కొన్ని కొన్ని సార్లు రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు వారికి బూమరాంగ్గా మారతాయి. ఇప్పుడు తలపండిన రాజకీయ నేతగా బీఆర్ ఎస్ నాయకులు భావించే సీఎం కేసీఆర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు.. ఆయనకే ఎదురు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అచ్చంపేటలో గురువారం నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
“మీరు మమ్మల్ని గెలిపిస్తే.. మీకు మంచి పాలన, పథకాలు అందిస్తాం. ఇప్పుడు ఇస్తున్న వాటికంటే.. ఎక్కువగా మేలు చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీరు మమ్మల్ని ఓడగొడితే.. ఏం చేస్తం.. ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటాం. కానీ, నష్టపోయేది మాత్రం మీరే. కాంగ్రెస్ రాబందులు మిమ్మల్ని పీక్కుతింటై” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే.. ఓడిపోయినా.. కూడా ప్రజల కోసం నిలబడతాం.. వారి సమస్యలపై పోరాటం చేస్తాం.. అని చెప్పాల్సిన కేసీఆర్.. ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటామని వ్యాఖ్యానించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తున్నాయి.
అదేసమయంలో నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్నారు. ఈ సారికి ప్రతిపక్షంలోకి వస్తే.. ఇంటికెళ్లి రెస్టు తీసుకుంటారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మరింత దూకుడుగా కేసీఆర్పై విరుచుకుపడ్డారు. “బైబై కేసీఆర్. నువ్వు ఓడిపోవుట ఖాయం.. ఫామ్ హౌస్ల రెస్టు తీసుకొనుడు ఖాయం.. బైబై కేసీఆర్” అంటూ.. రేవంత్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల క్లిప్ను ఆయన ట్వీట్కు జత చేశారు.
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…
ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…
ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు…
మెగా వేలంలో ఎవరూ కొనని ఒక ఆటగాడు, ఏకంగా ఒక ఫ్రాంచైజీ తలరాతనే మారుస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.…
వారణాసి విడుదల ఇంకో ఏడాది టైం ఉందని, పదే పదే మహేష్ బాబు రీ రిలీజులను క్యూ కట్టడం ఎంత…