ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకు అవసరమైతే పొత్తులకూ సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే టీడీపీకి పొత్తు అవసరమే. ఇప్పటికీ ఇదే విషయం చెబుతూ బీజేపీతో కలిసి జనసేన సాగుతోంది. మరోవైపు బీజేపీతో టీడీపీ పొత్తు విషయంలో చాలా రోజులుగా ఏ విషయం తేలడం లేదు. కానీ తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారని, దీనిపై బీజేపీ స్పందన బట్టి పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందనే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి బాబు తొమ్మిది పేజీల సుదీర్ఘ లేఖ రాశారని తెలిసింది. ఇందులో ఏపీ ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలతో పాటు తనపై జరిగిన ఉద్దేశపూర్వక దాడులు, హత్యాయత్నం కుట్రలు కూడా పేర్కొన్నారని సమాచారం. అందుకు సంబంధించి 70 పేజీలకు పైగా డాక్యుమెంట్లు, వీడియోలు ఆధారాలుగానూ సమర్పించారు.
ఈ లేఖపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్పందించి ఏమైనా చర్యలు తీసుకుంటే అప్పుడు బీజేపీతో జత కట్టేందుకు బాబు సిద్ధమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ఈ లేఖను కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో చూడాలి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే మాత్రం జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుతోనే బరిలో దిగితే ఏమైనా అవకాశం ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on August 19, 2023 6:23 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…