తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్నేశారు. అందు కోసం కసరత్తుల్లో మునిగిపోయారు. ముందుగానే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమర శంఖం పూరించారు. అభ్యర్థుల విజయం కోసం ప్రణాళికల్లో మునిగిపోయారు. అంతా బాగానే ఉంది కానీ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం కేసీఆర్ కు ఆందోళన కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి ఇక్కడ ఆ పార్టీ పరిస్థితి అంతంతమాత్రమే. ఇక ఇప్పుడు కీలక నాయకులూ పార్టీకి దూరమవడం బీఆర్ఎస్ను మరింత దెబ్బ కొడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఖమ్మంలో కారు బ్రేక్ డౌన్ అయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ తీరుతో పడలేక, కేసీఆర్ తో కలిసి నడవలేక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లో చేరిన ఆయన త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలిచి.. బీఆర్ఎస్ను దెబ్బతీయాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక ఇప్పుడు ఖమ్మంలో మరో కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధమయ్యారు. తనను కాదని పాలేరు నియోజకవర్గం టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి కేటాయించడంతో తుమ్మల అసమ్మతితో ఊగిపోతున్నారు. ఎలాగైనా పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్న తుమ్మల కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైందనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఖమ్మంలో బీఆర్ఎస్ మరింత బలహీనపడగా.. కాంగ్రెస్ పుంజుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాలకు గాను బీఆర్ఎస్కు దక్కింది ఒకటే. ఖమ్మం నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు గెలిచిన పువ్వాడ అజయ్ మాత్రం ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్లో చెప్పుకోదగ్గ నేతగా ఉన్నారు. మరోవైపు చేరికలు, కీలక నేతలతో ఖమ్మంలో పాగా వేసేందుకు కాంగ్రెస్ చూస్తోంది. మరి ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో బీఆర్ఎస్కు ఎన్ని టికెట్లు దక్కుతాయో చూడాలి.
This post was last modified on September 1, 2023 5:10 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…