Political News

శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో పేలుళ్లు.. చిక్కుకునన సిబ్బంది

తరచూ ఏదో విపత్తు చోటు చేసుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో మరో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఎప్పుడు వినని రీతిలో శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగలో ఉన్న తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ టన్నెల్ లో ప్రమాదం చోటు చేసుకునే సమయానికి ఇరవై మంది వరకు సిబ్బంది పని చేస్తున్నట్లు తెలుుస్తోంది.

రాత్రి విధుల్లో సిబ్బంది తమ పని తాము చేసుకుంటున్న వేళ.. నాలుగో యూనిట్ టర్మినల్ వద్ద కార్మికులు విద్యుదుత్పత్తి పనిలో నిమగ్నమై ఉన్నారు. అనుకోని రీతిలో పెద్ద శబ్దంతో పాటు.. ఆకస్మాత్తుగా షార్ట్ సర్య్కూట్ తో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ప్యానల్ బోర్డులో మంటలు చెలరేగిన వెంటనే మంటలు టన్నెళ్లకు వ్యాపించి పేలుళ్లు సంభవించాయి. భారీ శబ్దాలు వెలువడ్డాయి.

రెండు కిలోమీటర్ల సొరంగంలో జీరో లెవల్ నుంచి సర్వీస్ బే వరకు దట్టమైన పొగ కమ్ముకుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో దాదాపు 25 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే.. సిబ్బంది పలువురు బయటకు పరుగులు తీసినట్లుగా తెలుస్తుంది. వీరిలో కొందరు గాయపడగా.. మరికొందరు మాత్రం అందులోనే చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది.

బయటపడిన వారిని వెనువెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు ఆరుగురు మంటల్లో చిక్కుకుపోయినట్లుగా సమాచారం. సొరంగంలో దట్టమైన పొగలు వెలువడుతుండటంతో సహాయ కార్రయక్రమాలకు ఆటంకం కలుగుతున్నట్లుగా చెబుతున్నారు. మంటల్ని ఆర్పే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే.. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు తొమ్మిది మంది మంటల వద్ద చిక్కుకుపోయి.. బయటకు రాలేని పరిస్థితుత్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పోలీసులు.. రక్షణ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సమాచారం అందిన వెంటనే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి.. వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డిలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యుట్ కారణంగా ఈ భారీ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నా.. నిత్యం సురక్షిత చర్యలు పెద్ద ఎత్తున తీసుకునే చోట ఇలాంటి ఘోరం చోటు చేసుకోవటం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి.

This post was last modified on August 21, 2020 12:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago