Political News

విభజన హామీలపై ఏపీ, తెలంగాణలే తేల్చుకోవాలట

ఏపీకి ప్రత్యేక హోదా అందని ద్రాక్షగా మిగిలిన సంగతి తెలిసిందే. ఇక, ఇరు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉన్నాయి. రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడిచినా విభజనానంతరం తీవ్రంగా నష్టపోయిన ఏపీ కోలుకోలేకపోయింది. ఈ నేపద్యంలోనే హోదాతో పాటు విభజన హామీల అమలు ప్రస్తావన పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రతిసారీ టీడీపీ ఎంపీలు లేవనెత్తుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళవారం నాడు లోక్ సభలో ఈ విషయంపై కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ కీలక ప్రకటన చేశారు. ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు మరికొందరు ఎంపీలు ఈ వ్యవహారంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

విభజన చట్టం, హామీల అమలుపై నిత్యానంద రాయ్ కీలక ప్రకటన చేశారు. చాలా హామీలు ఇప్పటికే అమలు చేశామని, మరికొన్ని హామీలు వివిధ దశల్లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థల విషయంలో కేంద్ర నిర్ణీత కాలపరిమితి విధించిందని చెప్పారు. ప్రత్యేక రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్, తదితర అంశాలకు 2022లోనే రూ.106.89 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరానికి మరో పది కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. ఇక, దుగ్గరాజుపట్నం పోర్టుకు బదులు రామాయపట్నం పోర్టు నిర్మిస్తామని చెప్పారు. ఆ పోర్టును మైనర్ పోర్టుగా నోటిఫై చేయాలని ఏపీ ప్రభుత్వం అడిగిందని వెల్లడించారు.

కడపలో స్టీల్ ప్లాంటు సాధ్యం కాదని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసి చెప్పిందని ప్రకటించారు. ఎయిమ్స్, ఐఐటీ గిరిజన యూనివర్సిటీ, పోలవరం, రాజధాని నిర్మాణానికి 21 వేల కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం మధ్యవర్తిగా ఉంటుందన్నారు. కేంద్ర, ఏపీ, తెలంగాణ అధికారులతో విభజన హామీలు, చట్టం, సమస్యల గురించి 31 సమావేశాలు నిర్వహించామన్నారు. ఆ సమస్యలను ఇరు తెలుగు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పథకం కింద ఏపీకి పత్యేక సాయం అందిస్తున్నామని చెప్పారు.

This post was last modified on July 25, 2023 5:14 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

3 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

3 hours ago

ఏపీ హింస‌.. నిప్పులు చెరిగిన ఈసీ..

రాష్ట్రంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత చెల‌రేగిన తీవ్ర హింస‌ పై కేంద్ర ఎన్నికల సంఘం…

9 hours ago

దెయ్యాన్ని ప్రేమించే ‘లవ్ మీ’ కుర్రాడు

https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…

16 hours ago

రవితేజ సమస్యే నానికి వచ్చిందా

కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…

18 hours ago

విశ్వంభరలో స్టాలిన్ అక్కయ్య

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…

19 hours ago