Political News

జగన్ సర్కారుకు బ్యాడ్ డే

ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టులో ఎదురు దెబ్బ.. జగన్ సర్కారుకు సుప్రీం కోర్టు షాక్.. ఇలాంటి వార్తలు గత ఏడాది కాలంలో ఎన్ని వచ్చాయో లెక్కే లేదు. ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని కోర్టు సమర్థిస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది తప్ప.. కోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలితే అది వార్తగానే అనిపించట్లేదు. ఇది మామూలే కదా అనుకునే స్థాయిలో జగన్ సర్కారుకు కోర్టులో ఎదురు దెబ్బలు తగిలాయి. తాజాగా రాజధాని వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు మొదలయ్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనకు ఏపీ హైకోర్టు బ్రేక్ వేయడం ఖాయం అని అందరూ అనుకుంటుండగా అదే జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి గురువారం ఏకంగా కోర్టులో ఏపీ ప్రభుత్వానికి పలు నిర్ణయాలు వ్యతిరేకంగా రావడం గమనార్హం.

ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులు

1 తూర్పు గోదావరి జిల్లాలోని అవ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సిబిఐ కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

2 రాజధాని రైతుల కౌలు రెండురోజుల్లో చెల్లించాలి అని ఆదేశించిన హైకోర్టు.

3 టీడీపీ మాజీ ఎమెల్యే పోతుల రామారావు గ్రానైట్ సంస్థకు ఇచ్చిన పన్ను నోటీసులు రద్దు చేసిన హైకోర్టు – లీజు రద్దు నోటీసులు కూడా డిస్మిస్ – సదరన్ రాక్ అండ్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు గతంలో పన్ను, లీజు రద్దు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం – ఈ నోటీసులను హైకోర్టులో సవాల్ చేసిన పోతుల రామారావు – ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు చట్టబద్దంగా లేవన్న హైకోర్టు

4 గెస్ట్ హౌస్ శంఖుస్థాపన తో హైకోర్టు ధిక్కారం చేశారని వేసిన పిటిషన్ లో చీఫ్ సెక్రటరీ కి నోటీసులు ఇచ్చిన కోర్ట్.

5 మూడు రాజధానులు మరియు CRDA చట్ట రద్దు కేసులో సెప్టెంబర్ 21 నుంచి రోజువారీ విచారణ కొనసాగించడానికి న్యాయవాదులతో చర్చించిన హైకోర్టు.
కౌంటర్ దాఖలు చేయడానికి 10 వరకూ ప్రభుత్వానికి గడువు. అభ్యంతరం దాఖలు చెయ్యడానికి 17 వరకూ పిటిషనర్లకు సమయం. రాజధాని మార్పుపై స్టేటస్ కో సెప్టెంబర్ 21 వరకూ కొనసాగింపు.

This post was last modified on August 27, 2020 10:58 pm

Share
Show comments
Published by
suman
Tags: YS Jagan

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

7 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

8 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

11 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

11 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

12 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

12 hours ago