తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఆమేరకు పొత్తులు ఫైనల్ చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 119 స్థానాల తెలంగాణ అసెంబ్లీలో జనసేనకు బీజేపీ 9 స్థానాలు కేటాయించింది. వీటిపై తాజాగా ఓ క్లారిటీకి వచ్చిన జనసేన.. వెంటనే అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం జనసేనకు కేటాయించిన 9 స్థానాలకుగాను.. 8 చోట్ల అభ్యర్థులను జనసేన ప్రకటించింది. వీటిలో కూకట్పల్లి, కోదాడ, నాగర్ కర్నూల్, అశ్వారావు పేట వంటి కీలక నియోజకవర్గాలు ఉన్నాయి.
ఎవరెవరు ఎక్కడెక్కడ?
కూకట్ పల్లి నియోజకవర్గం టికెట్ను ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్కు కేటాయించారు. తాండూరు టికెట్ను వేమూరి శంకర్ గౌడ్కు, కీలకమైన కోదాడ టికెట్ను మేకల సతీష్రెడ్డికి ఇచ్చారు. అదేవిధంగా నాగర్ కర్నూల్ టికెట్ను వంగా లక్ష్మణ గౌడ్, ఖమ్మం టికెట్ను మిర్యాల రామకృష్ణకు కేటాయించారు. కొత్తగూడెం టికెట్ను లక్కినేని సురేందర్, వైరా టికెట్ను డాక్టర్ తేజావత్ సంపత్కు కేటాయించరు. అదేవిధంగా అశ్వారావు పేట టికెట్ ను మయబోయిన ఉమాదేవికి కేటాయించారు. మొత్తంగా 8 టికెట్లలో ఒకటి మహిళకు కేటాయించడం గమనార్హం.
ఇక, టికెట్ల వారీగా చూస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట వంటి నాలుగు కీలక నియోజకవర్గాలు జనసేనకు దక్కాయి. ఇక, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడను కేటాయించారు. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అదేసమయంలో ఖమ్మం వంటి చోట మాజీ మంత్తి తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్లు తలపడుతున్నారు. అదేవిధంగా నాగర్ కర్నూలు కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనకు కేటాయించిన టికెట్లను పరిశీలిస్తే.. ఆ పార్టీ నాయకులు చెమటోడిస్తే తప్ప.. గెలుపు గుర్రం ఎక్కడం కష్టమనే బావన కనిపిస్తోంది.
This post was last modified on November 8, 2023 6:23 am
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఏడాదిన్నరగా వెంకటేష్ ని సోలో హీరోగా దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న…
హారర్ అంటే కామెడీతో కిచిడి అయిపోయిన ట్రెండ్ లో నేరుగా ఓటిటిలో రిలీజైన మా ఊరి పొలిమేర జనాన్ని భయపెట్టడంలో…
ఒకప్పుడు మూడు నాలుగు సినిమాలు ఒకే రోజు విడుదలైనా బాక్సాఫీస్ కు తట్టుకునే కెపాసిటీ ఉండేది. ఓటిటి, ఇంటర్ నెట్…
తాను హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ను 2024 సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా జాతీయ అవార్డుల జ్యూరీ…
ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…