జాతీయ రాజకీయాల్లో పరిణామాలు కేసీయార్ కు షాకిచ్చాయనే చెప్పాలి. నరేంద్రమోడీ నాయకత్వంలో ఢిల్లీలో మంగళవారం సాయంత్రం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో మీటింగ్ జరుగబోతోంది. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే మళ్ళీ అధికారంలోకి వచ్చే విషయమై సలహాలు, సూచనలు తీసుకోవటమే సమావేశం ముఖ్యోద్దేశం. ఎన్డీయేని బలోపేతం చేయటంలో భాగంగా భాగస్వామ్య పార్టీలనే కాకుండా కొత్తగా మరో ఎనిమిది పార్టీలను కూడా బీజేపీ సమావేశానికి ఆహ్వానించింది.
సీన్ కట్ చేస్తే 17,18 తేదీల్లో అంటే సోమవారం బెంగుళూరులో ప్రతిపక్షాల సమావేశం మొదలైంది. దీనికి యూపీఏ కూటమితో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా పాల్గొన్నాయి. బెంగుళూరు సమావేశానికి 24 పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఎన్డీయేని దెబ్బకొట్టేందుకు అవసరమైన వ్యూహాలను చర్చించటమే ప్రధాన అజెండా. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఎన్డీయే నుండి కానీ యూపీఏ నుండి కానీ కేసీయార్ కు ఆహ్వానం అందలేదు.
ఎన్డీయే నుండి ఆహ్వానం అందదనే అందరు అనుకున్నారు. అయితే యూపీఏ కూటమి+ప్రతిపక్షాల నుండి కేసీయార్ కు ఆహ్వానం అందవచ్చని అనుకున్నారు. ఎందుకంటే రెడు కూటములు కూడా తమ బలాన్ని పెంచుకోవాలనే అనుకుంటున్నాయి. అందుకనే కొత్త పార్టీలను భాగస్వాములుగా చేసుకుంటున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరని అందరికీ తెలిసిందే. అవసరాలే పార్టీలను కలుపుతాయి.
ఇలాంటి అవసరాల్లో కూడా కేసీయార్ ను ఎన్డీయే, యూపీఏ కూటములు దగ్గరకు తీసుకోవాలని అనుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే రెండు వైపుల పార్టీలూ కేసీయార్ ను ఏమాత్రం నమ్మటంలేదని అర్ధమైపోతోంది. మరిలాంటి పరిస్ధితుల్లో కేసీయార్ జాతీయ రాజకీయాల్లో ఏ విధంగా చక్రంతిప్పగలరు ? వాళ్ళు ఆహ్వానించి కేసీయార్ హాజరుకాకుండా ఉండుంటే అప్పుడు కేసీయార్ ఇమేజి బాగా పెరిగిపోయేది. కానీ అలా కాకుండా అసలు కేసీయార్ ను ఎవరూ గుర్తించనే లేదు. నిజంగా ఇది కేసీయార్ కు షాకింగ్ అనే చెప్పాలి. మరి దీనిపై కేసీయార్ ఎలా స్పందిస్తారు ? భవిష్యత్ వ్యూహాలు ఎలాగుంటాయో ఆసక్తికరంగా మారింది.
This post was last modified on July 18, 2023 1:00 pm
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…