జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుంచి వారాహి పాదయాత్రను ఈరోజు నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన పవన్ ఆ తర్వాత కత్తిపూడిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను చూసేందుకు, వారాహి యాత్రలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కత్తిపూడికి తరలివచ్చారు.
ఈ నేపథ్యంలోనే పవన్ వచ్చే మార్గంలో వేలాది మంది అభిమానులు ఆయనను చూసేందుకు బారులు తీరారు. ఈ నేపథ్యంలోనే పవన్ పర్యటనలో అపశృతి జరిగింది. కత్తిపూడిలోని బహిరంగ సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన లైట్ స్టాండ్ పైనుంచి కిందపడి ఒక అభిమాని తీవ్ర గాయాలపాలయ్యాడు. పవన్ ను సమీపం నుంచి చూడాలన్న ఆతృతలో కొందరు యువకులు లైట్ స్టాండ్ పైకి ఎక్కారు.
అయితే లైట్ స్టాండ్ పై తోపులాట జరగడంతో ఓ యువకుడు కింద ఉన్న కరెంటు తీగలపై పడ్డాడు. అప్రమత్తమైన మిగతా యువకులు వెంటనే గాయపడ్డ యువకుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కావడానికి ముందే అపశృతి జరగడంతో జనసైనికులు కొందరు ఆందోళన చెందుతున్నారు. గతంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ముందు కూడా సినీ నటుడు, టీడీపీ నేత తారక రత్న హఠాత్తుగా కుప్పకూలిపోవడం, ఆ తర్వాత నెలన్నర పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందడం తెలిసిందే.
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…