Political News

క్ష‌మాప‌ణ‌లతో నిరీక్ష‌ణ ఫ‌లించేనా పవ‌న‌న్నా?!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా చేస్తున్న వారాహి విజ‌య‌యాత్ర ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని త‌ణుకులో సాగింది ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ కీల‌క నాయ‌కుడు.. విడివాడ రామ‌చంద్ర‌రావుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అది కూడా బ‌హిరంగంగానే కావ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యపోయారు. అయితే.. దీనికి ప‌వనే వివ‌ర‌ణ ఇచ్చారు. తాను క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అనుకున్నాన‌ని. అదికూడాబ‌హిరంగంగానే చెప్పాల‌ని నిర్ణ‌యించుకుని చెబుతున్నాన‌ని వ్యాఖ్యానించారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా త‌ణుకులో వారాహి యాత్ర బ‌హిరంగ స‌భ ప్రారంభం కాగానే విడివాడ రామ‌చంద్ర‌రావుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

అస‌లు విష‌యం ఏంటంటే.. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా విడివాడ రామ‌చంద్ర‌రావు.. జ‌న‌సేన త‌ర‌ఫున ప‌నిచేస్తున్నా రు. అంతేకాదు.. పార్టీలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ప‌వ‌న్ వ‌స్తున్నారా..రావ‌డం లేదా.. అనే విష‌యంతో సంబంధం లేకుండా.. త‌న ప‌నితాను చేసుకునిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే 2019ఎన్నిక‌ల్లో త‌ణుకు అసెంబ్లీ టికెట్‌ను విడివాడ ఆశించారు. కానీ, ప‌వ‌న్ ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలోనే పసుపులేటి వెంక‌ట రామారావుకు టికెట్ ఇచ్చారు. అయితే.. ఆయ‌న మూడో స్తానానికి ప‌డిపోయారు. చిత్రం ఏంటంటే.. త‌న‌కుటికెట్ ఇవ్వ‌క‌పోయినా ప‌సుపులేటి ప్ర‌చారానికి విడివాడ ఎంతో ప‌నిచేశారు.

క‌ట్ చేస్తే..ఎన్నిక‌ల త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిణామాతో ప‌సుపులేటి జ‌న‌సేన జెండో వ‌దిలేశారు. కానీ, విడివాడ రామ‌చంద్ర రావుమాత్రం పార్టీలోనే కొన‌సాగుతున్నారు. ఎక్క‌డా కూడా అసంతృప్తి లేదు. పార్టీ అంటే.. ఇప్ప‌టికీ ప్రాణం పెడుతున్నారు. ఈ విష‌యం మొత్తానికి జ‌న‌సేనానికి చేరింది. ఈ క్ర‌మంలోనే తాజాగా వారాహి యాత్ర‌కు ఆహ్వానించి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఇప్పుడు ప‌వ‌న్ సారీ చెప్పారు. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ తీసుకుని పార్టీ నుంచి జంప్ అయిపోయిన ప‌సుపులేటిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఓకే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, ఇప్ప‌టి కీ కూడా.. ప‌వ‌న్ విడివాడ‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు. త‌ణుకులో నీకు టికెట్ ఇస్తాను. నువ్వు బాగా ప‌నిచేస్తున్నావ్‌! అని ప‌వ‌న్ అని ఉంటే.. ఆ ఊపు మ‌రింత ఎక్కువ‌గా ఉండేద‌ని పార్టీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కానీ ప‌వ‌న్ క్ష‌మాప‌ణ‌లు కోరారు.. కానీ.. ఎక్క‌డా టికెట్ ప్ర‌స్తావ‌న మాత్రం తీసుకురాలేదు. దీనిపైనే పార్టీలో అంత‌ర్గ‌త విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. పార్టీ కోసం ప‌నిచేస్తున్న‌వారిని ప్రోత్స‌హిస్తే.. పార్టీకే మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

This post was last modified on July 15, 2023 11:18 am

Share

Recent Posts

వావ్… ఏపీ లో యూఏఈ పెట్టుబడులు

ఏపీ సీఎం చంద్ర‌బాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో…

24 minutes ago

డెంగీ తాట తీసే టీకా వచ్చేస్తోంది

‘డెంగీ’ దెబ్బ ఎంతలా ఇబ్బంది పెడుతుందో.. మనిషిని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. డెంగీ బారిన…

3 hours ago

విజ‌య్ జననాయకుడు వెనకపడ్డాడు

త‌మిళ సినిమాల మీద తెలుగు ప్రేక్ష‌కుల ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ద‌శాబ్దాలుగా అక్క‌డి నుంచి వ‌చ్చే అనువాద…

8 hours ago

జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే

జగన్ ఇటీవ‌ల కాలంలో స‌హ‌నం కోల్పోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న పార్టీ వారిపై కేసులు పెట్టినా.. త‌మ…

11 hours ago

అంజికి ఒడిస్సికి కనెక్షన్ ఏంటి

అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…

11 hours ago

బుట్టబొమ్మకు ఏ ప్రయోజనం లేదు

బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…

12 hours ago