Political News

క్ష‌మాప‌ణ‌లతో నిరీక్ష‌ణ ఫ‌లించేనా పవ‌న‌న్నా?!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా చేస్తున్న వారాహి విజ‌య‌యాత్ర ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని త‌ణుకులో సాగింది ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ కీల‌క నాయ‌కుడు.. విడివాడ రామ‌చంద్ర‌రావుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అది కూడా బ‌హిరంగంగానే కావ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యపోయారు. అయితే.. దీనికి ప‌వనే వివ‌ర‌ణ ఇచ్చారు. తాను క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అనుకున్నాన‌ని. అదికూడాబ‌హిరంగంగానే చెప్పాల‌ని నిర్ణ‌యించుకుని చెబుతున్నాన‌ని వ్యాఖ్యానించారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా త‌ణుకులో వారాహి యాత్ర బ‌హిరంగ స‌భ ప్రారంభం కాగానే విడివాడ రామ‌చంద్ర‌రావుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

అస‌లు విష‌యం ఏంటంటే.. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా విడివాడ రామ‌చంద్ర‌రావు.. జ‌న‌సేన త‌ర‌ఫున ప‌నిచేస్తున్నా రు. అంతేకాదు.. పార్టీలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ప‌వ‌న్ వ‌స్తున్నారా..రావ‌డం లేదా.. అనే విష‌యంతో సంబంధం లేకుండా.. త‌న ప‌నితాను చేసుకునిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే 2019ఎన్నిక‌ల్లో త‌ణుకు అసెంబ్లీ టికెట్‌ను విడివాడ ఆశించారు. కానీ, ప‌వ‌న్ ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలోనే పసుపులేటి వెంక‌ట రామారావుకు టికెట్ ఇచ్చారు. అయితే.. ఆయ‌న మూడో స్తానానికి ప‌డిపోయారు. చిత్రం ఏంటంటే.. త‌న‌కుటికెట్ ఇవ్వ‌క‌పోయినా ప‌సుపులేటి ప్ర‌చారానికి విడివాడ ఎంతో ప‌నిచేశారు.

క‌ట్ చేస్తే..ఎన్నిక‌ల త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిణామాతో ప‌సుపులేటి జ‌న‌సేన జెండో వ‌దిలేశారు. కానీ, విడివాడ రామ‌చంద్ర రావుమాత్రం పార్టీలోనే కొన‌సాగుతున్నారు. ఎక్క‌డా కూడా అసంతృప్తి లేదు. పార్టీ అంటే.. ఇప్ప‌టికీ ప్రాణం పెడుతున్నారు. ఈ విష‌యం మొత్తానికి జ‌న‌సేనానికి చేరింది. ఈ క్ర‌మంలోనే తాజాగా వారాహి యాత్ర‌కు ఆహ్వానించి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఇప్పుడు ప‌వ‌న్ సారీ చెప్పారు. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ తీసుకుని పార్టీ నుంచి జంప్ అయిపోయిన ప‌సుపులేటిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఓకే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, ఇప్ప‌టి కీ కూడా.. ప‌వ‌న్ విడివాడ‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు. త‌ణుకులో నీకు టికెట్ ఇస్తాను. నువ్వు బాగా ప‌నిచేస్తున్నావ్‌! అని ప‌వ‌న్ అని ఉంటే.. ఆ ఊపు మ‌రింత ఎక్కువ‌గా ఉండేద‌ని పార్టీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కానీ ప‌వ‌న్ క్ష‌మాప‌ణ‌లు కోరారు.. కానీ.. ఎక్క‌డా టికెట్ ప్ర‌స్తావ‌న మాత్రం తీసుకురాలేదు. దీనిపైనే పార్టీలో అంత‌ర్గ‌త విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. పార్టీ కోసం ప‌నిచేస్తున్న‌వారిని ప్రోత్స‌హిస్తే.. పార్టీకే మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

6 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

6 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

8 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

8 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

8 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

9 hours ago