ఏపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో యువతకు గత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నైపుణ్యాలను నేర్పించి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం యువతకు గంజాయి, లిక్కర్ విరివిగా అందిస్తోందని బ్రాహ్మణి తీవ్రస్థాయిలోఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పేంటని, ఆయనను తెల్లవార కుండానే ఎందుకు అరెస్టు చేశారని, ఎందుకు జైల్లో పెట్టారని ఆమె నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వం దేనికీ సమాధానం చెప్పడం లేదని విమర్శించారు.
చంద్రబాబు అరెస్ట్, జైలుపాలు చేయడాన్ని నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజమండ్రిలో మహిళలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు చేపట్టిన క్యాండిల్ ర్యాలీకి మద్దతుగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. స్థానిక తిలక్ రోడ్డులోని సాయి బాబా ఆలయం దగ్గర నుంచి శ్యామలానగర్ రామాలయం జంక్షన్ వరకూ ఈ క్యాండిల్ ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. “చంద్రబాబు లాంటి సీనియర్ నేతను, విజనరీ నేతను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అన్యాయంగా జైల్లో పెట్టారు. లక్షలాది మందికి స్కిల్స్ ద్వారా ఉద్యోగాలు వచ్చేలా చంద్రబాబు చేశారు. సంక్షేమం చేయడం నేరమా?“ అని బ్రాహ్మణి ప్రశ్నించారు. అంతేకాదు, ప్రస్తుత ప్రభుత్వం యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉద్యోగాలు ఇచ్చే బదులు.. గంజాయి, లిక్కర్ తప్ప ఏమి ఇస్తోందని నిలదీశారు.
తమకు మద్దతు తెలుపుతున్న జాతీయ నాయకులకు, ఐటీ ఉద్యోగులందరికి నారా బ్రాహ్మణి ధన్యవాదాలు తెలిపారు. లోకేష్ ఒకచోట....మేము ఒకచోట తిరుగుతున్నాం.. నాలాంటి యువతీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడమే చంద్రబాబు చేసిన తప్పా? లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తారేమో?. రిమాండ్ రిపోర్ట్ చదివితే ఎనిమిదేళ్ళ దేవన్ష్ అయిన అందులో ఏమి లేదని చెప్తాడు. ఇప్పుడు మేము ఒంటరి వాళ్ళం కాదు. మా వెనక టీడీపీ కుటుంబం ఉంది అని నారా బ్రాహ్మణి వ్యాఖ్యానించారు.
This post was last modified on September 16, 2023 10:00 pm
ఎప్స్టీన్ ఫైల్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మాట. ఎప్స్టీన్ అనే అమెరికన్ వ్యాపారవేత్త.. తాను ఇచ్చే ప్రైవేట్ పార్టీలకు ఎంతోమంది…
తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని కమిటీలను నియమించింది. మరో…
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి…
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
సినీ రంగంలోకి కాస్త పేరు తెచ్చుకున్న ఎవ్వరైనా.. మళ్లీ జన్మంటూ ఉంటే ఇలా పుట్టాలని కోరుకోను అన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…