తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఆమేరకు పొత్తులు ఫైనల్ చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 119 స్థానాల తెలంగాణ అసెంబ్లీలో జనసేనకు బీజేపీ 9 స్థానాలు కేటాయించింది. వీటిపై తాజాగా ఓ క్లారిటీకి వచ్చిన జనసేన.. వెంటనే అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం జనసేనకు కేటాయించిన 9 స్థానాలకుగాను.. 8 చోట్ల అభ్యర్థులను జనసేన ప్రకటించింది. వీటిలో కూకట్పల్లి, కోదాడ, నాగర్ కర్నూల్, అశ్వారావు పేట వంటి కీలక నియోజకవర్గాలు ఉన్నాయి.
ఎవరెవరు ఎక్కడెక్కడ?
కూకట్ పల్లి నియోజకవర్గం టికెట్ను ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్కు కేటాయించారు. తాండూరు టికెట్ను వేమూరి శంకర్ గౌడ్కు, కీలకమైన కోదాడ టికెట్ను మేకల సతీష్రెడ్డికి ఇచ్చారు. అదేవిధంగా నాగర్ కర్నూల్ టికెట్ను వంగా లక్ష్మణ గౌడ్, ఖమ్మం టికెట్ను మిర్యాల రామకృష్ణకు కేటాయించారు. కొత్తగూడెం టికెట్ను లక్కినేని సురేందర్, వైరా టికెట్ను డాక్టర్ తేజావత్ సంపత్కు కేటాయించరు. అదేవిధంగా అశ్వారావు పేట టికెట్ ను మయబోయిన ఉమాదేవికి కేటాయించారు. మొత్తంగా 8 టికెట్లలో ఒకటి మహిళకు కేటాయించడం గమనార్హం.
ఇక, టికెట్ల వారీగా చూస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట వంటి నాలుగు కీలక నియోజకవర్గాలు జనసేనకు దక్కాయి. ఇక, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడను కేటాయించారు. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అదేసమయంలో ఖమ్మం వంటి చోట మాజీ మంత్తి తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్లు తలపడుతున్నారు. అదేవిధంగా నాగర్ కర్నూలు కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనకు కేటాయించిన టికెట్లను పరిశీలిస్తే.. ఆ పార్టీ నాయకులు చెమటోడిస్తే తప్ప.. గెలుపు గుర్రం ఎక్కడం కష్టమనే బావన కనిపిస్తోంది.
This post was last modified on November 8, 2023 6:23 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…