భూమా బ్రహ్మానందరెడ్డి-భూమా జగత్విఖ్యాతరెడ్డి-భూమా మౌనికారెడ్డి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో విఖ్యాత్రెడ్డి-మౌనిక అక్కాతమ్ముళ్లు. బ్రహ్మానందరెడ్డి.. ఈ కుటుంబం మలిచిన రాజకీయ నాయకుడు. 2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో హఠాత్తుగా రాజకీయ తెరమీదకు వచ్చిన నాయకుడు బ్రహ్మానందరెడ్డి. అయితే.. ఆయనేమీ.. టెంపరరీ కోసం రాలేదని.. స్వయంగా చెప్పారు. 2019లో టికెట్ వివాదం ఏర్పడినప్పుడు.. స్వతంత్రంగా పోటీ చేస్తానని కూడా హెచ్చరికలు జారీ చేశారు.
పాలవ్యాపారి కావడంతోపాటు.. ఆర్థికంగా బలంగా ఉన్న బ్రహ్మానందరెడ్డి.. ఇప్పుడు మరోసారి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక, విఖ్యాత్రెడ్డి విషయానికి వస్తే.. తానే నిజమైన వారసుడినని.. భూమా నాగిరెడ్డి పేరు నిలబెట్టేందుకు తానే నడుంకడతానని.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు చారిత్రక అవసర మని అంటున్నారు. అప్పట్లో అంటే 2017లో అవసరం కొద్దీ బ్రహ్మానందరెడ్డిని తీసుకున్నామని కూడా ఆయన చెబుతున్నారు.
ఇక, వీరిద్దరూ నంద్యాల టికెట్ కోసం ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు భూమా మౌనిక కూడా చంద్రబాబును కలుసుకోవడం.. వచ్చే ఎన్నికల్లో పోటీ అంటూ.. ఆయనతో చర్చించడంవరకు రాజకీయం సాగిందని అంటున్నారు. దీంతో ఆమె కూడా నంద్యాల టికెట్ కోసం ఎదురు చూసే అవకాశం లేకపోలేదు. అంటే.. మొత్తంగా ఒక్క సీటు కోసం.. భూమా కుటుంబం రాజకీయంగా ఒకరితో ఒకరు తలపడే అవకాశం ఉంది.
పోనీ.. తమ్ముడు కోసమని మౌనిక తప్పుకొన్నా.. భూమా బ్రహ్మానందరెడ్డి మాత్రం తప్పుకొనే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో చంద్రబాబు పిలిచి చెప్పినా.. వెనక్కి తగ్గకుండా.. ఒంటరి పోరుకు రెడీ అయ్యారు. ఇప్పుడు కూడా అదే పంథాలో సాగాలనిదాదాపు నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇదే జరిగితే ఆయన గెలుపు ఓటములు విషయాన్ని పక్కన పెట్టి.. ఓట్లు చీలిపోవడంలో ప్రధాన పాత్రధారి అవుతాడు. దీంతో ఇది పరోక్షంగా భూమా కుటుంబానికి ఇబ్బందేనేని అంటున్నారు. ఈ క్రమంలో ఈ సమస్యను ఇప్పుడే పరిష్కరించుకోవడం మంచిదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 7, 2023 11:05 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…