ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ బాధితుల కోసమని అనంతపురం జిల్లాలో 1500 పడకలతో ఓ భారీ తాత్కాలిక ఆసుపత్రిని జగన్ సర్కారు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తోందని సోషల్ మీడియాలో వైకాపా అభిమానులు హోరెత్తించేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
చంద్రబాబును దెప్పిపొడుస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఒక సందర్భంలో ఈ ఆసుపత్రి గురించి ప్రస్తావించారు. అనంతపురంలో అద్భుతమైన కోవిడ్ ఆసుపత్రి రెడీ అయింది. చంద్రబాబుకు కరోనా సోకినా అక్కడికెళ్లి చికిత్స చేయించుకోవచ్చు అంటూ ఆయన ట్వీట్ చేశాడు.
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరైన రాజీవ్ కృష్ణ అయితే ఎక్కడో కర్ణాటకలో సిద్ధమైన కోవిడ్ ఆసుపత్రి ఫొటోలు పట్టుకొచ్చి.. చూశారా జగన్ సర్కారు ఇంత తక్కువ సమయంలో ఎంత మంచి ఆసుపత్రి రెడీ చేసిందో అంటూ ఎలివేషన్లు కూడా ఇచ్చేశారు. కట్ చేస్తే.. అది కర్ణాటకలోని ఆసుపత్రి అనే విషయాన్ని నెటిజన్లు బయటపెట్టేశారు. కానీ ఆయన తప్పు తెలుసుకుని పొరబాటును దిద్దుకున్నారు.
ఐతే ఇంత చర్చ జరిగి, ఇంతగా ఎలివేషన్ ఇచ్చుకున్న ఆసుపత్రిని కొంచెం ఆలస్యం అయినప్పటికీ కచ్చితంగా సిద్ధం చేస్తారని, మంచి వసతులు కల్పిస్తారని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఇప్పటిదాకా ఆ ఆసుపత్రి సిద్ధమే కాలేదు. పెద్ద గోడౌన్ ఒకటి అద్దెకు తీసుకుని పనులైతే మొదలుపెట్టారు కానీ.. అవి పూర్తి చేయలేదు.
ఉన్నతాధికారులు పట్టించుకోలేదా.. నిధులు అందలేదా.. దీని అవసరం లేదనుకున్నారా అన్నది తెలియదు. ఆసుపత్రి మాత్రం ఇప్పటికీ రెడీ కాలేదు. లోపల ఏమాత్రం సౌకర్యాలు లేకుండా మామూలు గోడౌన్లాగే కనిపిస్తోందది. దీని గురించి ఓ ప్రధాన పత్రిక కథనం కూడా రాసింది. అయినా ప్రభుత్వంలో కదలిక లేదు.
మరి ఏమీ చేయని చోట అద్భుతం జరిగిపోతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకోవడమెందుకు? అలా చేశాక ఇలా పట్టించుకోకుండా వదిలేయడం ఎందుకు? ఈ సోషల్ మీడియా కాలంలో ఇలాంటి విషయాల్లో ఎంతగా డ్యామేజ్ జరుగుతుందో తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యమేమిటో?
This post was last modified on August 30, 2020 9:43 am
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…