అవసరం రావాలే కానీ.. అప్పుడెప్పుడో వదిలేసిన పాత సంబంధాల్ని సైతం సరికొత్తగా కలుపుకునే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మించిన టాలెంట్ మరెవరికీ లేదంటారు. ఒకసారి అవసరం అయిపోయినా.. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకున్నా.. అప్పటివరకు నెత్తిన పెట్టుకునే వారిని పూర్తిగా పట్టించుకోవటం మానేసే విషయంలోనూ ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. గత ఏడాది లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. సీఎం కేసీఆర్ ఒక పెద్ద మనిషి ఇంటికి భోజనానికి వెళ్లటం హాట్ టాపిక్ మారింది.
ఒకప్పడు కేసీఆర్ కు మాంచి దోస్తు.. టీడీపీలో సుదీర్ఘంగా ఉన్న సీనియర్ నేత.. వివాదాలకు దూరంగా ఉండే నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు అనూహ్యంగా గులాబీ కారు ఎక్కటం ఆశ్చర్యానికి గురి చేసింది. నిజామాబాద్ బరిలో ఉన్న తన కుమార్తె కవితకు దన్నుగా నిలవటమే కాదు.. మండవకున్న మంచిపేరు.. ఫ్యాన్ ఫాలోయింగ్ కవితకు ఓట్ల రూపంలో బదిలీ అవుతుందని ఆశించారు.
సారు అంచనాలకు భిన్నంగా నిజామాబాద్ ఓటర్లు తీర్పు ఇవ్వటం.. పక్కాగా గెలుస్తుందని భావించిన కవిత.. ఎన్నికల్లో ఓటమి పాలు కావటంతో సీఎం కేసీఆర్ తీవ్రమైన నిరాశకు గురైనట్లుగా చెబుతారు. దీంతో.. మండవ ప్రాధాన్యత పార్టీలో తగ్గినట్లు చెబుతారు. ఎన్నికల వేళలో.. తానే స్వయంగా మండవ ఇంటికి వెళ్లి.. భోజనం చేసిన కేసీఆర్ ఆ తర్వాత ఆయన్ను పట్టించుకోలేదన్న విమర్శ ఉంది.
ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు (సురేశ్ రెడ్డి, మండవ) ఉన్నప్పటికీ.. మొన్నటికి మొన్న రాజ్యసభ స్థానం సురేశ్ రెడ్డికి దక్కింది. మండవకు రిక్త హస్తమే దక్కిన విషయంలోనూ ఆయన నిరాశకు గురైనట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో ఉండటంతో పెద్దగా ప్రయోజనం లేదన్న విషయాన్ని మండవ గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు.. బీజేపీ నుంచి రిక్వెస్టుల మీద రిక్వెస్టులు పెరిగిపోయినందున.. తాను కారు దిగేసి.. కమలానికి దగ్గర కావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
మండవకు పదవి ఇచ్చినా.. ఇవ్వకున్నా ఫర్లేదని.. అధినేత కేసీఆర్ ఆయన్ను గుర్తిస్తున్నట్లుగా వైఖరి ఉంటే సరిపోతుందంటున్నారు. మరి.. అలాంటి వాటికి కేసీఆర్ సిద్ధంగా ఉండే అవకాశం లేని నేపథ్యంలొ.. మండవ కీలక నిర్ణయాన్ని తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. మరి.. తన పాత దోస్తును కేసీఆర్ వదులుకుంటారో? లేదో? కాలమే డిసైడ్ చేయాల్సి ఉంది. ఒకవేళ అలాంటిదే జరిగి మండవ కారు దిగేస్తే మాత్రం సీఎం కేసీఆర్ కు ఇబ్బందేనని చెబుతున్నారు.
This post was last modified on August 27, 2020 10:09 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…