Political News

చంద్రబాబును వెంటాడుతోన్న ఢిల్లీ దీక్ష

పదవిలో ఉన్నపుడు అవకాశం ఉన్నంతవరకు అధికారాన్ని వాడేందుకు చాలామంది నేతలు మొగ్గుచూపుతారు. పవర్ లో ఉన్నపుడు చలాయింపు ధోరణి….ఏం చేసినా అడిగేవారుండరన్న ధీమా చాలామంది రాజకీయ నేతల్లో ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. అయితే, ఆ విషయాలను పెద్దగా ఎవరూ పట్టించుకోరు కాబట్టి ప్రజా ప్రతినిధులు…ఈ దుబారా ఖర్చు గురించి లెక్కలు చెప్పాల్సిన అవసరం దాదాపుగా రాదు. అయితే, కొన్ని సార్లు పవర్ లో ఉన్నపుడు చేసిన దుబారా ఖర్చు..కొందరు నేతలను వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా, ఏపీ మాజీ సీఎం చంద్రబాబును కూడా ఆ తరహాలోని ఓ దుబారా ఖర్చు వెంటాడుతోంది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్ష తాలూకు ఖర్చు ఇప్పటికీ నీడలా వెంటాడుతోంది. ఆ దీక్షకు ఖర్చు చేసిన నిధులపై తాజాగా లోకాయుక్తలో ఏవీ రమణ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ దీక్షకు రూ.7.5 కోట్ల ప్రజాధనం దుర్వినయోగం చేశారని ఫిర్యాదులో రమణ ఆరోపించారు.

2019లో చంద్రబాబు సీఎం హోదాలో ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేశారు. ఈ దీక్ష కోసం ఏపీ నుంచి ఢిల్లీకి ప్రత్యేకంగా రైళ్లను నడిపారు. దీంతోపాటు, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ జతకూర్చే ప్రయత్నంలో ఆయా పార్టీల నేతల్ని దీక్షకు ఆహ్వానించారు. బీజేపీ, ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. అయితే, ప్రజాధనాన్ని రాజకీయాల కోసం దుర్వినియోగం చేయడంపై ఆనాడే బీజేపీ,వై‌సీపీ ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే ఆ అంశంపై జులై 4న లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా తాజాగా ఆగస్టు 7న కేసు నమోదైంది. ఈ కేసు విచారణ అక్టోబరు 1, 2020 నాటికి వాయిదా పడింది. దీంతోపాటుట, టీడీపీ హయాంలో అవినీతిపై విచారణ జరపాలని కూడా లోకాయుక్తలో ఫిర్యాదు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదులపై లోకాయుక్త ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Share
Show comments
Published by
suman

Recent Posts

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

60 mins ago

వైసీపీ మేనిఫెస్టోపై చంద్ర‌బాబు ఫ‌స్ట్‌ రియాక్ష‌న్

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019…

1 hour ago

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…

2 hours ago

ఆ విషయంలో ఎవరైనా సుకుమార్ తర్వాతే..

టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…

3 hours ago

బాబు సూప‌ర్ సిక్స్‌- జ‌గ‌న్ నైన్ గ్యారెంటీస్‌ ఎవ‌రిది ముందంజ‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సూప‌ర్ సిక్స్‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని…

3 hours ago

మల్లీశ్వరి పెట్టిన ‘కోటి’ కష్టాలు

పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…

5 hours ago