Political News

షర్మిల ద్రోహి.. బహిష్కరించాం: గట్టు రామచంద్రరావు

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటున్నానని వైఎస్ఆర్టిపి అధినేత్రి వైయస్ షర్మిల కొద్ది రోజుల క్రితం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు సొంతగానే తన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన షర్మిల హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా షర్మిలపై ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

షర్మిల ద్రోహి అని, ఆమెను నమ్మి మోసపోయామని సంచలన ఆరోపణలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని గౌరవించామని, ఆమెను నమ్మితే తడి గుడ్డతో గొంతులు కోశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ సమాజంలో షర్మిలకు చోటు లేదని, ఆమెను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వైటీపీ తమదని, షర్మిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని గట్టు రామచంద్రరావు సంచలన ప్రకటన చేశారు. వైటిపితో షర్మిలకు ఎటువంటి సంబంధం లేదని, అసలు ఆమెకు పార్టీలో సభ్యత్వం లేదని ఆరోపించారు. వైటిపి షర్మిలది కాదన్నారు.

రెండు, మూడు రోజుల్లో ఇతర నేతలతో చర్చించి భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తామన్నారు. తెలంగాణకు షర్మిల నాయకత్వం అవసరం లేదని, కాంగ్రెస్ మద్దతు అడగకముందే ఎందుకు మద్దతు ఇస్తామని ప్రకటించారని ప్రశ్నించారు. భవిష్యత్తులో షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేసిన ఓడించి తీరతామన్నారు. నేను నిలబడతా మిమ్మల్ని నిలబెడతా అని చెప్పిన షర్మిల ఈరోజు తమను నడిరోడ్డుపై నిలబెట్టారని వాపోయారు. రేవంత్ రెడ్డిని దొంగ అని ఆరోపణలు చేసిన షర్మిల కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారని, ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. షర్మిలతో పోలిస్తే కేఏ పాల్ చాలా నయమని సెటైర్లు వేశారు.

నమ్మి ఆమె వెంట నడిచినందుకు తమను తెలంగాణకు సమాజం క్షమించాలని గట్టు రామచంద్రరావు అన్నారు. రామచంద్రరావుతోపాటు షర్మిలపై కొందరు వైటిపి నాయకులు తిరుగుబాటు చేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో షర్మిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మరి గట్టు రామచంద్రరావుతోపాటు వైటీపీ నేతల విమర్శలపై షర్మిల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on November 9, 2023 7:09 pm

Share
Show comments

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

19 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago