రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. వాస్తవానికి సార్వత్రిక సమరానికి ఇంకా 8 నుంచి 9 నెలల గడు వుంది. అయితే.. అప్పుడే ఎన్నికలు జరుగుతాయా? లేక.. మరో నాలుగు మాసాల్లో తెలంగాణతోపాటే ఎన్ని కలు వస్తాయా? అనేది ఆసక్తిగా మారింది. దీంతో రాజకీయంగా ఏపీలో కొందరు నాయకులు పావులు కదపా లని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకునేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
అంటే.. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి గెలుపు గుర్రం ఎక్కుతుందని భావించే పార్టీలవైపు కీలక మాజీ నేతలు.. మాజీ మంత్రులు.. ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు.. సివిల్ సర్వెంటు.. ఉన్నతాధి కారులు అందరూ చూస్తున్నారు. దీంతో ఇటు టీడీపీ, అటు వైసీపీలోకి చేరేవారి సంఖ్య పదుల్లోనే ఉందని అంచనా వస్తోంది. ఇలాంటివారిలో కొందరు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా ఉన్నారు.
ఓడిన తర్వాత.. పార్టీలకు దూరంగా ఉన్నవారు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు వీరంతా ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదని భావిస్తున్నారు. అంటే.. పొత్తులు ఉన్నా.. లేకున్నా.. కీలకమైన మూడు పార్టీలే బలంగా వచ్చే ఎన్నికలను శాసిస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒంటరి పోరు చేసి.. చేతిలో ఉన్న రూపాయిని పాడుచేసుకోవడం కంటే.. ఏదో ఒక పార్టీలో చేరడం మంచిదనే భావనతో ఉన్నారు. దీంతో వీరు పార్టీలపై అంచనాలకు వచ్చారు.
అధికారంలోకి వచ్చే పార్టీ.. గ్యారెంటీగా అధికారం దక్కించుకునే పార్టీ, ఫిఫ్టీ-ఫిఫ్టీగా అంచనాలు ఉన్నపార్టీ అనే మూడు కేటగిరీలుగా నాయకులు, బ్యూరోక్రాట్లు ఓ అంచనా వేశారు. ఇలా ఇక, ఒక నిర్ణయానికి వచ్చిన నాయకులు, సీనియర్ రిటైర్డ్ అధికారులు కోస్తా, సీమ, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ కలిపి సుమారు 20 -30 మంది ఉంటారని లెక్క. వీరంతా ఆయా పార్టీల్లో చేరేందుకు సంసిద్ధంగానే ఉన్నారు. అయితే.. సర్వేలపైనే వారి గురి ఒకింత అటు ఇటుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా.. వచ్చే రెండు మూడు మాసాల్లో మాత్రం ఈ చేరికలు ఖాయమనే అంచనాలు వస్తున్నాయి.
ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే…
మన దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థలో అలసత్వం అంతకంతకూ పెరిగిపోతోంది. శాసన వ్యవస్త ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన కీలకమైన బాధ్యత…
ఏపీలో సోమావరం ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ భారీ ప్రమాదంలో ఏకంగా…
ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి కీలక సమావేశానికి కాంగ్రెస్ సన్నిహిత పార్టీలు హాజరవుతూ పాలిటిక్స్ లో మళ్లీ హీట్ పెంచాయి.…
నెల్లూరు జిల్లాకు చెందిన పొలిటికల్ ఫ్యామిలీ మేకపాటి కుటుంబంలో ఆస్తుల రచ్చ రోడ్డుకెక్కింది. ఈ కుటుంబం నుంచి పలువురు నాయకులు…
ఈ మధ్య తమన్ సౌండ్ కొంచెం తగ్గిపోయింది. తన నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక అభిమానులు ఎదురు చూస్తున్నారు.…