Political News

బైబై కేసీఆర్‌.. : రేవంత్ సెటైర్లు

కొన్ని కొన్ని సార్లు రాజ‌కీయ నేత‌లు చేసే వ్యాఖ్య‌లు వారికి బూమ‌రాంగ్‌గా మార‌తాయి. ఇప్పుడు త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌గా బీఆర్ ఎస్ నాయ‌కులు భావించే సీఎం కేసీఆర్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు.. ఆయ‌న‌కే ఎదురు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్ ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా అచ్చంపేట‌లో గురువారం నిర్వ‌హించిన స‌భ‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

“మీరు మ‌మ్మ‌ల్ని గెలిపిస్తే.. మీకు మంచి పాల‌న‌, ప‌థ‌కాలు అందిస్తాం. ఇప్పుడు ఇస్తున్న వాటికంటే.. ఎక్కువ‌గా మేలు చేసే ప్ర‌య‌త్నం చేస్తాం. ఒక‌వేళ మీరు మ‌మ్మ‌ల్ని ఓడ‌గొడితే.. ఏం చేస్తం.. ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటాం. కానీ, న‌ష్ట‌పోయేది మాత్రం మీరే. కాంగ్రెస్ రాబందులు మిమ్మ‌ల్ని పీక్కుతింటై” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే.. ఓడిపోయినా.. కూడా ప్ర‌జ‌ల కోసం నిల‌బ‌డ‌తాం.. వారి స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తాం.. అని చెప్పాల్సిన కేసీఆర్‌.. ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటామ‌ని వ్యాఖ్యానించ‌డంపై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

అదేస‌మ‌యంలో నెటిజ‌న్లు కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్నారు. ఈ సారికి ప్ర‌తిప‌క్షంలోకి వ‌స్తే.. ఇంటికెళ్లి రెస్టు తీసుకుంటారా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మ‌రింత దూకుడుగా కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. “బైబై కేసీఆర్‌. నువ్వు ఓడిపోవుట ఖాయం.. ఫామ్ హౌస్‌ల రెస్టు తీసుకొనుడు ఖాయం.. బైబై కేసీఆర్‌” అంటూ.. రేవంత్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల క్లిప్‌ను ఆయ‌న ట్వీట్‌కు జ‌త చేశారు.

Satya

Recent Posts

రెచ్చగొడితే రచ్చే.. లంక బౌలర్లను ఉతికారేసిన వైభవ్!

పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…

21 minutes ago

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

1 hour ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

2 hours ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

4 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

9 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

10 hours ago