Political News

బీజేపీ-జనసేనలో గొడవలు పెరిగిపోతున్నాయా ?

రెండు పార్టీలు బీజేపీ-జనసేన మధ్య పొత్తు గొడవలు పెరిగిపోతున్నాయి. రెండుపార్టీలు తెలంగాణా ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని పై స్ధాయిలో నిర్ణయం తీసుకున్నా కిందస్ధాయికి సరిగా వెళ్ళలేదు. చివరి నిముషంలో పొత్తు పెట్టుకోవటమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గడచిన ఐదేళ్ళుగా టికెట్లు ఆశించి బీజేపీ నేతలు బాగా కష్టపడ్డారు. అయితే చివరి నిమిషంలో జనసేనతో పొత్తు కుదిరింది. జనసేన ఒంటరిగానే 32 నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణే ప్రకటించారు.

రెండుపార్టీలు వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను రెడీ చేసుకుంటున్న సమయంలో సడెన్ గా పొత్తు కుదిరింది. దాంతో జనసేన ముందుగా ప్రకటించినట్లు కాకపోయినా కనీసం 20 సీట్లయినా ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబట్టింది. బీజేపీనేమో జనసేనకు పదిసీట్లివ్వటమే చాలా ఎక్కువనే అభిప్రాయంతో ఉంది. పైగా రెండు పార్టీల నేతలు దృష్టిపెట్టిన నియోజకవర్గాలు కూడా ఇందులోనే ఉన్నాయి. ఈ విషయంలోనే రెండుపార్టీల నేతల మధ్య ఎక్కడా సయోధ్య కుదరటంలేదు.

శేరలింగంపల్లి, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో పోటీచేయటానికి రెండుపార్టీల నేతలు బాగా పట్టుగున్నారు. పై రెండు నియోజకవర్గాల్లో పోటీ విషయంలో బీజేపీ నేతలు చాలాకాలంగా కష్టపడుతున్నారు. చివరినిముషంలో వీటిని జనసేకు వదులుకోవటానికి కమలనాదులు ఇష్టపడటంలేదు. దాంతో రెండుపార్టీల్లోను గొడవలవుతున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని జనసేనకు వదులుకోవటాన్ని సీనియర్ నేత, పార్లమెంటుకు పోటీచేయాలని ఆలోచిస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే కొండా పోటీచేయాలని అనుకుంటున్న చేవెళ్ళ పార్లమెంటు సీటు పరిధిలోకే శేరిలింగంపల్లి వస్తుంది.

ఇంతకాలం గ్రౌండ్ వర్క్ చేసుకున్న వాళ్ళని కాదని పొత్తులో జనసేకు ఇచ్చేస్తే తన గెలుపుపైన తీవ్ర ప్రభావం పడుతుందని కొండా ఆదోళన పడుతున్నారు. కొండాకు మద్దతుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిలవటంతో పార్టీలో పెద్ద గొడవైపోతోంది. ఇలాంటివే మరికొన్ని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి పొత్తున్నది పై స్ధాయిలో నిర్ణయం అయినంత సులభంకాదు కిందస్ధాయిలో నేతలు కలిసి పనిచేయటం. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on October 30, 2023 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

భారత్ సంచలనం : పాకిస్తానీలు దేశం విడిచి వెళ్ళిపోవాలి!

కశ్మీర్ లోని పెహల్ గాంలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోని పర్యాటకులను…

3 hours ago

వెంకీ & నాని మల్టీస్టారర్ మిస్సయ్యిందా

పైన హెడ్డింగ్ చదవగానే అరే మిస్సయ్యామే అనే ఫీలింగ్ ఎవరికైనా కలుగుతుంది. అలాంటిదే అభిమానులు ఎదురు చూస్తున్న విక్టరీ వెంకటేష్,…

3 hours ago

గుడివాడ వైసీపీ కొలాప్స్ ?

ఉమ్మ‌డి కృష్నా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అంటే.. కొడాలి నానితోపాటు.. వైసీపీ పేరు కూడా వినిపిస్తుంది. నానితో పాటు..…

5 hours ago

వీళ్లు మ‌నుషులు కాదు మృగాలు: చంద్ర‌బాబు

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అమ్మ‌న‌బ్రోలుకు చెందిన టీడీపీ నాయ‌కుడు వీర‌య్య చౌద‌రి దారుణ హ‌త్య‌పై సీఎం…

6 hours ago

రాజా సాబ్ కానుక సరే మరి శుభవార్త ?

ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చినది రాజా సాబ్ ఎట్టకేలకు ప్రమోషన్ల పరంగా ఒక అడుగు ముందుకు వేస్తోంది.…

6 hours ago

“ఎన్టీఆర్ భవన్ కాదండోయ్… ఛార్లెస్ శోభరాజ్ భవన్‌” – నాని

విజ‌య‌వాడ ప్ర‌స్తుత ఎంపీ.. కేశినేని చిన్ని(శివ‌నాథ్‌), మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్) ఇద్ద‌రూ తోడ‌బుట్టిన అన్న‌ద‌మ్ములు. రాజ‌కీయంగా వైరం లేక‌పోయినా..…

7 hours ago