రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. వాస్తవానికి సార్వత్రిక సమరానికి ఇంకా 8 నుంచి 9 నెలల గడు వుంది. అయితే.. అప్పుడే ఎన్నికలు జరుగుతాయా? లేక.. మరో నాలుగు మాసాల్లో తెలంగాణతోపాటే ఎన్ని కలు వస్తాయా? అనేది ఆసక్తిగా మారింది. దీంతో రాజకీయంగా ఏపీలో కొందరు నాయకులు పావులు కదపా లని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకునేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
అంటే.. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి గెలుపు గుర్రం ఎక్కుతుందని భావించే పార్టీలవైపు కీలక మాజీ నేతలు.. మాజీ మంత్రులు.. ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు.. సివిల్ సర్వెంటు.. ఉన్నతాధి కారులు అందరూ చూస్తున్నారు. దీంతో ఇటు టీడీపీ, అటు వైసీపీలోకి చేరేవారి సంఖ్య పదుల్లోనే ఉందని అంచనా వస్తోంది. ఇలాంటివారిలో కొందరు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా ఉన్నారు.
ఓడిన తర్వాత.. పార్టీలకు దూరంగా ఉన్నవారు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు వీరంతా ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదని భావిస్తున్నారు. అంటే.. పొత్తులు ఉన్నా.. లేకున్నా.. కీలకమైన మూడు పార్టీలే బలంగా వచ్చే ఎన్నికలను శాసిస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒంటరి పోరు చేసి.. చేతిలో ఉన్న రూపాయిని పాడుచేసుకోవడం కంటే.. ఏదో ఒక పార్టీలో చేరడం మంచిదనే భావనతో ఉన్నారు. దీంతో వీరు పార్టీలపై అంచనాలకు వచ్చారు.
అధికారంలోకి వచ్చే పార్టీ.. గ్యారెంటీగా అధికారం దక్కించుకునే పార్టీ, ఫిఫ్టీ-ఫిఫ్టీగా అంచనాలు ఉన్నపార్టీ అనే మూడు కేటగిరీలుగా నాయకులు, బ్యూరోక్రాట్లు ఓ అంచనా వేశారు. ఇలా ఇక, ఒక నిర్ణయానికి వచ్చిన నాయకులు, సీనియర్ రిటైర్డ్ అధికారులు కోస్తా, సీమ, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ కలిపి సుమారు 20 -30 మంది ఉంటారని లెక్క. వీరంతా ఆయా పార్టీల్లో చేరేందుకు సంసిద్ధంగానే ఉన్నారు. అయితే.. సర్వేలపైనే వారి గురి ఒకింత అటు ఇటుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా.. వచ్చే రెండు మూడు మాసాల్లో మాత్రం ఈ చేరికలు ఖాయమనే అంచనాలు వస్తున్నాయి.
This post was last modified on July 14, 2023 7:21 am
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర…
ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…
యాంకర్గా మొదలై, హీరోయిన్గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…