గన్నవరం నియోజకవర్గంలో పంచాయితి జగన్మోహన్ రెడ్డికి కాస్త తలనొప్పిగానే తయారైంది. ఈమధ్యనే యార్లగడ్డ వెంకటరావు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. పెద్ద తలనొప్పి వదిలిపోయిందని అనుకుంటే దుట్టా రామచంద్రరావు రూపంలో మళ్ళీ మొదలైంది. 2014లో వైసీపీ నుండి పోటీచేసి ఓడిపోయింది దుట్టానే. 2019లో యార్లగడ్డ చివరి నిముషంలో వచ్చి టికెట్ తీసుకుని ఓడిపోయారు. రెండు ఎన్నికల్లో ఇద్దరిపైన గెలిచిన వల్లభనేని వంశీ మారిన రాజకీయ పరిణామాల్లో జగన్ కు దగ్గరయ్యారు.
అనేక సమీకరణలను పరిశీలించిన తర్వాత వంశీకే జగన్ టికెట్ ప్రకటించారు. దాన్ని నచ్చని యార్లగడ్డ దుట్టాతో కలిసి చాలా గొడవలే చేశారు. అయితే ఎంత గొడవచేసినా ఉపయోగం లేకపోవటంతో చేసేదిలేక చివరకు పార్టీనే వదిలేశారు. ఇపుడు దుట్టా పాత్ర ఏమిటనేది అర్ధంకావటంలేదు. వంశీ మీద దుట్టాకు కూడా బాగా కోపముంది. అందుకనే యార్లగడ్డ పార్టీని వదిలేయగానే జగన్ స్వయంగా దుట్టా కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడారు.
తర్వాత మీడియాతో మాట్లాడిన దుట్టా కూడా జగన్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించారు. పార్టీ మారేది లేదని చెప్పారు. అయితే తర్వాత ఏమైందో తెలీటంలేదు. అందుకనే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని దుట్టాతో మాట్లాడేందుకు పంపించారు. దుట్టాతో ఎంపీ చాలాసేపు ఏకంతంగా మాట్లాడారు. ఎంపీ రాయబారం ఫలించిందనే పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఎంపీతో భేటీ తర్వాత దుట్టా అయితే ఏమీ మాట్లాడలేదు.
ఇక్కడే దుట్టా వైఖరిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి మరోవైపు దుట్టా వైఖరి అనుమానంగా ఉంది. దాంతో గన్నవరంలో ఏమి జరుగుతోందో అర్ధంకావటంలేదు. నియోజకవర్గంలో దుట్టాకు కూడా పట్టుదనే చెప్పాలి. జగన్ మాటవిని వంశీకి మద్దతుగా దుట్టా పనిచేస్తే ఫలితం ఒకలాగుంటుంది. కాదని వ్యతిరేకం చేస్తే ఫలితం ఎలాగుంటుందనేది సస్పెన్సుగా మారింది. అందుకనే గన్నవరం రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. మరి దుట్టా ఏమిచేస్తారో చూడాల్పిందే.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…
వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…
అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…