దేశరాజకీయాల్లోని రాజకీయ పార్టీల్లో దాదాపు స్పష్టమైన విభజన వచ్చేసింది. ఒకటి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే. రెండోది కొత్తగా ఏర్పడిన ఇండియా కూటమి. మూడోది కూటమిగా కాకుండా దేనికదే విడివిడిగానే ఉంటున్న పార్టీలు. అంటే పై రెండు కూటములకు సంబంధంలేకుండా ఉంటున్న పార్టీల సంఖ్య 11. ఈ 11 పార్టీల్లో 91 మంది ఎంపీలున్నారు. ఎన్డీయేలో 38 పార్టీలున్నాయి. ఇండియా కూటమిలో 26 పార్టీలుండగా రెండు కూటములతో సంబంధంలేని పార్టీలు 11.
ఈ 11 పార్టీల ఖాతాలో 91 మంది ఎంపీలున్నారంటే మామూలు విషయంకాదు. వీటిల్లో వైసీపీ, బీజూ జనతాదళ్, బీఎస్పీ, టీడీపీ, ఎంఐఎం, శిరోమణి అకాలీదళ్, జనతా దళ్ (ఎస్), ఆర్ ఎల్పీ, శిరోమణి అకాలీదళ్ (మాన్), ఏఐయూడీఎఫ్ ఉన్నాయి. వీటిల్లో కూడా అవసరానికి తగ్గట్లుగా వైసీపీ, బీజూ జనతాదళ్, టీడీపీలు కేంద్రప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాయి. ఒడిస్సా అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకరించటంలేదని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మండిపోయారు. తాజాగా మొదలైన పార్లమెంటు సమావేశాల్లో కేంద్రప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని నవీన్ ఆదేశించారు.
నిజానికి ఎన్డీయే ఖాతాలో 38 పార్టీలున్నాయని పేరేకానీ చాలా పార్టీలకు అంటే సుమారు 21 పార్టీలకు ఒక్క ఎంపీ కూడా లేరు. అయినా బీజేపీ ఎందుకు భాగస్వామ్యపార్టీలుగా చేసుకున్నది ? ఎందుకంటే వాటికి ఎంపీలు లేకపోయినా కనీసం 4-5 శాతం ఓట్లున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపోటముల్లో ఈ ఓట్లశాతం చాలా కీలకంగా మారబోతోంది.
సీట్లు లేకపోయినా ఓట్లశాతం ఉందికాబట్టే తమకు కలిసొస్తాయని ఎన్డీయే, ఇండియా కూటమి కొన్నిపార్టీలను తమతో కలుపుకున్నాయి. ఎన్డీయేతో పోల్చుకుంటే ఇండియా కూటమిలోనే పెద్ద పార్టీలున్నాయి. కాంగ్రెస్ తో కలుపుకుని తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, శివసేన(ఉధ్థవ్), ఎన్సీపీ(శరద్) జేడీయూ, ఆప్ లాంటి ఎక్కువ మంది ఎంపీలున్న పార్టీలున్నాయి. వీటి బలాబలాలు రేపటి ఎన్నికల్లో తేలిపోతాయి. ఉత్తరాధిలో బీజేపీ బలం తగ్గిపోతోందనే టెన్షన్ పెరగటం వల్లే దక్షిణాదిలో మిత్రులను చేసుకోవాలని కొత్తపార్టీలకు ఆహ్వానం అందించింది బీజేపీ. మరి రాబోయే ఎన్నికల్లో ఏ కూటముల బలం పెరుగుతుందో తగ్గుతుందో చూడాలి.
This post was last modified on July 21, 2023 10:38 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…