కొన్ని కొన్ని సార్లు రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు వారికి బూమరాంగ్గా మారతాయి. ఇప్పుడు తలపండిన రాజకీయ నేతగా బీఆర్ ఎస్ నాయకులు భావించే సీఎం కేసీఆర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు.. ఆయనకే ఎదురు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అచ్చంపేటలో గురువారం నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
“మీరు మమ్మల్ని గెలిపిస్తే.. మీకు మంచి పాలన, పథకాలు అందిస్తాం. ఇప్పుడు ఇస్తున్న వాటికంటే.. ఎక్కువగా మేలు చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీరు మమ్మల్ని ఓడగొడితే.. ఏం చేస్తం.. ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటాం. కానీ, నష్టపోయేది మాత్రం మీరే. కాంగ్రెస్ రాబందులు మిమ్మల్ని పీక్కుతింటై” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే.. ఓడిపోయినా.. కూడా ప్రజల కోసం నిలబడతాం.. వారి సమస్యలపై పోరాటం చేస్తాం.. అని చెప్పాల్సిన కేసీఆర్.. ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటామని వ్యాఖ్యానించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తున్నాయి.
అదేసమయంలో నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్నారు. ఈ సారికి ప్రతిపక్షంలోకి వస్తే.. ఇంటికెళ్లి రెస్టు తీసుకుంటారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మరింత దూకుడుగా కేసీఆర్పై విరుచుకుపడ్డారు. “బైబై కేసీఆర్. నువ్వు ఓడిపోవుట ఖాయం.. ఫామ్ హౌస్ల రెస్టు తీసుకొనుడు ఖాయం.. బైబై కేసీఆర్” అంటూ.. రేవంత్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల క్లిప్ను ఆయన ట్వీట్కు జత చేశారు.
This post was last modified on October 27, 2023 7:10 pm
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…