Political News

సోనూ కంటే ముందు మోడీ స్పందించాడు

సోనూ సూద్.. లాక్ డౌన్ టైంలో అత్యంత చర్చనీయాంశం అయిన పేరు. కరోనా ధాటికి అల్లాడుతూ, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న జనాలకు అతను చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే అక్కడితో ఆగిపోకుండా పరిస్థితులు చక్కబడ్డాక కూడా ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చిందని తెలిసినా స్పందిస్తున్నాడు. వాళ్లకు అత్యవసరంగా సాయం అందిస్తున్నాడు.

ఇలాగే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతుకు ఒక్క రోజు వ్యవధిలో ట్రాక్టర్ తెప్పించిన సంగతి తెలిసిందే. ఇంకా దేశవ్యాప్తంగా ఇలా అనేక రకాలుగా, అనేక మందికి సాయపడుతున్నాడు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన చాలా సమస్యల్ని అతను పరిష్కరించాడు.

ఐతే ఇటీవలే మహారాష్ట్రకు చెందిన స్వప్నాలి అనే అమ్మాయి.. వెటర్నరీ సైన్స్ చదువుతూ.. ఆన్ లైన్ క్లాసులు అటెండ్ కావడం కోసం తన ఊరిలో కొండపైకి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి తలెత్తడం గురించి మీడియాలో ప్రముఖంగా వచ్చిన సంగతి తెలిసిందే. దీని గురించి తెలిసి ఆ అమ్మాయి ఇంటికి అతి త్వరలో వైఫై వస్తుందని సోనూ హామీ ఇచ్చాడు.

ఐతే అతడి బృందం ఆ ప్రయత్నాల్లో ఉండగానే కేంద్రంలోని మోడీ సర్కారు అప్రమత్తం అయింది. ఇలా అన్ని సమస్యలూ సోనూ తీర్చేసి క్రెడిట్ తీసుకుంటే తమ సంగతేంటి అనుకున్నారో ఏమో.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు అప్రమత్తం అయ్యారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఆ అమ్మాయి ఉన్న గ్రామానికి కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఇంటర్నెట్ వచ్చేలా చేశారు. దీంతో స్వప్నాలి ఇంట్లో కూర్చుని బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ ద్వారా ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవుతోంది.

నిన్న-నేడు అంటూ ఒకప్పుడు వర్షం పడుతుండగా కొండ మీద గుడిసెలో చదువుకుంటున్న ఫొటో.. ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఏ ఇబ్బంది లేకుండా పాఠాలు నేర్చుకుంటున్న ఫొటో పెట్టి మోడీని కీర్తిస్తున్నారు ఆయన అభిమానులు. అలాగే స్థానిక నాయకులు సైతం ఈ అమ్మాయికి సాయం చేసేందుకు పోటీ పడుతున్నారు. లోకల్ ఎమ్మెల్యే ఇప్పటికే రూ.50 వేల సాయం అందించాడు.

This post was last modified on August 27, 2020 9:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

11 minutes ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

29 minutes ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

4 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

5 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

6 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

6 hours ago