కొన్ని కొన్ని సార్లు రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు వారికి బూమరాంగ్గా మారతాయి. ఇప్పుడు తలపండిన రాజకీయ నేతగా బీఆర్ ఎస్ నాయకులు భావించే సీఎం కేసీఆర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు.. ఆయనకే ఎదురు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అచ్చంపేటలో గురువారం నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
“మీరు మమ్మల్ని గెలిపిస్తే.. మీకు మంచి పాలన, పథకాలు అందిస్తాం. ఇప్పుడు ఇస్తున్న వాటికంటే.. ఎక్కువగా మేలు చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీరు మమ్మల్ని ఓడగొడితే.. ఏం చేస్తం.. ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటాం. కానీ, నష్టపోయేది మాత్రం మీరే. కాంగ్రెస్ రాబందులు మిమ్మల్ని పీక్కుతింటై” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే.. ఓడిపోయినా.. కూడా ప్రజల కోసం నిలబడతాం.. వారి సమస్యలపై పోరాటం చేస్తాం.. అని చెప్పాల్సిన కేసీఆర్.. ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటామని వ్యాఖ్యానించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తున్నాయి.
అదేసమయంలో నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్నారు. ఈ సారికి ప్రతిపక్షంలోకి వస్తే.. ఇంటికెళ్లి రెస్టు తీసుకుంటారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మరింత దూకుడుగా కేసీఆర్పై విరుచుకుపడ్డారు. “బైబై కేసీఆర్. నువ్వు ఓడిపోవుట ఖాయం.. ఫామ్ హౌస్ల రెస్టు తీసుకొనుడు ఖాయం.. బైబై కేసీఆర్” అంటూ.. రేవంత్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల క్లిప్ను ఆయన ట్వీట్కు జత చేశారు.
This post was last modified on October 27, 2023 7:10 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…