Political News

డ్వాక్రా మహిళలకు జగన్ బంపర్ ఆఫర్

ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓ పక్క రాష్ట్రంలో కరోనా కట్టడికి నియంత్రణ చర్యలు తీసుకుంటున్న జగన్ సర్కార్…మరో పక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కరోనా వల్ల అనివార్యమైన లాక్ డౌన్ వల్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ….గతంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు సీఎం జగన్.

ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో జగన్ నేతృత్వంలోని మంత్రి వర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ముగిసిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2020 నుంచి 2023 వరకు కొనసాగేలా నూతన పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సెప్టెంబరు 5వ తేదీ నుంచి జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జగనన్న విద్యా కానుక ద్వారా యూనిఫామ్‌లు, షూ, బెల్టు తదితర వస్తువులను 43 లక్షలకు పైగా విద్యార్థులకు అందజేయనున్నారు. రాబోయే నాలుగేళ్లలో డ్వాక్రా మహిళలకు రూ.27 వేల కోట్లకు పైగా లబ్ది చేకూర్చే వైఎస్సార్ ఆసరాపథకానికి జగన్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సెప్టెంబర్‌ 11న వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. సెప్టెంబర్ 1 నుంచి సంపూర్ణ పోషణ పథకం ప్రారంభించడంతోపాటు, వైఎస్ఆర్ భీమా పథకానికి ఆమోదం తెలిపింది.

సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.పంచాయితీరాజ్ శాఖలో 51 డివిజినల్ డెవలప్మెంట్ అధికారుల పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కడప, చిత్తూరు జిల్లాల్లో ఏర్పాటైన ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకంపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

కడప జిల్లాలో పోలీస్ శాఖ బలోపేతానికి, రాయచోటిలో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీసీ ఫెడరేషన్లు, రామనపాడు పోర్టు డీపీఆర్‌కు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నంలో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక, గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై కూడా కేబినెట్‌ చర్చించింది. రాజధాని భూముల కుంభకోణం, ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం, పాలనా వికేంద్రీకరణ బిల్లు, ఇళ్ల పట్టాల పంపిణీ, న్యాయపరమైన సమస్యలు, కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించింది.

This post was last modified on August 20, 2020 2:48 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

24 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

1 hour ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

1 hour ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago