ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో వైసీపీ సీనియర్ నాయకుల మధ్య చోటు చేసుకున్న రాజకీయ తుఫాన్పై వైసీపీ అధిష్టానం తక్షణం స్పందించిందనే చెప్పాలి. రామచంద్రపురం టికెట్ను తన కుమారుడికి ఇవ్వాలని పట్టుబడుతున్న రాజ్యసభ సభ్యుడు , మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గత రెండు రోజులుగా తీవ్ర హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. రామచంద్రపురంలో ఆదివారం ఆయన.. మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుకు వ్యతిరేకంగా ఉన్నవారితో భేటీ అయ్యారు.
పెద్ద ఎత్తున సభ పెట్టి చెల్లుబోయిన వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహించారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తన కుమారుడికే టికెట్ దక్కుతుందని కూడా చెప్పారు. దీంతో ముసలం మరింత పెద్దదైంది. ఈ పరిణామాలను పరిశీలించిన వైసీపీ అధిష్టానం.. వెంటనే పిల్లికి పిలుపునిచ్చింది. తాజాగా మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ నాయకుడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిల్లి సుభాష్తో భేటీ అయ్యారు. మీరు సీనియర్.. మీరే ఇలా చేస్తే.. పార్టీని రోడ్డున పడేస్తే.. ఎలా అంటూ క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది.
టికెట్ల విషయాన్ని పార్టీ అధినేత జగన్ పరిశీలిస్తున్నారని.. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది.. అందరూ కలిసి మెలిసి ఉండాలని చెప్పినట్టు తెలిసింది. అయితే.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని రాజకీయంగా బరిలో నిలపాలని నిర్ణయించినట్టు సుభాష్ చంద్రబోస్ కుండబద్దలు కొట్టారు. తమకు రాజకీయంగా పలుకుబడి ఉందని.. ప్రజా జీవితంలో 40 ఏళ్లుగా ఉంటున్నామని.. ఇప్పుడు సీటును ఎలా వదులుకుంటామని తేల్చి చెప్పినట్టు తాడేపల్లి వర్గాలు అంటున్నారు. మొత్తానికి సజ్జల జోక్యం చేసుకున్నా.. పరిణామాలు మాత్రం చల్లబడినట్టు కనిపించడం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…