ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అదేసమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా.. ఏపీ విపక్ష నాయు డు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన లేఖ రాశారు. మొత్తం 9 పేజీల లేఖలో అనేక విష యాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా విపక్షాల సమావేశాలు, రోడ్ షోలకు అనుమతించకపోవడం.. అనుమతి ఇచ్చినా.. వైసీపీ కార్యకర్తలను ప్రోత్సహించి.. దాడులు చేయించడం వంటివిషయాలను ఆయన పేర్కొన్నారు.
ఇటీవల పుంగనూరులో జరిగిన దారుణాన్ని చంద్రబాబు పూస గుచ్చినట్టు వివరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. పుంగనూరులో తనను కేంద్రంగా చేసుకుని వైసీపీ నాయకులు కార్యకర్తలను రంగంలోకి దింపారని.. రాష్ట్రంలో ఇప్పుడు తాను లేకపోతే.. ప్రజల సమస్యలపై పోరాటం చేసేవారు ఉండరనే ఉద్దేశంతోనే వైసీపీ ఇలా దాడులను ప్రేరేపిస్తోందని చంద్రబాబు వివరించారు. మొత్తం 40 మంది వరకు టీడీపీ కార్యకర్తలు.. పోలీసులు జరిపిన లాఠీ చార్జీలోనూ.. వైసీపీ మూకలు జరిపిన రాళ్ల దాడిలోనూ గాయపడ్డారని వివరించారు.
అదేసమయంలో వాహనాలకు కూడా నిప్పు పెట్టారని అన్నారు. విశాఖలోనూ ప్రతిపక్షాలు పర్యటించేందు కు అనేక ఆంక్షలు పెడుతున్నారని.. ఐటీ రాజధానిగా విలసిల్లుతున్న నగరంలో ఎవరైనా తిరిగే స్వేచ్ఛ ఉంద ని.. కానీ, నిరంకుశ పాలనతో ప్రాథమిక హక్కులను కూడా వైసీపీ ప్రభుత్వం మొగ్గలోనే తుంచేస్తోం దని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తులను అధికార పార్టీ నాయకులు దోచేసుకుంటు న్నారని.. వీటిని ప్రశ్నిస్తున్న తమపైనే దాడులు చేసి అంతం చేయాలని చూస్తున్నారని నిప్పులు చెరిగా రు.
రాష్ట్రంలో విధ్వంసకర పాలననుకట్టడి చేసేందుకు.. రాష్ట్రపతి తన విశేష అధికారాలను వినియోగించుకో వాలని.. కుదిరితే రాష్ట్రపతి పాలన విధించేలా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అదేవిధంగా ప్రధాన మంత్రి కూడా ఏపీలో జరుగుతున్న విషయాలపై స్పందించాలని.. చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై జరిగిన దాడులు.. పలమనేరు ఘటనలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు జరిపిన లాఠీ చార్జీ తాలూకు ఫొటోలను చంద్రబాబు ఈ లేఖకు జతపరిచినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.
This post was last modified on August 14, 2023 12:32 am
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…