Political News

సీబీఐకి చంద్రబాబు కేసు..ఉండవల్లిపై పట్టాభి ఫైర్

స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ కేసుకు ఇతర రాష్ట్రాలతో లింకు ఉందని, అందుకే, పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరముందని ఉండవల్లి పిల్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఉండవల్లిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరిన ఉండవల్లి..మద్యం స్కాంపై సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదని నిలదీశారు. రాజమండ్రి చుట్టూ అక్రమ ఇసుక రీచ్ ల గురించి ఉండవల్లి ఎందుకు ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ నేతల భూకబ్జాలపై మాట్లాడని ఉండవల్లి ఇపుడు మాత్రం సీబీఐ విచారణ కోరుతున్నారని దుయ్యబట్టారు. ఎవరో తయారు చేసిన పిటిషన్ పై ఉండవల్లి సంతకం చేశారా? అని ప్రశ్నించారు. తన పిటిషన్ లో ప్రేమ్ చంద్రా రెడ్డి పేరును ఉండవల్లి ఎందుకు ప్రస్తావించలేదని, నిజానిజాలు తెలిసి కూడా నటించవద్దని ఉండవల్లికి చురకలంటించారు. ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలని ఉండవల్లికి పట్టాభి హితవు పలికారు.

కాగా, హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సీఐడీ, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, గంటా సుబ్బారావు, కె. లక్షీనారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్, డిజైన్‌టెక్ సంస్థ, సంస్థ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, స్కిల్లర్ ఎంటర్‌ప్రైజెస్, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా 44 మందిని ఉండవల్లి తన పిల్ లో ప్రతివాదులుగా చేర్చారు. కానీ, ఈ జాబితాలో ప్రేమ్ చంద్రారెడ్డి పేరు లేకపోవడంతో పట్టాభి ప్రశ్నించారు. ఉండవల్లి పిల్ పై హైకోర్టు స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

3 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

3 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

4 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

5 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

5 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

5 hours ago