్ని ప్రయోగించారు. అదేమిటంటే అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే బీసీల రిజర్వేషన్ శాతాన్ని పెంచుతామని. ఇపుడు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు ఉన్న 24 శాతం రిజర్వేషన్లు 42 శాతంకు పెంచుతామని రేవంత్ ప్రకటించారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉన్నట్లుగానే బీసీలకు కూడా జ్యోతిరావ్ పూలే పేరుతో సబ్ ప్లాన్ చట్టం తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చారు.
అసెంబ్లీ మొదటి సమావేశంలోనే బీసీల సబ్ ప్లాన్ పై బిల్లు పెడతామని, ఏడాదికి రు. 20 వేల కోట్లను బడ్జెట్లో కేటాయిస్తామని కూడా రేవంత్ ప్రకటించారు. అలాగే ఎంబీసీ(మోస్ట్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్) అభివృద్ధికి ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటుచేస్తామని కూడా చెప్పారు. నిజానికి ఈ డిమాండ్లన్నీ బీసీల నుండి ఎప్పటినుండో వినిపిస్తున్నదే. అయితే కేసీయార్ ఎందుకనో పెద్దగా పట్టించుకోలేదు. అందుకనే ఎన్నికలను రేవంత్ అడ్వాంటేజ్ తీసుకున్నారు.
బీసీల ఓట్లను ఆకట్టుకోవటానికి రేవంత్ ఇంకా చాలా వరాలను, హామీలను ఇచ్చారు. వీటిల్లో ఎంతవరకు ఆచరణ సాధ్యమో చూడాలి. అయితే ఓటర్లలో బీసీల ఓట్లు అత్యధికం అన్న విషయం తెలిసిందే. అందుకనే మొత్తం 119 సీట్లలో కనీసం సగమన్నా బీసీలకు కేటాయించాలని పార్టీలో కొంతకాలంగా డిమాండ్లు మొదలయ్యాయి. అయితే సగం కాకపోయినా కనీసం 35-40 టికెట్లు ఇస్తామని అధిష్టానం కూడా బీసీ నేతలకు హామీ ఇచ్చింది. అయితే చివరకు బీసీలకు కేటాయించిన టికెట్లు 23 మాత్రమే.
ఎందుకంటే అగ్రవర్ణాల్లోని మిగిలిన సామాజికవర్గాలకు కూడా టికెట్లు కేటాయించటం కీలకం కావటంతో ముందుగా ఇచ్చిన హామీమేరకు టికెట్లను బీసీలకు ఇవ్వలేకపోయింది. అందుకనే ఇపుడు ఇతరత్రా హామీలను రేవంత్ ప్రకటించారు. అధికారంలో వాటా, లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచటం, ప్రత్యేక మంత్రిత్వశాఖ, సబ్ ప్లాన్ ఏర్పాటు లాంటి కీలకమైన హామీలిచ్చారు. మరి రేవంత్ తాజా హామీలు, వరాల విషయంలో బీసీలు ఏ విధంగా స్పందిస్తారన్నది కీలకం. బీసీలు గనుక కాంగ్రెస్ వైపు మొగ్గుచూపితే పార్టీ గెలుపు ఈజీ అనే అనుకోవాలి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…