Political News

సీబీఐకి చంద్రబాబు కేసు..ఉండవల్లిపై పట్టాభి ఫైర్

స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ కేసుకు ఇతర రాష్ట్రాలతో లింకు ఉందని, అందుకే, పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరముందని ఉండవల్లి పిల్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఉండవల్లిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరిన ఉండవల్లి..మద్యం స్కాంపై సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదని నిలదీశారు. రాజమండ్రి చుట్టూ అక్రమ ఇసుక రీచ్ ల గురించి ఉండవల్లి ఎందుకు ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ నేతల భూకబ్జాలపై మాట్లాడని ఉండవల్లి ఇపుడు మాత్రం సీబీఐ విచారణ కోరుతున్నారని దుయ్యబట్టారు. ఎవరో తయారు చేసిన పిటిషన్ పై ఉండవల్లి సంతకం చేశారా? అని ప్రశ్నించారు. తన పిటిషన్ లో ప్రేమ్ చంద్రా రెడ్డి పేరును ఉండవల్లి ఎందుకు ప్రస్తావించలేదని, నిజానిజాలు తెలిసి కూడా నటించవద్దని ఉండవల్లికి చురకలంటించారు. ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలని ఉండవల్లికి పట్టాభి హితవు పలికారు.

కాగా, హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సీఐడీ, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, గంటా సుబ్బారావు, కె. లక్షీనారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్, డిజైన్‌టెక్ సంస్థ, సంస్థ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, స్కిల్లర్ ఎంటర్‌ప్రైజెస్, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా 44 మందిని ఉండవల్లి తన పిల్ లో ప్రతివాదులుగా చేర్చారు. కానీ, ఈ జాబితాలో ప్రేమ్ చంద్రారెడ్డి పేరు లేకపోవడంతో పట్టాభి ప్రశ్నించారు. ఉండవల్లి పిల్ పై హైకోర్టు స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on September 22, 2023 11:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేటీఆర్ నోట జగన్ మార్కు డైలాగ్

ఏపీలో వైసీపీ విపక్ష స్థానంలోరి మారిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ కూడా 6 నెలలకు ముందుగానే విపక్షంలోనే మారిపోయింది. విడదీయ లేనంత…

25 minutes ago

తారక్ రీమేక్ చేయదగ్గ తాతయ్య క్లాసిక్స్

స్టార్ వారసులు ఫ్యామిలీ లెగసిని కొనసాగించే క్రమంలో తాతలు, తండ్రుల బ్లాక్ బస్టర్స్ రీమేక్ చేయడం అభిమానులు కోరుకుంటారు. కానీ…

41 minutes ago

స్వర్ణ దేవాలయంలో నారా లోకేశ్ ఫ్యామిలీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి సెలవు రోజు ఆదివారం ఎంచక్కా ఆధ్మాత్మీక పర్యటనకు వెళ్లారు.…

2 hours ago

అట్లీ డబుల్ ఫార్ములా….ఎస్ చెప్పిన బన్నీ ?

దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే ప్యాన్ ఇండియా సినిమా తాలూకు ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దానికి…

2 hours ago

అనుకున్నట్టుగానే.. ఒకే బాటలో రేవంత్, కేటీఆర్

దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంలో కలిసి పోరాటం చేసేందుకు సిద్ధమన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్…

2 hours ago

శ్రీలంకలో ‘కింగ్ డమ్’ ఏం చేయబోతున్నాడు

మే 30 విడుదల కాబోతున్న కింగ్ డమ్ కౌంట్ డౌన్ ఇంకో అరవై ఏడు రోజులు మాత్రమే ఉంది. విజయ్…

2 hours ago