ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అదేసమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా.. ఏపీ విపక్ష నాయు డు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన లేఖ రాశారు. మొత్తం 9 పేజీల లేఖలో అనేక విష యాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా విపక్షాల సమావేశాలు, రోడ్ షోలకు అనుమతించకపోవడం.. అనుమతి ఇచ్చినా.. వైసీపీ కార్యకర్తలను ప్రోత్సహించి.. దాడులు చేయించడం వంటివిషయాలను ఆయన పేర్కొన్నారు.
ఇటీవల పుంగనూరులో జరిగిన దారుణాన్ని చంద్రబాబు పూస గుచ్చినట్టు వివరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. పుంగనూరులో తనను కేంద్రంగా చేసుకుని వైసీపీ నాయకులు కార్యకర్తలను రంగంలోకి దింపారని.. రాష్ట్రంలో ఇప్పుడు తాను లేకపోతే.. ప్రజల సమస్యలపై పోరాటం చేసేవారు ఉండరనే ఉద్దేశంతోనే వైసీపీ ఇలా దాడులను ప్రేరేపిస్తోందని చంద్రబాబు వివరించారు. మొత్తం 40 మంది వరకు టీడీపీ కార్యకర్తలు.. పోలీసులు జరిపిన లాఠీ చార్జీలోనూ.. వైసీపీ మూకలు జరిపిన రాళ్ల దాడిలోనూ గాయపడ్డారని వివరించారు.
అదేసమయంలో వాహనాలకు కూడా నిప్పు పెట్టారని అన్నారు. విశాఖలోనూ ప్రతిపక్షాలు పర్యటించేందు కు అనేక ఆంక్షలు పెడుతున్నారని.. ఐటీ రాజధానిగా విలసిల్లుతున్న నగరంలో ఎవరైనా తిరిగే స్వేచ్ఛ ఉంద ని.. కానీ, నిరంకుశ పాలనతో ప్రాథమిక హక్కులను కూడా వైసీపీ ప్రభుత్వం మొగ్గలోనే తుంచేస్తోం దని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తులను అధికార పార్టీ నాయకులు దోచేసుకుంటు న్నారని.. వీటిని ప్రశ్నిస్తున్న తమపైనే దాడులు చేసి అంతం చేయాలని చూస్తున్నారని నిప్పులు చెరిగా రు.
రాష్ట్రంలో విధ్వంసకర పాలననుకట్టడి చేసేందుకు.. రాష్ట్రపతి తన విశేష అధికారాలను వినియోగించుకో వాలని.. కుదిరితే రాష్ట్రపతి పాలన విధించేలా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అదేవిధంగా ప్రధాన మంత్రి కూడా ఏపీలో జరుగుతున్న విషయాలపై స్పందించాలని.. చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై జరిగిన దాడులు.. పలమనేరు ఘటనలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు జరిపిన లాఠీ చార్జీ తాలూకు ఫొటోలను చంద్రబాబు ఈ లేఖకు జతపరిచినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.
This post was last modified on August 14, 2023 12:32 am
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…