Political News

‘స్వచ్ఛ సర్వేక్షణ్-2020’ టాప్-10లో 3 ఏపీలోనివే

2014లో దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత ‘స్వచ్ఛ భారత్’ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. పరిసరాల శుభ్రతపై అవగాహన పెంచుతూ మోదీ చేపట్టిన బృహత్తర కార్యక్రమం….దేశంలోని మెట్రో నగరాలు, పట్టణాలతోపాటు, పల్లెలకూ వ్యాపించింది.

ఈ క్రమంలోనే దేశంలోని నగరాల మధ్య స్వచ్ఛతలో పోటీతత్వం పెంపొందించేందుకు గత నాలుగు సంవత్సరాలుగా ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ సర్వేను ప్రతి ఏటా‌ మినిస్ట్రీ ఆఫ్ హౌజింగ్ అండ్ అర్బన్ అఫైర్స్‌ (ఎంవోయూహెచ్ఏ) నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్-2020’జాబితాలో ఇండోర్ నగరం తొలి స్థానం దక్కించుకుంది.

మధ్యప్రదేశ్ రాజధాని అయిన ఇండోర్ వరుసగా నాలుగోసారి క్లీనెస్ట్‌ సిటీగా నిలవడం విశేషం. జాతీయవ్యాప్తంగా శుభ్రత విషయంలో నిర్వహించిన సర్వేలో క్లీనెస్ట్‌ సిటీగా ఇండోర్‌ నిలిచిందని ‘స్వచ్ఛ మహోత్సవ్’ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఈ సర్వేలో సూరత్‌ రెండో క్లీనెస్ట్ సిటీగా నిలవగా, నవీ ముంబై మూడో స్థానం దక్కించుకుందని ఆయన ప్రకటించారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నాలుగో స్థానం దక్కించుకుందని తెలిపారు.

ఇండోర్ పరిశుభ్రమైన నగరంగా నిలవడం ఇది వరుసగా నాలుగోసారి అని, పరిశుభ్రత విషయంలో అక్కడి ప్రజలు చాలా అంకిత భావం చూపారని హర్దీప్ పూరీ అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్‌కు, ప్రజలకు, మున్సిపల్ కార్పొరేషన్‌కు అభినందనలు తెలిపారు. సూరత్ రెండో స్థానంలో నిలిచినందుకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కూడా పూరీ అభినందనలు తెలిపారు.

అయితే, మూడో క్లీనెస్ట్ సిటీగా నిలిచిన ముంబైకి సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేరును కూడా పూరీ ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ జాబితాలోని టాప్-10లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి న‌గ‌రాలు కూడా చోటు ద‌క్కించుకున్నాయి. కాగా, గంగా నది ఒడ్డులో స్వచ్ఛ పట్టణంగా వారణాసి ఎంపికైంది. అలాగే జలంధర్ కంట్ క్లీనెస్ట్‌ కంటోన్మెంట్‌గా నిలిచింది. ఈ సర్వేలో 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, గంగా నదీ పరివాహక టౌన్లతో కలిపి 92 పట్టణాలకు చెందిన 1.87 కోట్ల మంది పౌరులు పాల్గొన్నారు.

This post was last modified on August 21, 2020 12:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

1 hour ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

2 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

4 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

5 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

6 hours ago