ఇండియా.. విపక్షాలన్నీ ఏకమై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును గద్దెదింపేందుకు ఏర్పాటు చేసుకున్న పెద్ద కూటమి. మొత్తంగా 26 ప్రతిపక్ష పార్టీలు చేతులు కలిపి.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో పోరాడాలని అవసరమైతే.. ఉమ్మడి ప్రణాళికను ఏర్పాటు చేసుకుని.. ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి విపక్షాల అభ్యర్థులను ఒక్కొక్కరినే పోటీకి పెడదామని కూడా నిర్ణయించుకున్నారు. ఇక, ఇప్పటికే రెండు చోట్ల సభలు కూడా నిర్వహించారు. ప్లాన్ రెడీ అవుతోంది.
ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా ఉరుములు లేని పిడుగుల మాదిరిగా ఇండియా కూటమిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల కిందట.. బిహార్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేంద్ర మంత్రి అథావలే.. సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ ఎన్డీయే పక్షమేనని.. ఇండియాతో చేతులు కలపడం ఉత్తమాటేనని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలను నితీష్ ఖండించలేదు. అంటే.. ఆయన మనసు ఎన్డీయే పైనే ఉందనే సంకేతాలు వచ్చేశాయి.
మరోవైపు.. ఇండియా పేరు కూడా తనకు నచ్చలేదని.. నితీష్ గతంలోనే వ్యాఖ్యానించారు. దీనిపై ఇంకా చర్చించాల్సి ఉందని అప్పట్లో అనుకున్నా.. తాజాగా మారుతున్న పరిణామాలతో నితీష్.. ఇండియాకు దూరమవుతున్నారని తెలుస్తోంది. ఇక, తాజాగా మరో సంచలన మార్పు చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే కార్యక్రమంలో ఆయన కూడా.. పీఎం పక్కన కూర్చోనున్నారు.
నిజానికి ఇండియా కూటమిలో నిన్నటి వరకు కూడా కీలకంగా ఉన్న మాజీ సీఎం శరద్ పవార్.. అనూహ్యం గా మోడీ పక్కన కూర్చునేందుకు అంగీకరించడం.. మోడీని సన్మానించే కార్యక్రమానికి హాజరు కానుండడం వంటి పరిణామాలను గమనిస్తే.. ఇండియా నుంచి ఆయన కూడా కడుదూరంలో ఉన్నారనే చర్చ తెరమీదికి వచ్చింది. ఇటీవల ఎన్సీపీలో ముసలం పుట్టి.. శరద్ తమ్ముడి కుమారుడు.. అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా శరద్ మోడీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో.. ఇలాంటిపరిణామాలు ఇంకెన్ని జరుగుతాయో.. ఇండియా ఉంటుందో .. విచ్ఛిన్నం అవుతుందో.. అనే చర్చ జాతీయ రాజకీయాల్లో ఊపందుకుంది.
This post was last modified on August 1, 2023 10:05 am
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…