Political News

బ్యాంకులకు పొంచి ఉన్న డేంజర్ చెప్పిన దువ్వూరి

కరోనా వేళ.. దేశీయ బ్యాంకులు ఎదుర్కొనే ముప్పు గురించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు తెలుగోడు.. ఆర్ బీఐ మాజీ గవర్నర్ గా పని చేసిన దువ్వూరి సుబ్బారావు. బ్యాంకులకు మొండి బకాయిలు పెరిగిపోవటమే కాదు.. రానున్న రోజుల్లో ఇదో పెద్ద సమస్యగా మారుతుందన్న విషయాన్ని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకులకు పెరుగుతున్న మొండి బాకీల్ని తగ్గించేందుకు బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలన్న సూచనను చేస్తున్నారు.

మొండి బాకీల్ని పరిష్కరించే విషయంలో మామూలు బ్యాంకు కంటే కూడా బ్యాడ్ బ్యాంకు బాగా పని చేస్తుందని చెప్పారు. చెప్పామంటే చెప్పటం అన్నట్లు కాకుండా.. ఉదాహరణను కూడా చెప్పుకొచ్చారు. ఇదే తరహా ప్రయోగాన్ని ఇప్పటికే కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయని.. అందుకు మలేషియాలోని దనహర్త ఆఫ్ మలేషియా చక్కటి ఉదాహరణగా ఆయన చెబుతున్నారు.

దేశంలో బ్యాడ్ బ్యాంకును రూపొందించటానికి ఆ సంస్థను అధ్యయనం చేస్తే మంచిదన్నారు. ఈ విధానంలో అన్ని బ్యాంకుల్లోని మొండి బకాయిల్ని బ్యాడ్ బ్యాంకుకు తరలిస్తారు. వాటి లెక్క తేల్చటమే ఈ బ్యాంకు చేసే పనిగా చెప్పారు. కరోనా వేళ.. మొండి బకాయిలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాదిలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల కారణంగా బ్యాంకులకు మొండి బాకీలు అనూహ్యంగా పెరుగుతాయన్న అంచనాను ఆయన వెల్లడించారు.

ఈ ఏడాది మార్చి నాటికి దేశీయంగా బ్యాంకుల్లో మొండి బకాయిలు 8.5 శాతం ఉంటే.. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవి కాస్తా 12.5 శాతంగా మారతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మొండి బకాయిల విషయంలో మరింత ఎఫెక్టివ్ గా పని చేసేందుకు వీలుగా.. దువ్వూరి వారు చెప్పిన బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుపై మోడీ సర్కారు ఆలోచన చేస్తే మంచిదేమో?

This post was last modified on August 27, 2020 1:05 pm

Share

Recent Posts

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

10 minutes ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

11 minutes ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

4 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

4 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

4 hours ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

5 hours ago