Political News

హైద‌రాబాద్‌లో ఏ కులం.. భూముల ధ‌ర‌లు పెంచింది?

యువ‌గ‌ళం పాద‌యాత్ర చేస్తున్న టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. సీఎం జ‌గ‌న్‌పైనా.. వైసీపీ నాయ‌కుల పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో సాగుతున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్భంగా ఆదివారం సాయంత్రం .. ఇక్క‌డి రైతులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో నారా లోకేష్ భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న అమ‌రావ‌తి రాజ‌ధానిపై వైసీపీ నాయ‌కులు, సీఎం జ‌గ‌న్ చేసిన గ‌త వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేశారు. “రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఒక సామాజిక వ‌ర్గం మాత్ర‌మే పాగా వేయాల‌ని భావించింది. అందుకే ధ‌ర‌లు పెరిగిపోయాయి” అని సీఎం జ‌గ‌న్ అన్నార‌ని నారా లోకేష్ చెప్పారు.

అయితే.. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఉన్న ప‌లు ప్రాంతాల్లో ప్ర‌భుత్వం భూములు వేలం వేస్తోంద‌ని.. కోకా పేట‌లోల ఎక‌రం 100 కోట్లు ప‌లికింద‌ని.. మ‌రి దీని వెనుక ఏకులం ఉంద‌ని.. ఏ కులం ఆధారంగా 100 కోట్ల ధ‌ర ప‌లికింద‌ని నారా లోకేష్ ప్ర‌శ్నించారు. దీనికి స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న వైసీపీ నాయ‌కుల‌కు స‌వాల్ రువ్వారు. ఇక‌, రాష్ట్రానికి చంద్ర‌బాబు హ‌యాంలో వ‌చ్చిన ఫ్యాక్స్ కాన్ కంపెనీని వైసీపీ నాయ‌కులు త‌రిమేశార‌ని.. ఇప్పుడు అది క‌ర్ణాట‌క‌కు పోయింద‌ని.. దీనికి ఏ మతం తీసుకువెళ్లింద‌ని ప్ర‌శ్నించారు.

ఏపీలో క‌ష్ట‌ప‌డి గ‌త ప్ర‌భుత్వం.. సీఎం చంద్ర‌బాబు తీసుకువ‌చ్చిన పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయ‌న్నారు.  కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య జగన్‌ చిచ్చు పెడుతున్నారని లోకేష్ దుయ్య‌బ‌ట్టారు. తల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి.. మిగతవారికి న్యాయం చేస్తారా?  అని ప్ర‌శ్నించారు.  

This post was last modified on August 14, 2023 12:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

10 minutes ago

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

6 hours ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

6 hours ago

రాజీకి వస్తారా… రచ్చ చేస్తారా

ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…

10 hours ago

కేటీఆర్ కు మళ్ళీ ఉచ్చు బిగిసినట్టేనా…?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…

13 hours ago

రండి బాబూ రండి.. డబ్బులిచ్చి జైల్లో ఉండండి

జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…

14 hours ago