Political News

చిటికేసి సవాల్ చేసిన రఘురాముడు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మీడియా ముందుకొచ్చి మాట్లాడితే.. అందరూ తన వైపు ఆసక్తిగా చూసేలా చేయగల నాయకుడు ఎవరు అంటే మరో మాట లేకుండా రఘురామకృష్ణం రాజు పేరు చెప్పేయొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిపక్షాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కంటే ఎక్కువగా విరుచుకుపడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు ఆ పార్టీకే చెందిన ఈ ఎంపీ.

ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు కూడా చేయించుకున్న రఘురామ.. అప్పట్నుంచి మరింతగా స్వరం పెంచుతున్నారు. తాజాగా ఆయన మరోసారి ఏపీ అధికార పార్టీ, ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. వైకాపా నేతల నుంచి తనతో పాటు వివిధ వర్గాల వాళ్లకు వస్తున్న బెదిరింపులు, వేధింపుల గురించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. మీ బెదిరింపుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ ఆయన చిటికేసి వైకాపా నేతలకు సవాలు విసిరారు.

పీపీఈ కిట్లు లేవని ఎప్పుడో కామెంట్ చేసిన డాక్టర్ గంగాధర్ లాంటి ప్రముఖ వైద్యుడికి ఇప్పుడు సెక్షన్ 41 కింద నోటీసులు ఇవ్వడమేంటని రఘురామ ప్రశ్నించారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా, మృధుభాషిగా డాక్టర్ గంగాధర్‌కు పేరుందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు నోరు విప్పినా భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

ఓ దళిత యువకుడు మద్యంపై మాట్లాడితే ఆ వ్యక్తిని వైసీపీ కార్యకర్తలు చంపుతామని బెదిరిస్తే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలొస్తున్నాయని.. ఇలా ప్రాణాలు తీసుకోవడం బాధాకరమని, ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని ఆయనన్నారు. తనకూ బెదిరింపులు వస్తున్నాయని.. ఎవరూ చలించకండని.. ఎవర్నీ ఎవరూ ఏమీ చేయలేరని.

ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ కాదని అన్నారు. తనను సోషల్ మీడియాలో ఓ మహిళా మూర్తి రకరకాలుగా మాట్లాడందని.. అవి ఆడవాళ్లు మాట్లాడాల్సిన మాటలే కావవి.. ఐతే ఇలా ఎన్నిరకాలుగా ఏం చేసినా ప్రయోజనం లేదని చిటికేసి చెప్పారు రఘురామక కృష్ణంరాజు.

This post was last modified on August 26, 2020 4:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

8 hours ago