Political News

బ్యాంకులకు పొంచి ఉన్న డేంజర్ చెప్పిన దువ్వూరి

కరోనా వేళ.. దేశీయ బ్యాంకులు ఎదుర్కొనే ముప్పు గురించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు తెలుగోడు.. ఆర్ బీఐ మాజీ గవర్నర్ గా పని చేసిన దువ్వూరి సుబ్బారావు. బ్యాంకులకు మొండి బకాయిలు పెరిగిపోవటమే కాదు.. రానున్న రోజుల్లో ఇదో పెద్ద సమస్యగా మారుతుందన్న విషయాన్ని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకులకు పెరుగుతున్న మొండి బాకీల్ని తగ్గించేందుకు బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలన్న సూచనను చేస్తున్నారు.

మొండి బాకీల్ని పరిష్కరించే విషయంలో మామూలు బ్యాంకు కంటే కూడా బ్యాడ్ బ్యాంకు బాగా పని చేస్తుందని చెప్పారు. చెప్పామంటే చెప్పటం అన్నట్లు కాకుండా.. ఉదాహరణను కూడా చెప్పుకొచ్చారు. ఇదే తరహా ప్రయోగాన్ని ఇప్పటికే కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయని.. అందుకు మలేషియాలోని దనహర్త ఆఫ్ మలేషియా చక్కటి ఉదాహరణగా ఆయన చెబుతున్నారు.

దేశంలో బ్యాడ్ బ్యాంకును రూపొందించటానికి ఆ సంస్థను అధ్యయనం చేస్తే మంచిదన్నారు. ఈ విధానంలో అన్ని బ్యాంకుల్లోని మొండి బకాయిల్ని బ్యాడ్ బ్యాంకుకు తరలిస్తారు. వాటి లెక్క తేల్చటమే ఈ బ్యాంకు చేసే పనిగా చెప్పారు. కరోనా వేళ.. మొండి బకాయిలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాదిలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల కారణంగా బ్యాంకులకు మొండి బాకీలు అనూహ్యంగా పెరుగుతాయన్న అంచనాను ఆయన వెల్లడించారు.

ఈ ఏడాది మార్చి నాటికి దేశీయంగా బ్యాంకుల్లో మొండి బకాయిలు 8.5 శాతం ఉంటే.. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవి కాస్తా 12.5 శాతంగా మారతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మొండి బకాయిల విషయంలో మరింత ఎఫెక్టివ్ గా పని చేసేందుకు వీలుగా.. దువ్వూరి వారు చెప్పిన బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుపై మోడీ సర్కారు ఆలోచన చేస్తే మంచిదేమో?

This post was last modified on August 27, 2020 1:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

58 minutes ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

1 hour ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

3 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

3 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

3 hours ago

ఏపీలో ‘ఆ రాజ్యాంగ ప‌ద‌వులు’ వైసీపీకి ద‌క్క‌లేదు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, తీసుకునే నిర్ణ‌యాల‌ను స‌మీక్షించి.. నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌త్యేకంగా మూడు క‌మిటీలు ఉంటాయి. ఇది…

4 hours ago