Political News

మోడీకి చంద్ర‌బాబు 9 పేజీల లేఖ‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి అదేస‌మ‌యంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు కూడా.. ఏపీ విప‌క్ష నాయు డు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న లేఖ రాశారు. మొత్తం 9 పేజీల లేఖ‌లో అనేక విష యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా విప‌క్షాల స‌మావేశాలు, రోడ్ షోల‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డం.. అనుమ‌తి ఇచ్చినా.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్రోత్స‌హించి.. దాడులు చేయించ‌డం వంటివిష‌యాల‌ను ఆయ‌న పేర్కొన్నారు.

ఇటీవ‌ల పుంగ‌నూరులో జ‌రిగిన దారుణాన్ని చంద్ర‌బాబు పూస గుచ్చిన‌ట్టు వివ‌రించార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. పుంగ‌నూరులో త‌న‌ను కేంద్రంగా చేసుకుని వైసీపీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌ల‌ను రంగంలోకి దింపారని.. రాష్ట్రంలో ఇప్పుడు తాను లేక‌పోతే.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లపై పోరాటం చేసేవారు ఉండ‌ర‌నే ఉద్దేశంతోనే వైసీపీ ఇలా దాడుల‌ను ప్రేరేపిస్తోంద‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. మొత్తం 40 మంది వ‌ర‌కు టీడీపీ కార్య‌క‌ర్త‌లు.. పోలీసులు జ‌రిపిన లాఠీ చార్జీలోనూ.. వైసీపీ మూక‌లు జ‌రిపిన రాళ్ల దాడిలోనూ గాయ‌ప‌డ్డార‌ని వివ‌రించారు.

అదేస‌మ‌యంలో వాహ‌నాల‌కు కూడా నిప్పు పెట్టార‌ని అన్నారు. విశాఖ‌లోనూ ప్ర‌తిప‌క్షాలు ప‌ర్య‌టించేందు కు అనేక ఆంక్ష‌లు పెడుతున్నార‌ని.. ఐటీ రాజ‌ధానిగా విల‌సిల్లుతున్న న‌గ‌రంలో ఎవ‌రైనా తిరిగే స్వేచ్ఛ ఉంద ని.. కానీ, నిరంకుశ పాల‌న‌తో ప్రాథ‌మిక హ‌క్కుల‌ను కూడా వైసీపీ ప్ర‌భుత్వం మొగ్గ‌లోనే తుంచేస్తోం ద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్ర‌జ‌ల ఆస్తుల‌ను అధికార పార్టీ నాయ‌కులు దోచేసుకుంటు న్నారని.. వీటిని ప్ర‌శ్నిస్తున్న త‌మ‌పైనే దాడులు చేసి అంతం చేయాల‌ని చూస్తున్నార‌ని నిప్పులు చెరిగా రు.

రాష్ట్రంలో విధ్వంసక‌ర పాల‌న‌నుక‌ట్ట‌డి చేసేందుకు.. రాష్ట్ర‌ప‌తి త‌న విశేష అధికారాల‌ను వినియోగించుకో వాల‌ని.. కుదిరితే రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించేలా నిర్ణ‌యం తీసుకోవాల‌ని చంద్ర‌బాబు సూచించారు. అదేవిధంగా ప్ర‌ధాన మంత్రి కూడా ఏపీలో జ‌రుగుతున్న విష‌యాల‌పై స్పందించాల‌ని.. చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరారు. త‌న‌పై జ‌రిగిన దాడులు.. ప‌ల‌మ‌నేరు ఘ‌ట‌న‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసులు జ‌రిపిన లాఠీ చార్జీ తాలూకు ఫొటోల‌ను చంద్ర‌బాబు ఈ లేఖ‌కు జ‌త‌ప‌రిచిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి.

This post was last modified on August 14, 2023 12:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

5 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

6 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

6 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

8 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

8 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

10 hours ago