ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అదేసమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా.. ఏపీ విపక్ష నాయు డు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన లేఖ రాశారు. మొత్తం 9 పేజీల లేఖలో అనేక విష యాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా విపక్షాల సమావేశాలు, రోడ్ షోలకు అనుమతించకపోవడం.. అనుమతి ఇచ్చినా.. వైసీపీ కార్యకర్తలను ప్రోత్సహించి.. దాడులు చేయించడం వంటివిషయాలను ఆయన పేర్కొన్నారు.
ఇటీవల పుంగనూరులో జరిగిన దారుణాన్ని చంద్రబాబు పూస గుచ్చినట్టు వివరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. పుంగనూరులో తనను కేంద్రంగా చేసుకుని వైసీపీ నాయకులు కార్యకర్తలను రంగంలోకి దింపారని.. రాష్ట్రంలో ఇప్పుడు తాను లేకపోతే.. ప్రజల సమస్యలపై పోరాటం చేసేవారు ఉండరనే ఉద్దేశంతోనే వైసీపీ ఇలా దాడులను ప్రేరేపిస్తోందని చంద్రబాబు వివరించారు. మొత్తం 40 మంది వరకు టీడీపీ కార్యకర్తలు.. పోలీసులు జరిపిన లాఠీ చార్జీలోనూ.. వైసీపీ మూకలు జరిపిన రాళ్ల దాడిలోనూ గాయపడ్డారని వివరించారు.
అదేసమయంలో వాహనాలకు కూడా నిప్పు పెట్టారని అన్నారు. విశాఖలోనూ ప్రతిపక్షాలు పర్యటించేందు కు అనేక ఆంక్షలు పెడుతున్నారని.. ఐటీ రాజధానిగా విలసిల్లుతున్న నగరంలో ఎవరైనా తిరిగే స్వేచ్ఛ ఉంద ని.. కానీ, నిరంకుశ పాలనతో ప్రాథమిక హక్కులను కూడా వైసీపీ ప్రభుత్వం మొగ్గలోనే తుంచేస్తోం దని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తులను అధికార పార్టీ నాయకులు దోచేసుకుంటు న్నారని.. వీటిని ప్రశ్నిస్తున్న తమపైనే దాడులు చేసి అంతం చేయాలని చూస్తున్నారని నిప్పులు చెరిగా రు.
రాష్ట్రంలో విధ్వంసకర పాలననుకట్టడి చేసేందుకు.. రాష్ట్రపతి తన విశేష అధికారాలను వినియోగించుకో వాలని.. కుదిరితే రాష్ట్రపతి పాలన విధించేలా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అదేవిధంగా ప్రధాన మంత్రి కూడా ఏపీలో జరుగుతున్న విషయాలపై స్పందించాలని.. చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై జరిగిన దాడులు.. పలమనేరు ఘటనలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు జరిపిన లాఠీ చార్జీ తాలూకు ఫొటోలను చంద్రబాబు ఈ లేఖకు జతపరిచినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.
This post was last modified on August 14, 2023 12:32 am
ఒక హిట్ మూవీకి కొనసాగింపు ఉండాలనుకోవడం మంచిదే. కథ డిమాండ్ చేసినప్పుడు, దానికి అనుగుణంగా దర్శకులు తమ క్రియేటివిటీని జోడించి,…
రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడింది. బీజేపీ కంచుకోటల్లో…
2027 సంక్రాంతికి విశ్వంభర విడుదల దాదాపు ఖాయమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ చిరంజీవి అంగీకారం…
తమిళంలో రెండు దశాబ్దాల ముందే సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరో విక్రమ్. సేతు, దిల్, ధూల్, జెమిని, పితామగన్,…
మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…
ఏదైనా పెళ్లో.. మరో ఫంక్షనో.. భార్యా భర్తలు ఇరువురు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. సహజంగా దంపతుల్లో ఉత్సాహం ఉంటుంది. భర్త ముందుగానే…