Political News

ఆధార్ తో పాన్ ను లింక్ చేశారా? లేదంటే తిప్పలే

ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేయాల్సిన విషయం చాలా పాతదే. కాకుంటే.. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకునే వాళ్లు తీసుకుంటే పట్టించుకోని వాళ్లు పిచ్చ లైట్ గా తీసుకోవటం తెలిసిందే.

ఇప్పుడు అలాంటి వారందరికి దిమ్మ తిరిగేలా షాకిచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది. కేంద్రం తాజాగా డిసైడ్ చేసిన గడువు తేదీ లోపల ఆధార్ తో పాన్ ను అనుసంధానం చేయని పక్షంలో అలాంటి కార్డుల్ని.. రద్దు చేయాలన్న యోచనలో కేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు.

తాజాగా దీనికి సంబంధించిన ఒక గడువు తేదీని మోడీ సర్కారు నిర్ణయించింది. 2021 మార్చి 31వ తేదీ లోపు ఆధార్ తో పాన్ కార్డును లింకు చేయించుకోవాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఇలా లింకు చేయని వారు దగ్గర దగ్గర 18 కోట్ల మంది ఉంటారన్నది ఒక అంచనా. దేశ జనాభా 130 కోట్లు అయితే.. కేవలం 15 మిలియన్ల మంది మాత్రమే ఐటీ రిటర్నులను దాఖలు చేసినట్లుగా తేల్చారు.

ఇక.. రిటర్ను జారీ చేసిన వారిలోనూ 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు 57 శాతం మంది ఉంటే.. 2.5 లక్షల నుంచి రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న వారు పద్దెనిమిది శాతం కాగా.. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు పదిహేడు శాతం.. రూ.10 నుంచి రూ.50లక్షల మధ్య ఆదాయం ఉన్న వారు ఏడు శాతంగా లెక్క తేల్చారు.

ఇక.. వార్షికఆదాయం రూ.50 లక్షలకు పైనే ఉన్న వారు కేవలం ఒక్క శాతమేనని చెబుతున్నారు. ఇప్పటివరకు 32.71 కోట్లకు పైగా పాన్ కార్డుల్ని బయోమెట్రిక్ ఐడీ ఆధార్ తో అనుసంధానం చేశారు. ఇలా రెండు కార్డుల్ని అనుసంధానం చేయని వారిపై వేటు వేయనున్నారు.

గడిచిన కొద్ది కాలంగా ఒక్కో వ్యక్తి దగ్గర రెండో.. మూడేసి చొప్పున పాన్ కార్డులు ఉండటం వల్ల.. ఐటీ పన్ను కట్టకుండా తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఆధార్ తో ఒక్కసారి పాన్ కార్డును అనుసంధానం చేయటం తప్పనిసరి అయితే.. పన్ను ఎగవేత దారులకు భారీ షాక్ తగిలే ప్రమాదం పొంచి ఉన్నట్లే.

This post was last modified on August 22, 2020 8:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ ఒక్క మాటతో ఆ ఊళ్ల దశ మారుతోంది!

నిజమే... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ఒక్కటంటే ఒక్క మాటతో ఆ రెండు గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. మరికొన్నాళ్లుంటే...…

38 seconds ago

లూసిఫర్ 3 హీరో మోహన్ లాల్ కాదు

కంటెంట్ కన్నా ఎక్కువ వివాదాలతో వార్తల్లో నిలిచిన లూసిఫర్ సీక్వెల్ ఎంపురాన్ 2 తాజాగా ఇరవైకి పైగా కత్తిరింపులు, రెండు…

17 minutes ago

పుష్ప 3 రహస్యం – 2026 సుకుమార్ ని అడగాలి

గత ఏడాది డిసెంబర్లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ కొనసాగింపు పుష్ప…

40 minutes ago

తెలంగాణ గ్రూప్-1 పరీక్షల్లో భారీ స్కాం?

తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన…

2 hours ago

హెచ్‌సీయూ భూముల గొడవ.. ఉపాసన, రేణు గళం

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తరచుగా పెద్ద పెద్ద వివాదాలే చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాదంతా…

3 hours ago

మరోసారి తన తప్పు ఒప్పుకున్న జగన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయని…

3 hours ago