అవసరం రావాలే కానీ.. అప్పుడెప్పుడో వదిలేసిన పాత సంబంధాల్ని సైతం సరికొత్తగా కలుపుకునే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మించిన టాలెంట్ మరెవరికీ లేదంటారు. ఒకసారి అవసరం అయిపోయినా.. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకున్నా.. అప్పటివరకు నెత్తిన పెట్టుకునే వారిని పూర్తిగా పట్టించుకోవటం మానేసే విషయంలోనూ ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. గత ఏడాది లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. సీఎం కేసీఆర్ ఒక పెద్ద మనిషి ఇంటికి భోజనానికి వెళ్లటం హాట్ టాపిక్ మారింది.
ఒకప్పడు కేసీఆర్ కు మాంచి దోస్తు.. టీడీపీలో సుదీర్ఘంగా ఉన్న సీనియర్ నేత.. వివాదాలకు దూరంగా ఉండే నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు అనూహ్యంగా గులాబీ కారు ఎక్కటం ఆశ్చర్యానికి గురి చేసింది. నిజామాబాద్ బరిలో ఉన్న తన కుమార్తె కవితకు దన్నుగా నిలవటమే కాదు.. మండవకున్న మంచిపేరు.. ఫ్యాన్ ఫాలోయింగ్ కవితకు ఓట్ల రూపంలో బదిలీ అవుతుందని ఆశించారు.
సారు అంచనాలకు భిన్నంగా నిజామాబాద్ ఓటర్లు తీర్పు ఇవ్వటం.. పక్కాగా గెలుస్తుందని భావించిన కవిత.. ఎన్నికల్లో ఓటమి పాలు కావటంతో సీఎం కేసీఆర్ తీవ్రమైన నిరాశకు గురైనట్లుగా చెబుతారు. దీంతో.. మండవ ప్రాధాన్యత పార్టీలో తగ్గినట్లు చెబుతారు. ఎన్నికల వేళలో.. తానే స్వయంగా మండవ ఇంటికి వెళ్లి.. భోజనం చేసిన కేసీఆర్ ఆ తర్వాత ఆయన్ను పట్టించుకోలేదన్న విమర్శ ఉంది.
ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు (సురేశ్ రెడ్డి, మండవ) ఉన్నప్పటికీ.. మొన్నటికి మొన్న రాజ్యసభ స్థానం సురేశ్ రెడ్డికి దక్కింది. మండవకు రిక్త హస్తమే దక్కిన విషయంలోనూ ఆయన నిరాశకు గురైనట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో ఉండటంతో పెద్దగా ప్రయోజనం లేదన్న విషయాన్ని మండవ గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు.. బీజేపీ నుంచి రిక్వెస్టుల మీద రిక్వెస్టులు పెరిగిపోయినందున.. తాను కారు దిగేసి.. కమలానికి దగ్గర కావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
మండవకు పదవి ఇచ్చినా.. ఇవ్వకున్నా ఫర్లేదని.. అధినేత కేసీఆర్ ఆయన్ను గుర్తిస్తున్నట్లుగా వైఖరి ఉంటే సరిపోతుందంటున్నారు. మరి.. అలాంటి వాటికి కేసీఆర్ సిద్ధంగా ఉండే అవకాశం లేని నేపథ్యంలొ.. మండవ కీలక నిర్ణయాన్ని తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. మరి.. తన పాత దోస్తును కేసీఆర్ వదులుకుంటారో? లేదో? కాలమే డిసైడ్ చేయాల్సి ఉంది. ఒకవేళ అలాంటిదే జరిగి మండవ కారు దిగేస్తే మాత్రం సీఎం కేసీఆర్ కు ఇబ్బందేనని చెబుతున్నారు.
This post was last modified on August 27, 2020 10:09 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…