Political News

బాబు లేఖ.. ఎన్డీయేలో చేరేనా?

ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకు అవసరమైతే పొత్తులకూ సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే టీడీపీకి పొత్తు అవసరమే. ఇప్పటికీ ఇదే విషయం చెబుతూ బీజేపీతో కలిసి జనసేన సాగుతోంది. మరోవైపు బీజేపీతో టీడీపీ పొత్తు విషయంలో చాలా రోజులుగా ఏ విషయం తేలడం లేదు. కానీ తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారని, దీనిపై బీజేపీ స్పందన బట్టి పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందనే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి బాబు తొమ్మిది పేజీల సుదీర్ఘ లేఖ రాశారని తెలిసింది. ఇందులో ఏపీ ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలతో పాటు తనపై జరిగిన ఉద్దేశపూర్వక దాడులు, హత్యాయత్నం కుట్రలు కూడా పేర్కొన్నారని సమాచారం. అందుకు సంబంధించి 70 పేజీలకు పైగా డాక్యుమెంట్లు, వీడియోలు ఆధారాలుగానూ సమర్పించారు.

ఈ లేఖపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్పందించి ఏమైనా చర్యలు తీసుకుంటే అప్పుడు బీజేపీతో జత కట్టేందుకు బాబు సిద్ధమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ఈ లేఖను కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో చూడాలి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే మాత్రం జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుతోనే బరిలో దిగితే ఏమైనా అవకాశం ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

This post was last modified on August 19, 2023 6:23 am

Share
Show comments
Published by
satya

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

1 hour ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

2 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

2 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

2 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

3 hours ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

4 hours ago