Political News

సస్పెన్సులో షర్మిల పర్యటన

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన సస్పెన్సును పెంచేస్తోంది. కొంతకాలంగా షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోతుందని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఆ ప్రచారానికి తగ్గట్లే షర్మిల మూడుసార్లు బెంగుళూరు వెళ్ళి కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. తర్వాత మూడుసార్లు ఢిల్లీకి వెళ్ళారు. ఒకసారి స్పీడుగా జరుగుతున్న మంతనాలు మరోసారి నత్తను తలపిస్తున్నది. దాంతో విలీనం చర్యలు ఎందుకు స్పీడుగా జరుగుతున్నాయి, ఎందుకు స్లో అయిపోయిందో ఎవరు చెప్పలేకపోతున్నారు.

అసలు విలీనం ఉంటుందా ఉండదా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. గడచిన 15 రోజులుగా విలీనంపై ఎలాంటి అపడ్ డేట్లు లేవనే చెప్పాలి. అలాంటిడి సడెన్ గా షర్మిల భర్తతో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. విచిత్రం ఏమిటంటే పార్టీలోని కీలకనేతలను తీసుకెళ్ళకుండా చివరకు గన్ మెన్లను కూడా హైదరాబాద్ లోనే వదిలేసి ఆమె భర్తతో పాటు ఢిల్లీకి వెళ్ళినట్లు పార్టీవర్గాల సమాచారం. ఇంత గోప్యంగా షర్మిల ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు ? వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అన్నదే అర్ధంకావటంలేదు.

కాంగ్రెస్ అగ్రనేతల నుండి వచ్చిన కబురు కారణంగానే షర్మిల హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళారనే ప్రచారం మొదలైంది. అన్నీ కుదిరితే గురువారమే పార్టీ అగ్రనేత సోనియాగాంధితో షర్మిల భేటీ జరిగే అవకాశముందని సమాచారం. సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ కోసమే షర్మిల వెయిట్ చేస్తున్నారు. వీళ్ళ భేటీలో కాంగ్రెస్ లో తన పాత్రపై షర్మిల క్లారిటి తెచ్చుకునే అవకాశముంది.

ఒకసారి క్లారిటి వచ్చేస్తే విలీనం అన్నది ఇక లాంఛనమే అని అందరికీ తెలుసు. కాకపోతే ఆ క్లారిటి అన్నది తెలంగాణాలో పోషించబోయే పాత్ర పైనేనా లేకపోతే ఏపికీ తరలి వెళ్ళే విషయంపైనా అన్నదే సస్పెన్సుగా మారింది. ఈ ఒక్క విషయంలోనే షర్మిల కూడా క్లారిటి కోరుకుంటున్నారు. షర్మిల ఆలోచన ప్రకారం తెలంగాణాలోనే ఉండాలనుంది. కాంగ్రెస్ ఏమో ఏపీలో బాధ్యతలు తీసుకుని బలోపేతం చేయాలని కోరుకుంటున్నది. మరి చివరకు ఏమి క్లారిటి వస్తుందో చూడాల్సిందే.

This post was last modified on August 31, 2023 1:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

4 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

5 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

6 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

6 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

6 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

7 hours ago