కొన్ని కొన్ని సార్లు రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు వారికి బూమరాంగ్గా మారతాయి. ఇప్పుడు తలపండిన రాజకీయ నేతగా బీఆర్ ఎస్ నాయకులు భావించే సీఎం కేసీఆర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు.. ఆయనకే ఎదురు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అచ్చంపేటలో గురువారం నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
“మీరు మమ్మల్ని గెలిపిస్తే.. మీకు మంచి పాలన, పథకాలు అందిస్తాం. ఇప్పుడు ఇస్తున్న వాటికంటే.. ఎక్కువగా మేలు చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీరు మమ్మల్ని ఓడగొడితే.. ఏం చేస్తం.. ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటాం. కానీ, నష్టపోయేది మాత్రం మీరే. కాంగ్రెస్ రాబందులు మిమ్మల్ని పీక్కుతింటై” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే.. ఓడిపోయినా.. కూడా ప్రజల కోసం నిలబడతాం.. వారి సమస్యలపై పోరాటం చేస్తాం.. అని చెప్పాల్సిన కేసీఆర్.. ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటామని వ్యాఖ్యానించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తున్నాయి.
అదేసమయంలో నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్నారు. ఈ సారికి ప్రతిపక్షంలోకి వస్తే.. ఇంటికెళ్లి రెస్టు తీసుకుంటారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మరింత దూకుడుగా కేసీఆర్పై విరుచుకుపడ్డారు. “బైబై కేసీఆర్. నువ్వు ఓడిపోవుట ఖాయం.. ఫామ్ హౌస్ల రెస్టు తీసుకొనుడు ఖాయం.. బైబై కేసీఆర్” అంటూ.. రేవంత్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల క్లిప్ను ఆయన ట్వీట్కు జత చేశారు.
This post was last modified on October 27, 2023 7:10 pm
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…