బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసే అవకాశం దక్కిందనే సమాచారంతో రాజశేఖర్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి మల్కాజిగిరిలో బల ప్రదర్శన నిర్వహించారు. దాదాపు వెయ్యి మందితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ మల్కాజిగిరి టికెట్ తనకు ఖాయమవడంతోనే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ బల ప్రదర్శనకు దిగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన మల్లారెడ్డి.. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మరోవైపు మల్కాజిగిరి లో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు కేసీఆర్ మరోసారి టికెట్ కేటాయించారు. కానీ తన కొడుకు రోహిత్ కు మెదక్ టికెట్ ఇవ్వలేదనే కారణంతో మైనంపల్లి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి టికెట్ కోసం బీఆర్ఎస్ నాయకుల మధ్య పోటీ మొదలైంది. ఇక్కడ తన అల్లుడిని నిలబెట్టేందుకు రంగంలోకి దిగిన మల్లారెడ్డి.. ఈ మేరకు కేటీఆర్ ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి టికెట్ మర్రి రాజశేఖర్ రెడ్డికే కేసీఆర్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి అప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఓడారు. అప్పటి నుంచి మల్కాజిగిరి నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నారు. మరోవైపు కంటోన్మెంట్లోనూ పార్టీ ఇంఛార్జీగా ఉన్నారు. ఇప్పుడు మైనంపల్లి వెళ్లిపోవడంతో మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు మర్రి రాజశేఖర్ రెడ్డికి మార్గం సుగగమైంది. టికెట్ తనకే ఇస్తున్నారనే సమాచారం రావడంతో మామ మల్లారెడ్డితో కలిసి మర్రి రాజశేఖర్ రెడ్డి రంగంలోకి దిగారు. అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవతున్న మైనంపల్లిని దాటుకుని అల్లుడిని గెలిపించుకోవడానికి ఇప్పటికే మల్లారెడ్డి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది.
This post was last modified on September 27, 2023 6:45 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…