వంగవీటి రంగా.. విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన దివంగత నాయకుడు. బెజవాడ రాజకీయాల్లో ఆయన ఆధిపత్యం గొప్పగా సాగింది. ఈ సారి ఏపీ ఎన్నికల్లో ఆయన పేరు నిలబెట్టాలనే లక్ష్యంతో.. వంగవీటి రంగా కుమార్తె ఆశాలత రాజకీయం రంగప్రవేశం చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తండ్రి వారసత్వాన్నిపుణికిపుచ్చుకుని రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ఆమె రానున్నారని, విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయనున్నారని స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికల్లో రంగా కుటుంబానికి రాజకీయంగా మంచి పట్టున్న విజయవాడ సెంట్రల్ నుంచి ఆశాలతను పోటీ చేయించే అవకాశాలున్నాయి. ఇందుకు ఆమె మేనమామ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వంగవీటి రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారి ఎమ్మెల్యే అయ్యారు. రంగా కుమారుడు రాధా కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ వీళ్లు పెద్దగా హవా కొనసాగించలేకపోతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం రాధా రాజకీయాల్లో కొనసాగుతున్నా బయట ఎక్కువగా కనిపించడం లేదు.
రంగా వారసత్వాన్ని ఉపయోగించుకుని విజయవాడతో పాటు గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం ఆశాలతను చేర్చుకోవడానికి వివిధ పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రంగా అభిమానుల బలమే ఆశాలతను గెలిపిస్తుందని అంటున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రంగా వారసురాలిగా ఆశాలత రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఖాయమేననిపిస్తోంది. మరి ఆమె ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…