Political News

మోడీకి చంద్ర‌బాబు 9 పేజీల లేఖ‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి అదేస‌మ‌యంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు కూడా.. ఏపీ విప‌క్ష నాయు డు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న లేఖ రాశారు. మొత్తం 9 పేజీల లేఖ‌లో అనేక విష యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా విప‌క్షాల స‌మావేశాలు, రోడ్ షోల‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డం.. అనుమ‌తి ఇచ్చినా.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్రోత్స‌హించి.. దాడులు చేయించ‌డం వంటివిష‌యాల‌ను ఆయ‌న పేర్కొన్నారు.

ఇటీవ‌ల పుంగ‌నూరులో జ‌రిగిన దారుణాన్ని చంద్ర‌బాబు పూస గుచ్చిన‌ట్టు వివ‌రించార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. పుంగ‌నూరులో త‌న‌ను కేంద్రంగా చేసుకుని వైసీపీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌ల‌ను రంగంలోకి దింపారని.. రాష్ట్రంలో ఇప్పుడు తాను లేక‌పోతే.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లపై పోరాటం చేసేవారు ఉండ‌ర‌నే ఉద్దేశంతోనే వైసీపీ ఇలా దాడుల‌ను ప్రేరేపిస్తోంద‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. మొత్తం 40 మంది వ‌ర‌కు టీడీపీ కార్య‌క‌ర్త‌లు.. పోలీసులు జ‌రిపిన లాఠీ చార్జీలోనూ.. వైసీపీ మూక‌లు జ‌రిపిన రాళ్ల దాడిలోనూ గాయ‌ప‌డ్డార‌ని వివ‌రించారు.

అదేస‌మ‌యంలో వాహ‌నాల‌కు కూడా నిప్పు పెట్టార‌ని అన్నారు. విశాఖ‌లోనూ ప్ర‌తిప‌క్షాలు ప‌ర్య‌టించేందు కు అనేక ఆంక్ష‌లు పెడుతున్నార‌ని.. ఐటీ రాజ‌ధానిగా విల‌సిల్లుతున్న న‌గ‌రంలో ఎవ‌రైనా తిరిగే స్వేచ్ఛ ఉంద ని.. కానీ, నిరంకుశ పాల‌న‌తో ప్రాథ‌మిక హ‌క్కుల‌ను కూడా వైసీపీ ప్ర‌భుత్వం మొగ్గ‌లోనే తుంచేస్తోం ద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్ర‌జ‌ల ఆస్తుల‌ను అధికార పార్టీ నాయ‌కులు దోచేసుకుంటు న్నారని.. వీటిని ప్ర‌శ్నిస్తున్న త‌మ‌పైనే దాడులు చేసి అంతం చేయాల‌ని చూస్తున్నార‌ని నిప్పులు చెరిగా రు.

రాష్ట్రంలో విధ్వంసక‌ర పాల‌న‌నుక‌ట్ట‌డి చేసేందుకు.. రాష్ట్ర‌ప‌తి త‌న విశేష అధికారాల‌ను వినియోగించుకో వాల‌ని.. కుదిరితే రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించేలా నిర్ణ‌యం తీసుకోవాల‌ని చంద్ర‌బాబు సూచించారు. అదేవిధంగా ప్ర‌ధాన మంత్రి కూడా ఏపీలో జ‌రుగుతున్న విష‌యాల‌పై స్పందించాల‌ని.. చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరారు. త‌న‌పై జ‌రిగిన దాడులు.. ప‌ల‌మ‌నేరు ఘ‌ట‌న‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసులు జ‌రిపిన లాఠీ చార్జీ తాలూకు ఫొటోల‌ను చంద్ర‌బాబు ఈ లేఖ‌కు జ‌త‌ప‌రిచిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి.

This post was last modified on August 14, 2023 12:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

4 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

9 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago