రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. వాస్తవానికి సార్వత్రిక సమరానికి ఇంకా 8 నుంచి 9 నెలల గడు వుంది. అయితే.. అప్పుడే ఎన్నికలు జరుగుతాయా? లేక.. మరో నాలుగు మాసాల్లో తెలంగాణతోపాటే ఎన్ని కలు వస్తాయా? అనేది ఆసక్తిగా మారింది. దీంతో రాజకీయంగా ఏపీలో కొందరు నాయకులు పావులు కదపా లని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకునేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
అంటే.. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి గెలుపు గుర్రం ఎక్కుతుందని భావించే పార్టీలవైపు కీలక మాజీ నేతలు.. మాజీ మంత్రులు.. ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు.. సివిల్ సర్వెంటు.. ఉన్నతాధి కారులు అందరూ చూస్తున్నారు. దీంతో ఇటు టీడీపీ, అటు వైసీపీలోకి చేరేవారి సంఖ్య పదుల్లోనే ఉందని అంచనా వస్తోంది. ఇలాంటివారిలో కొందరు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా ఉన్నారు.
ఓడిన తర్వాత.. పార్టీలకు దూరంగా ఉన్నవారు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు వీరంతా ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదని భావిస్తున్నారు. అంటే.. పొత్తులు ఉన్నా.. లేకున్నా.. కీలకమైన మూడు పార్టీలే బలంగా వచ్చే ఎన్నికలను శాసిస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒంటరి పోరు చేసి.. చేతిలో ఉన్న రూపాయిని పాడుచేసుకోవడం కంటే.. ఏదో ఒక పార్టీలో చేరడం మంచిదనే భావనతో ఉన్నారు. దీంతో వీరు పార్టీలపై అంచనాలకు వచ్చారు.
అధికారంలోకి వచ్చే పార్టీ.. గ్యారెంటీగా అధికారం దక్కించుకునే పార్టీ, ఫిఫ్టీ-ఫిఫ్టీగా అంచనాలు ఉన్నపార్టీ అనే మూడు కేటగిరీలుగా నాయకులు, బ్యూరోక్రాట్లు ఓ అంచనా వేశారు. ఇలా ఇక, ఒక నిర్ణయానికి వచ్చిన నాయకులు, సీనియర్ రిటైర్డ్ అధికారులు కోస్తా, సీమ, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ కలిపి సుమారు 20 -30 మంది ఉంటారని లెక్క. వీరంతా ఆయా పార్టీల్లో చేరేందుకు సంసిద్ధంగానే ఉన్నారు. అయితే.. సర్వేలపైనే వారి గురి ఒకింత అటు ఇటుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా.. వచ్చే రెండు మూడు మాసాల్లో మాత్రం ఈ చేరికలు ఖాయమనే అంచనాలు వస్తున్నాయి.
This post was last modified on July 14, 2023 7:21 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…