రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. వాస్తవానికి సార్వత్రిక సమరానికి ఇంకా 8 నుంచి 9 నెలల గడు వుంది. అయితే.. అప్పుడే ఎన్నికలు జరుగుతాయా? లేక.. మరో నాలుగు మాసాల్లో తెలంగాణతోపాటే ఎన్ని కలు వస్తాయా? అనేది ఆసక్తిగా మారింది. దీంతో రాజకీయంగా ఏపీలో కొందరు నాయకులు పావులు కదపా లని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకునేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
అంటే.. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి గెలుపు గుర్రం ఎక్కుతుందని భావించే పార్టీలవైపు కీలక మాజీ నేతలు.. మాజీ మంత్రులు.. ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు.. సివిల్ సర్వెంటు.. ఉన్నతాధి కారులు అందరూ చూస్తున్నారు. దీంతో ఇటు టీడీపీ, అటు వైసీపీలోకి చేరేవారి సంఖ్య పదుల్లోనే ఉందని అంచనా వస్తోంది. ఇలాంటివారిలో కొందరు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా ఉన్నారు.
ఓడిన తర్వాత.. పార్టీలకు దూరంగా ఉన్నవారు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు వీరంతా ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదని భావిస్తున్నారు. అంటే.. పొత్తులు ఉన్నా.. లేకున్నా.. కీలకమైన మూడు పార్టీలే బలంగా వచ్చే ఎన్నికలను శాసిస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒంటరి పోరు చేసి.. చేతిలో ఉన్న రూపాయిని పాడుచేసుకోవడం కంటే.. ఏదో ఒక పార్టీలో చేరడం మంచిదనే భావనతో ఉన్నారు. దీంతో వీరు పార్టీలపై అంచనాలకు వచ్చారు.
అధికారంలోకి వచ్చే పార్టీ.. గ్యారెంటీగా అధికారం దక్కించుకునే పార్టీ, ఫిఫ్టీ-ఫిఫ్టీగా అంచనాలు ఉన్నపార్టీ అనే మూడు కేటగిరీలుగా నాయకులు, బ్యూరోక్రాట్లు ఓ అంచనా వేశారు. ఇలా ఇక, ఒక నిర్ణయానికి వచ్చిన నాయకులు, సీనియర్ రిటైర్డ్ అధికారులు కోస్తా, సీమ, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ కలిపి సుమారు 20 -30 మంది ఉంటారని లెక్క. వీరంతా ఆయా పార్టీల్లో చేరేందుకు సంసిద్ధంగానే ఉన్నారు. అయితే.. సర్వేలపైనే వారి గురి ఒకింత అటు ఇటుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా.. వచ్చే రెండు మూడు మాసాల్లో మాత్రం ఈ చేరికలు ఖాయమనే అంచనాలు వస్తున్నాయి.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…