గన్నవరం నియోజకవర్గంలో పంచాయితి జగన్మోహన్ రెడ్డికి కాస్త తలనొప్పిగానే తయారైంది. ఈమధ్యనే యార్లగడ్డ వెంకటరావు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. పెద్ద తలనొప్పి వదిలిపోయిందని అనుకుంటే దుట్టా రామచంద్రరావు రూపంలో మళ్ళీ మొదలైంది. 2014లో వైసీపీ నుండి పోటీచేసి ఓడిపోయింది దుట్టానే. 2019లో యార్లగడ్డ చివరి నిముషంలో వచ్చి టికెట్ తీసుకుని ఓడిపోయారు. రెండు ఎన్నికల్లో ఇద్దరిపైన గెలిచిన వల్లభనేని వంశీ మారిన రాజకీయ పరిణామాల్లో జగన్ కు దగ్గరయ్యారు.
అనేక సమీకరణలను పరిశీలించిన తర్వాత వంశీకే జగన్ టికెట్ ప్రకటించారు. దాన్ని నచ్చని యార్లగడ్డ దుట్టాతో కలిసి చాలా గొడవలే చేశారు. అయితే ఎంత గొడవచేసినా ఉపయోగం లేకపోవటంతో చేసేదిలేక చివరకు పార్టీనే వదిలేశారు. ఇపుడు దుట్టా పాత్ర ఏమిటనేది అర్ధంకావటంలేదు. వంశీ మీద దుట్టాకు కూడా బాగా కోపముంది. అందుకనే యార్లగడ్డ పార్టీని వదిలేయగానే జగన్ స్వయంగా దుట్టా కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడారు.
తర్వాత మీడియాతో మాట్లాడిన దుట్టా కూడా జగన్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించారు. పార్టీ మారేది లేదని చెప్పారు. అయితే తర్వాత ఏమైందో తెలీటంలేదు. అందుకనే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని దుట్టాతో మాట్లాడేందుకు పంపించారు. దుట్టాతో ఎంపీ చాలాసేపు ఏకంతంగా మాట్లాడారు. ఎంపీ రాయబారం ఫలించిందనే పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఎంపీతో భేటీ తర్వాత దుట్టా అయితే ఏమీ మాట్లాడలేదు.
ఇక్కడే దుట్టా వైఖరిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి మరోవైపు దుట్టా వైఖరి అనుమానంగా ఉంది. దాంతో గన్నవరంలో ఏమి జరుగుతోందో అర్ధంకావటంలేదు. నియోజకవర్గంలో దుట్టాకు కూడా పట్టుదనే చెప్పాలి. జగన్ మాటవిని వంశీకి మద్దతుగా దుట్టా పనిచేస్తే ఫలితం ఒకలాగుంటుంది. కాదని వ్యతిరేకం చేస్తే ఫలితం ఎలాగుంటుందనేది సస్పెన్సుగా మారింది. అందుకనే గన్నవరం రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. మరి దుట్టా ఏమిచేస్తారో చూడాల్పిందే.
This post was last modified on August 27, 2023 10:56 am
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…