Political News

మరింత దగ్గరవుతున్న టీడీపీ జనసేన

తెలుగుదేశం పార్టీ, జనసేనలు మరింత దగ్గరవుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు అరెస్టయి రిమాండుకు వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతుగా నిలిచారు. అప్రజాస్వామికంగా చంద్రబాబును అరెస్టుచేయటాన్ని పవన్ ఖండించారు. అరెస్టుకు నిరసనగా చంద్రబాబుకు మద్దతు ప్రకటించి విజయవాడ వస్తున్న పవన్ను కుంచనపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తన వెహికల్లో నుండి పవన్ బయటకు వచ్చి నడిరోడ్డు మీద పడుకుని నిరసన తెలిపారు.

తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీసుకు చేరుకున్న వెంటనే నేతలతో సమావేశమయ్యారు. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడటమే కాకుండా జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. జగన్ ను తరిమికొట్టకపోతే ఏపీలో ఎవరూ బతకలేరంటు మండిపోయారు. వెంటనే లోకేష్ కు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. టీడీపీ పిలుపిచ్చిన రాష్ట్ర బంద్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లోనే అటు రాజమండ్రిలో చంద్రబాబును కలిసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అలాగే లోకేష్ తో కూడా భేటీ అవబోతున్నారు. ఇదంతా చూసిన తర్వాత ఇప్పటికన్నా భవిష్యత్తుల్లో రెండు పార్టీలు మరింత సన్నిహితం అవబోతున్నట్లు అర్ధమైపోతోంది. ఎందుకంటే ఇద్దరికి కామన్ శతృవు జగన్ మాత్రమే. విడివిడిగా పోరాటం చేస్తే వైసీపీని రాబోయే ఎన్నికల్లో ఓడించటం సాధ్యంకాదని ఇప్పటికే అనేక సందర్భాల్లో చంద్రబాబు, పవన్ బహిరంగంగానే చెప్పిన విషయం తెలిసిందే.

అందుకనే పొత్తుపెట్టుకుని పోరాటాలు చేయాల్సిందే అని అనుకుంటున్నారు. అయితే బీజేపీ విషయం తేలకపోవటంతో రెండుపార్టీల మధ్య పొత్తుల చర్చలు ముందుకు సాగటంలేదు. అయితే ఇపుడు చంద్రబాబు అరెస్టన్నది సడెన్ డెవలప్మెంట్. కాబట్టి బీజేపీని పక్కనపెట్టేసైనా సరే టీడీపీతో కలవాలని పవన్ అనుకుంటున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇందుకు వీలుగానే పవన్ తన పార్టీ కార్యాచరణ ప్రాణాళికను రెడీచేస్తున్నారు. ఇప్పటికే రెండుపార్టీల మధ్య పొత్తు ఫైనల్ అయిపోయిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాబట్టి తాజా పరిస్ధితులు భేరీజు వేసుకున్న తర్వాతే టీడీపీకి అన్నీవిధాలుగా మద్దతుగా నిలబడాలని పవన్ డిసైడ్ అయ్యారు.

Satya

Recent Posts

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

8 minutes ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

3 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

6 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

6 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

9 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

9 hours ago