టార్గెట్ రాయలసీమ.. నినాదంతో టీడీపీ అధినేత చంద్రబాబు బలమైన వ్యూహాన్ని రెడీ చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి అధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా.. పార్టీ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికి ఉత్తరాంధ్ర, కోస్తాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు.. ఇక, ఎన్నికలకు ముందు కీలకమైన సీమపైతన వ్యూహాలను రెడీ చేసుకున్నారని అంటున్నారు.
ఆగస్టు 1 నుంచి నాలుగు రోజుల పాటు చంద్రబాబు సీమలో పర్యటించనున్నారు. ఇక్కడ కీలకమైన సమస్యగా ఉన్న సాగునీటి అంశాన్ని ప్రధానంగా లేవనెత్తాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం రెడీ చేసుకున్నారు. రైతులతోనూ మమేకం అవుతున్నారు. ఉమ్మడి అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రధానంగా సాగనున్న చంద్రబాబు పర్యటనలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొనేలా చూస్తున్నారు.
వైసీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అస్త్రాలుగా చేసుకుని చంద్రబాబు ఇక్కడ రైతుల ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకొనే ప్రయత్నంలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు సీమ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. అదేసమయంలో కడప వంటి ప్రాంతా లను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పింది. అయితే.. ఈ హామీలు అలానే ఉండిపోయాయి. ఇప్పుడు వాటినే టార్గెట్ చేసుకుని చంద్రబాబు పొలిటికల్ యాత్రకు రెడీ అవుతున్నారు.
నిజానికి పులివెందులకు అందుతున్న నీరు.. గతంలో చంద్రబాబు నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టుతోనే సాధ్యమైందని అంటారు. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా పదే పదే చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించనున్నారు. అదేసమయంలో పార్టీలో అంతర్గత విభేదాలను కూడా తగ్గించేందుకు.. చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నారు. మొత్తంగా.. సీమ పర్యటనపై చాలానే ఆశలు పెట్టుకున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
This post was last modified on July 31, 2023 2:17 pm
ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రి తమ…
టాలీవుడ్లో హీరోలు దర్శకులవడం కొత్త కాదు కానీ.. ఈ జాబితా మరీ పెద్దదేమీ కాదు. తాజాగా యువ కథానాయకుడు రామ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన పెద్ది మీద అంచనాలు ఏ…
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని.. ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిని సుమారు 5 వేల ఎకరాల్లో…
ప్రస్తుతం పొదుపు మంత్రం పఠిస్తున్న కేంద్ర ప్రభుత్వం చమురు సహా బంగారం వంటివాటిపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ పరిధిలో…
ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. మొత్తం నాలుగు స్థానాల్లో…