Political News

సోనూ కంటే ముందు మోడీ స్పందించాడు

సోనూ సూద్.. లాక్ డౌన్ టైంలో అత్యంత చర్చనీయాంశం అయిన పేరు. కరోనా ధాటికి అల్లాడుతూ, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న జనాలకు అతను చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే అక్కడితో ఆగిపోకుండా పరిస్థితులు చక్కబడ్డాక కూడా ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చిందని తెలిసినా స్పందిస్తున్నాడు. వాళ్లకు అత్యవసరంగా సాయం అందిస్తున్నాడు.

ఇలాగే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతుకు ఒక్క రోజు వ్యవధిలో ట్రాక్టర్ తెప్పించిన సంగతి తెలిసిందే. ఇంకా దేశవ్యాప్తంగా ఇలా అనేక రకాలుగా, అనేక మందికి సాయపడుతున్నాడు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన చాలా సమస్యల్ని అతను పరిష్కరించాడు.

ఐతే ఇటీవలే మహారాష్ట్రకు చెందిన స్వప్నాలి అనే అమ్మాయి.. వెటర్నరీ సైన్స్ చదువుతూ.. ఆన్ లైన్ క్లాసులు అటెండ్ కావడం కోసం తన ఊరిలో కొండపైకి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి తలెత్తడం గురించి మీడియాలో ప్రముఖంగా వచ్చిన సంగతి తెలిసిందే. దీని గురించి తెలిసి ఆ అమ్మాయి ఇంటికి అతి త్వరలో వైఫై వస్తుందని సోనూ హామీ ఇచ్చాడు.

ఐతే అతడి బృందం ఆ ప్రయత్నాల్లో ఉండగానే కేంద్రంలోని మోడీ సర్కారు అప్రమత్తం అయింది. ఇలా అన్ని సమస్యలూ సోనూ తీర్చేసి క్రెడిట్ తీసుకుంటే తమ సంగతేంటి అనుకున్నారో ఏమో.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు అప్రమత్తం అయ్యారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఆ అమ్మాయి ఉన్న గ్రామానికి కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఇంటర్నెట్ వచ్చేలా చేశారు. దీంతో స్వప్నాలి ఇంట్లో కూర్చుని బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ ద్వారా ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవుతోంది.

నిన్న-నేడు అంటూ ఒకప్పుడు వర్షం పడుతుండగా కొండ మీద గుడిసెలో చదువుకుంటున్న ఫొటో.. ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఏ ఇబ్బంది లేకుండా పాఠాలు నేర్చుకుంటున్న ఫొటో పెట్టి మోడీని కీర్తిస్తున్నారు ఆయన అభిమానులు. అలాగే స్థానిక నాయకులు సైతం ఈ అమ్మాయికి సాయం చేసేందుకు పోటీ పడుతున్నారు. లోకల్ ఎమ్మెల్యే ఇప్పటికే రూ.50 వేల సాయం అందించాడు.

This post was last modified on August 27, 2020 9:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విశాఖ ఉక్కుకు కేంద్రం మ‌రో షాక్‌!

ఆంధ్రుల హ‌క్కుగా ఏర్ప‌డిన విశాఖ ఉక్కును ప్రైవేటు ప‌రం కాకుండా నిల‌బెట్టుకునేందుకు కార్మికులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఉద్య‌మాలు, నిర‌స‌న‌లు,…

2 hours ago

వ‌ర‌ద బాధితుల‌కు 25 వేల సాయం..:  చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

విజ‌య‌వాడ, గుంటూరు, బాప‌ట్ల‌, ఏలూరు జిల్లాల్లో వ‌ర‌దల కార‌ణంగా న‌ష్ట‌పోయిన బాధితుల‌కు ఏపీ ప్ర‌భుత్వం ప‌రిహారం ప్ర‌క‌టించింది. స్వ‌యంగా సీఎం…

2 hours ago

కిల్ రీమేక్ అతడితోనా.. వామ్మో

ఇటీవలి కాలంలో ఓ చిన్న సినిమా బాలీవుడ్లో సంచలనం రేపింది. లక్ష్య అనే కొత్త హీరోను పెట్టి నిఖిల్ నగేష్…

4 hours ago

ఒక్కడిగా వస్తేనే కంగువకు లాభం

ఏదో దసరాకు మంచి డేట్ దొరికిందని అక్టోబర్ 10 లాక్ చేసుకుంటే రజనీకాంత్ వెట్టయన్ ఇచ్చిన షాక్ కి వాయిదా…

5 hours ago

ప్రకంపనలు రేపుతున్న జానీ మాస్టర్ వివాదం

లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి చేసిన ఆరోపణలు నివురు గప్పిన నిప్పులా మొదలై…

7 hours ago

రావణుడు చేసిన గాయానికి భైర చికిత్స

ఆదిపురుష్ రిలీజైనప్పుడు ఎక్కువ శాతం ట్రోలింగ్ కి గురైన పాత్ర సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణుడు. దర్శకుడు ఓం…

9 hours ago