Political News

సస్పెన్సులో షర్మిల పర్యటన

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన సస్పెన్సును పెంచేస్తోంది. కొంతకాలంగా షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోతుందని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఆ ప్రచారానికి తగ్గట్లే షర్మిల మూడుసార్లు బెంగుళూరు వెళ్ళి కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. తర్వాత మూడుసార్లు ఢిల్లీకి వెళ్ళారు. ఒకసారి స్పీడుగా జరుగుతున్న మంతనాలు మరోసారి నత్తను తలపిస్తున్నది. దాంతో విలీనం చర్యలు ఎందుకు స్పీడుగా జరుగుతున్నాయి, ఎందుకు స్లో అయిపోయిందో ఎవరు చెప్పలేకపోతున్నారు.

అసలు విలీనం ఉంటుందా ఉండదా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. గడచిన 15 రోజులుగా విలీనంపై ఎలాంటి అపడ్ డేట్లు లేవనే చెప్పాలి. అలాంటిడి సడెన్ గా షర్మిల భర్తతో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. విచిత్రం ఏమిటంటే పార్టీలోని కీలకనేతలను తీసుకెళ్ళకుండా చివరకు గన్ మెన్లను కూడా హైదరాబాద్ లోనే వదిలేసి ఆమె భర్తతో పాటు ఢిల్లీకి వెళ్ళినట్లు పార్టీవర్గాల సమాచారం. ఇంత గోప్యంగా షర్మిల ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు ? వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అన్నదే అర్ధంకావటంలేదు.

కాంగ్రెస్ అగ్రనేతల నుండి వచ్చిన కబురు కారణంగానే షర్మిల హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళారనే ప్రచారం మొదలైంది. అన్నీ కుదిరితే గురువారమే పార్టీ అగ్రనేత సోనియాగాంధితో షర్మిల భేటీ జరిగే అవకాశముందని సమాచారం. సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ కోసమే షర్మిల వెయిట్ చేస్తున్నారు. వీళ్ళ భేటీలో కాంగ్రెస్ లో తన పాత్రపై షర్మిల క్లారిటి తెచ్చుకునే అవకాశముంది.

ఒకసారి క్లారిటి వచ్చేస్తే విలీనం అన్నది ఇక లాంఛనమే అని అందరికీ తెలుసు. కాకపోతే ఆ క్లారిటి అన్నది తెలంగాణాలో పోషించబోయే పాత్ర పైనేనా లేకపోతే ఏపికీ తరలి వెళ్ళే విషయంపైనా అన్నదే సస్పెన్సుగా మారింది. ఈ ఒక్క విషయంలోనే షర్మిల కూడా క్లారిటి కోరుకుంటున్నారు. షర్మిల ఆలోచన ప్రకారం తెలంగాణాలోనే ఉండాలనుంది. కాంగ్రెస్ ఏమో ఏపీలో బాధ్యతలు తీసుకుని బలోపేతం చేయాలని కోరుకుంటున్నది. మరి చివరకు ఏమి క్లారిటి వస్తుందో చూడాల్సిందే.

This post was last modified on August 31, 2023 1:22 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

9 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

9 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

11 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

11 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

16 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

18 hours ago