Political News

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైకోర్టు సంచలన ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని వస్తోన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఏపీలోని ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని విపక్ష నేత చంద్రబాబు ఏకంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు.

ఏపీలో ఆర్టికల్స్ 19 మరియు 21 ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, ఈ వ్యవహారంపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. అయితే, ఫోన్ ట్యాపింగ్‌పై ఏమైనా ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని..తాము విచారణ చేపడతామని చంద్రబాబుకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు.

మరోవైపు, ఈ అంశంపై ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆధారాలుంటే సమర్పించాలని పిటిషనర్ ను ఆదేశించిన హైకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు గతంలోనే నోటీసులు జారీ చేసింది.

ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పిటిషన్లపై మరోసారి విచారణ జరిపిన హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వ్యవహారంలో 16 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

సీబీఐ, రిలయన్స్ జియో, వోడాఫోన్, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోషియేషన్ అధ్యక్షుడులు నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరంతా వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులపై 4 వారాల్లో సమాధానాలు పంపాలని హైకోర్టు ఆదేశించింది.

కాగా, న్యాయమూర్తులు, న్యాయవాదులు, విపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు, వారి క‌ద‌లిక‌ల‌పై నిఘా పెట్టారంటూ పలు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లలో వ‌చ్చిన వార్త‌ల‌పై హైకోర్టులో ప్రజా ప్ర‌యోజ‌న వాజ్యం దాఖ‌ల‌య్యింది. ప్రభుత్వంలోని పెద్దల అండ‌తో న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు కళంకం తెచ్చేలా వ్యవహరించారని విశాఖ‌పట్నంలోని గోపాలపట్నానికి చెందిన న‌క్కా నిమ్మీగ్రేస్ ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్‌, ట్రాకింగ్‌, నిఘా తదితరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీల వ్యవహారంపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా లోతుగా విచారణ జరపాలని.. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులను బాధ్యులను చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును పిటిష‌న‌ర్ కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా 16మందికి నోటీసులు జారీ చేసింది.

This post was last modified on August 21, 2020 5:30 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

తమన్నా రాశిఖన్నా ‘బాక్’ రిపోర్ట్

ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్‌మనై 4 మీద కాస్తో కూస్తో…

31 seconds ago

వరలక్ష్మి ‘శబరి’ ఎలా ఉంది

తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్…

26 mins ago

గెలిస్తే ఎంపీ .. ఓడితే గవర్నర్ !

ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…

30 mins ago

ఆ పార్టీలో అందరూ కాబోయే మంత్రులే !

భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల…

2 hours ago

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

12 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

13 hours ago