Political News

బాబు లేఖ.. ఎన్డీయేలో చేరేనా?

ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకు అవసరమైతే పొత్తులకూ సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే టీడీపీకి పొత్తు అవసరమే. ఇప్పటికీ ఇదే విషయం చెబుతూ బీజేపీతో కలిసి జనసేన సాగుతోంది. మరోవైపు బీజేపీతో టీడీపీ పొత్తు విషయంలో చాలా రోజులుగా ఏ విషయం తేలడం లేదు. కానీ తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారని, దీనిపై బీజేపీ స్పందన బట్టి పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందనే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి బాబు తొమ్మిది పేజీల సుదీర్ఘ లేఖ రాశారని తెలిసింది. ఇందులో ఏపీ ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలతో పాటు తనపై జరిగిన ఉద్దేశపూర్వక దాడులు, హత్యాయత్నం కుట్రలు కూడా పేర్కొన్నారని సమాచారం. అందుకు సంబంధించి 70 పేజీలకు పైగా డాక్యుమెంట్లు, వీడియోలు ఆధారాలుగానూ సమర్పించారు.

ఈ లేఖపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్పందించి ఏమైనా చర్యలు తీసుకుంటే అప్పుడు బీజేపీతో జత కట్టేందుకు బాబు సిద్ధమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ఈ లేఖను కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో చూడాలి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే మాత్రం జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుతోనే బరిలో దిగితే ఏమైనా అవకాశం ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

This post was last modified on August 19, 2023 6:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

4 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

9 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago