ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో వైసీపీ సీనియర్ నాయకుల మధ్య చోటు చేసుకున్న రాజకీయ తుఫాన్పై వైసీపీ అధిష్టానం తక్షణం స్పందించిందనే చెప్పాలి. రామచంద్రపురం టికెట్ను తన కుమారుడికి ఇవ్వాలని పట్టుబడుతున్న రాజ్యసభ సభ్యుడు , మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గత రెండు రోజులుగా తీవ్ర హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. రామచంద్రపురంలో ఆదివారం ఆయన.. మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుకు వ్యతిరేకంగా ఉన్నవారితో భేటీ అయ్యారు.
పెద్ద ఎత్తున సభ పెట్టి చెల్లుబోయిన వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహించారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తన కుమారుడికే టికెట్ దక్కుతుందని కూడా చెప్పారు. దీంతో ముసలం మరింత పెద్దదైంది. ఈ పరిణామాలను పరిశీలించిన వైసీపీ అధిష్టానం.. వెంటనే పిల్లికి పిలుపునిచ్చింది. తాజాగా మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ నాయకుడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిల్లి సుభాష్తో భేటీ అయ్యారు. మీరు సీనియర్.. మీరే ఇలా చేస్తే.. పార్టీని రోడ్డున పడేస్తే.. ఎలా అంటూ క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది.
టికెట్ల విషయాన్ని పార్టీ అధినేత జగన్ పరిశీలిస్తున్నారని.. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది.. అందరూ కలిసి మెలిసి ఉండాలని చెప్పినట్టు తెలిసింది. అయితే.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని రాజకీయంగా బరిలో నిలపాలని నిర్ణయించినట్టు సుభాష్ చంద్రబోస్ కుండబద్దలు కొట్టారు. తమకు రాజకీయంగా పలుకుబడి ఉందని.. ప్రజా జీవితంలో 40 ఏళ్లుగా ఉంటున్నామని.. ఇప్పుడు సీటును ఎలా వదులుకుంటామని తేల్చి చెప్పినట్టు తాడేపల్లి వర్గాలు అంటున్నారు. మొత్తానికి సజ్జల జోక్యం చేసుకున్నా.. పరిణామాలు మాత్రం చల్లబడినట్టు కనిపించడం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…