Political News

ఎనిమిది మందితో జ‌న‌సేన అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ ఆమేర‌కు పొత్తులు ఫైన‌ల్ చేసుకున్న విష‌యం తెలిసిందే. మొత్తం 119 స్థానాల తెలంగాణ అసెంబ్లీలో జ‌న‌సేన‌కు బీజేపీ 9 స్థానాలు కేటాయించింది. వీటిపై తాజాగా ఓ క్లారిటీకి వ‌చ్చిన జ‌న‌సేన‌.. వెంట‌నే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. మొత్తం జ‌న‌సేన‌కు కేటాయించిన 9 స్థానాల‌కుగాను.. 8 చోట్ల అభ్య‌ర్థుల‌ను జ‌న‌సేన ప్ర‌క‌టించింది. వీటిలో కూక‌ట్‌ప‌ల్లి, కోదాడ‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, అశ్వారావు పేట వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.

ఎవ‌రెవ‌రు ఎక్క‌డెక్క‌డ‌?

కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌కు కేటాయించారు. తాండూరు టికెట్‌ను వేమూరి శంక‌ర్ గౌడ్‌కు, కీల‌క‌మైన కోదాడ టికెట్‌ను మేక‌ల స‌తీష్‌రెడ్డికి ఇచ్చారు. అదేవిధంగా నాగ‌ర్ క‌ర్నూల్ టికెట్‌ను వంగా ల‌క్ష్మ‌ణ గౌడ్‌, ఖమ్మం టికెట్‌ను మిర్యాల రామ‌కృష్ణ‌కు కేటాయించారు. కొత్త‌గూడెం టికెట్‌ను ల‌క్కినేని సురేంద‌ర్‌, వైరా టికెట్‌ను డాక్ట‌ర్ తేజావ‌త్ సంప‌త్‌కు కేటాయించ‌రు. అదేవిధంగా అశ్వారావు పేట టికెట్ ను మ‌య‌బోయిన ఉమాదేవికి కేటాయించారు. మొత్తంగా 8 టికెట్ల‌లో ఒక‌టి మ‌హిళ‌కు కేటాయించ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, టికెట్ల వారీగా చూస్తే.. ఉమ్మ‌డి ఖమ్మం జిల్లాలోని ఖ‌మ్మం, కొత్త‌గూడెం, వైరా, అశ్వారావుపేట వంటి నాలుగు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు జ‌న‌సేనకు ద‌క్కాయి. ఇక‌, ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలోని కోదాడ‌ను కేటాయించారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంది. అదేస‌మ‌యంలో ఖ‌మ్మం వంటి చోట మాజీ మంత్తి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, ప్ర‌స్తుత మంత్రి పువ్వాడ అజ‌య్‌లు త‌ల‌ప‌డుతున్నారు. అదేవిధంగా నాగ‌ర్ క‌ర్నూలు కూడా గ‌ట్టి పోటీ ఇస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌కు కేటాయించిన టికెట్ల‌ను ప‌రిశీలిస్తే.. ఆ పార్టీ నాయ‌కులు చెమ‌టోడిస్తే త‌ప్ప‌.. గెలుపు గుర్రం ఎక్క‌డం క‌ష్ట‌మ‌నే బావ‌న క‌నిపిస్తోంది.

This post was last modified on November 8, 2023 6:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

4 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

9 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago