వంగవీటి రంగా.. విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన దివంగత నాయకుడు. బెజవాడ రాజకీయాల్లో ఆయన ఆధిపత్యం గొప్పగా సాగింది. ఈ సారి ఏపీ ఎన్నికల్లో ఆయన పేరు నిలబెట్టాలనే లక్ష్యంతో.. వంగవీటి రంగా కుమార్తె ఆశాలత రాజకీయం రంగప్రవేశం చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తండ్రి వారసత్వాన్నిపుణికిపుచ్చుకుని రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ఆమె రానున్నారని, విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయనున్నారని స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికల్లో రంగా కుటుంబానికి రాజకీయంగా మంచి పట్టున్న విజయవాడ సెంట్రల్ నుంచి ఆశాలతను పోటీ చేయించే అవకాశాలున్నాయి. ఇందుకు ఆమె మేనమామ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వంగవీటి రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారి ఎమ్మెల్యే అయ్యారు. రంగా కుమారుడు రాధా కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ వీళ్లు పెద్దగా హవా కొనసాగించలేకపోతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం రాధా రాజకీయాల్లో కొనసాగుతున్నా బయట ఎక్కువగా కనిపించడం లేదు.
రంగా వారసత్వాన్ని ఉపయోగించుకుని విజయవాడతో పాటు గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం ఆశాలతను చేర్చుకోవడానికి వివిధ పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రంగా అభిమానుల బలమే ఆశాలతను గెలిపిస్తుందని అంటున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రంగా వారసురాలిగా ఆశాలత రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఖాయమేననిపిస్తోంది. మరి ఆమె ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…